Sunday 29 May 2016

సుందరకాండ - సుందర తత్త్వం - daily serial (1)

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ: - 
ప్రాంజలి ప్రభ - సుందర తత్త్వం -
సర్వేజనా  సుఖినోభవంతు 


హనుమజయంతి సందర్బముగా సుందరకాండ వచస్సును ప్రతిఒక్కరికి అర్ధం అయ్యే విధముగా హనుమంతుని సహాయముతో నేను వ్రాయుట ప్రారంభించినాను, ప్రతి ఒక్కరికి " సీతారామాంజనేయ" కృపాకటాక్షాలు అందాలని ఆశిస్తున్నాను, ఎందఱో మహానుభావులు అందరికి వందనములు. 
 
ఆదికవి వాల్మీకి రచించిన ప్రతి శ్లోకం భావాన్ని ముందు పొందు పరుస్తున్నాను, అది కూడా చివర "ను" అనే అక్షరంతో వ్రాయటం జరిగింది, సుందర తత్వాన్ని మాత్రం నేను వర్ణించు కుంటూ వస్తు న్నాను, తప్పులుంటే తెలుపగలరు, ప్రతి ఒక్కరు చదివి  చదవమని చెప్పగలరు, అందరూ హనుమంతుని కృపకు పాత్రు లగుదురు, ఇది ఖశ్చితము, నేను సంవస్చరము నుండి నా బ్లాగులో వ్రాస్తున్నాను, ఇప్పుడే వెబ్సైటు ఫేస్ బుక్ ద్వారా   అందరికి తెలిపి సీతారామాంజనేయ కృపకు పాత్రులుకాగలరని ఆశిస్తున్నాను. 
    
సుందరకాండ - సుందర తత్త్వం - తెలుగు వచస్సు ( 1వ సర్గము ) 

అసంఘటితమైన శక్తిఉన్నా హనుమంతుడు అణిగి మణిగి ఉండి, అందరి ఆదరణ పొందుతూ, తన్ను ఆదరించి తన కర్తవ్యాన్ని భోధించిన, రాముని కార్యమును సఫలీకృతము చేయటకు, నిగ్రహ శక్తితో మహేంద్ర గిరి పర్వతముపై ఉండి, చేయ వలసిన కార్యమును ఆలోచిస్తూ ఉండగా తన తోటి వానరు లందరూ బాధలో ఉండుట గమనించెను.

****

  
* (1)(  కార్యము సాధించ గలమని ప్రతి ఒక్కరికి, నిగ్రహ శక్తి ఉండాలి అందరకు, నమ్మకము, ఆత్మ విశ్వాసము  ఉండాలి ).

జాంబ వంతుడు, వానరులందరు, కలసి  సీతాన్వేషినిమిత్తం దక్షిణ దిక్కు అంతా చూసినను సీత జాడ కనుగొన లేక పోయెను,  వానరరాజు, ఇచ్చిన సమయము మించి పోయినది, ముందుకు పోవు మార్గము లేక, వెనుకకు పోలేక,  దిగులుతో అందరూ ప్రాణార్పణం చేయ తలంచెను.

 *(2) అవేశము లో ఉన్నప్పుడు ఆలోచనా శక్తి నశించును, చేతకాని వారిగా మార్చును)   
(*) అను భవజ్ఞులు చెప్పేమాటలు ఆలకించి అనుకరించ వలెనని తెలియ బడుతుంది 

అందరితో అంగదుడు, జటాయువును తలస్తూ విలపించసాగెను, కార్యార్దమై జటాయువు భాత్రు (అన్న) సంపాతి అంగదుని కలిసెను,

సంపాతి దక్షిణదిక్కున లంకలో సీత రావణుని బందీలో ఉందని చెప్పెను,  అందరు కలసి, సముద్ర వడ్డుకు చేరి సముద్రాన్ని దాట తలచెను.

 *3 ( ఆశించిన పనికి దేవుడు సహాయము చేస్తాడనుటకు ఇది ఒక నిదర్సనం, నాయకుడనేవాడు పలువిధాలుగా అలోచించుటవల్ల  మంచి వారికి మంచే జరుగును అని ఒక నిదర్సనం ఆలోచనలు కుడా మంచిగా వచ్చును  )      

సంపాతికి సీత జాడ తెలుపగా రెక్కలు వచ్చి వెళ్ళేను, వానరులు సముద్రాన్ని దాటగల శక్తి గూర్చి తెలుపెను,  అంగదుడు, జాంబవంతుడు సంశయములో పడెను,  సముద్రాన్ని దాటుటకు అందరు  హనుమంతుని ప్రేరేపించెను.

4* ( శక్తిని మించిన కార్యమని తలచుట సహజము, పెద్దల మాటను అనుకరించుట ఇంకా అవసరము, ఎవరి శక్తి వారు తెలుపుట కూడా  ఒక అవసరము, అందుకే జాంబవంతుడు హనుమంతుని శక్తి తెలిసినాడు కనుక ప్రేరేపించుటకు ముందు వచ్చును, పెద్దలను గౌరవించ టం వల్ల సీతాన్వే షనకు మార్గము సులభమాయెను)      
(*)ప్రోత్సాహం కొండంత   బలం అని తెలుపుతున్నది, ఏ పరిస్థితులలోను నిరుత్సాహ పరచకూడదు . 
రామనామ జపంతో, హనుమంతుడు మహేంద్రగిరిపై ఉండెను, జాంబవంతాదులందరూ కలసి హనుమంతుని పొగడెను తనశక్తి తనకే తెలియక ప్రొత్సాహముతో  శక్తిని పెంచుకొనెను, చారులు సంచరించే మార్గానా సముద్రంపై పోవుట నిశ్చయించెను.

*(5. పసి పిల్లవానికి  పాలు త్రాగితే ఎంత సంతోషమో, రామనామ జపమే హనుమంతునకు అంతకన్నా ఎక్కవ సంతోషము, తనలో ఉన్న ఆత్మ తేజాన్నిఉత్తేజ పరిస్తే ఎటువంటి వారైన కార్యసాదకులుగా మారుతారు, ఓం శ్రీ రామ్ , ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ అంటూ ఆధారము లేని గగన మార్గం ఎన్నుకోవటం ఒక నిదర్సనం, ఆధారము లేక పోయినా సాధించగలమని తపన ఉండుటే ఇందులో నీతి) 


                                                                                                   ( 1వ సర్గము - ఇంకా ఉంది  )


*****


 సుందరకాండ - సుందర తత్త్వం - తెలుగు వచస్సు ( 1వ సర్గము - ఇంకా ఉంది  )

* పచ్చిక బీల్లపై ఉన్న హనుమంతుడు ఆకు పచ్చని వర్ణముతోను, పచ్చిక బీల్లపై ఉన్ననీటి బిందువులు వైడూర్యమణుల    వలే మెరుపులతోను, దూరముగా ఉన్న  జలము పై సూర్య కిరణాల ప్రభావ వెలుగులతోను, ధీరుడైన హనుమంతుడు మహేంద్రగిరిపై సీఘ్రముగా సంచరించెను.

 *(6) ఏ  శుభకార్యము జరగాలన్న పచ్చటి తోరణాలు కట్టుట, మెరుస్తున్న కాంతి పుంజాలను వ్రెలాడదీస్తూ, పరిశుబ్రమైన జలమును నిలువచేస్తూ, సూర్య కిరణాలతో గాలి ప్రవేసించు నట్లు చేసితే అందరూ హాయిగా సంచరిన్చగలరని వాల్మీకి మనకు భోధించారు )          

* మహేంద్రగిరిపై చిత్రవర్ణములుగల ధాతువుల తోను, యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దేవతామూతృల తోను, స్వేచ్చ జీవులుగా సింహాలు, ఉత్తమ గజాల సంచారముల తోను,  హనుమంతుడు మహ హృదయముతో  ఐరావతం వలే ప్రకాశించెను


* (7) ఒక వివాహ వేడుకలో పలురకాలు వస్త్రాలు ధరించిన స్త్రీలు పురుషులు, వేదాలు వల్లించే పండితులు, మంచిగా భుజించే వారు, మంచి చెడుల సంబాషించుకొనే వారు సింహం వాలే అజమాయషీ చేసి ప్రవర్తించేవారు, గజం వలె మొద్దు చాకిరీ చేసేవార్లు    మద్య ఎత్తైన పీఠంపై  నూతన వదూవరులు మహ హృదములో ఐరావతం వలే ప్రకాశిస్తూ ఉండాలనేది ఈ శ్లోకం నీతి)     

^ సకల విద్యలు నేర్పిన గురువు గారగు సూర్యనికి నమస్కరించెను, బాల్యంలో భాధపెట్టిన దేవతల రాజైన ఇంద్రునికి నమస్కరించెను, సృష్టికర్త ఐన బ్రహ్మదేవునకు, సకల భూతములకు నమస్కరించెను.


*(8) ఏపని అయినా చేసేముందు, ప్రయాణానికి  పోయే ముందు,  శుభకార్యము చేసే ముందు ఎవరైనా సరే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాన్నీ ముందుగా ప్రార్ధించాలి, తరువాత తల్లి తండ్రులకు, మనకన్నా పెద్దలైన గురువులకు అధికారులకు ప్రణామాలు చేయాలి, స్నేహితులను, భందువులను  ప్రతి ఒక్కరిని చక్కగా పలకరిస్తూ ముందుకు సాగా లనేదే ఈ శ్లోక భావం)         

* మారుతి కడలిపై గగన సీమలో ప్రయాణం చేయ తలంచెను, మారుతి తూర్పునకు తిరిగి తండ్రి ఐన వాయుదేవునకు నమస్కరించెను, దక్షణదిక్కుకు తిరిగి వెళ్ళుటకు శిరస్సు పైకి ఎత్తి ఆబోతువలె ప్రకాశించెను.


* (9) మనం  చేసే కార్యము ఎంతో  కష్టమని అనుకో కూడదు,  ఎందుకంటే తూర్పునకు తిరిగి ముందుగా తల్లి తండ్రులకు నమస్కరించి మరలా దక్షణ దిక్కుకు తిరిగి చేయవలసిన కార్యమును మొదలు పెట్టి నట్లైతే ఎక్కడలేని శక్తి మీలో  ప్రవేసిస్తుందని, ఎదురు లేకుండా పని సాను కూలముగా జరుగు తుందని ఈ శ్లోక భావం)      

* హనుమంతుడు పౌర్ణమినాడు సముద్రుడు పొంగినట్లుగా శరీరాన్ని పెంచెను, వానరు లందరూ చూచు చుండగా రామకార్యము కొరకు ఆకాశమార్గమున ప్రయాణం చేసెను, 


*(10) సముద్రములో ఎన్నిజీవులున్నాయొ అంతమంది మానవులు శుభకార్యానికి సహకరిస్తారు, ఆ పరిస్తితిలో మనోధైర్యము పెరిగి పిల్లల పెళ్లి మేళ తాళాలతో జరుపుటకు దృడసంకల్పంతో ప్రయాణం చేయాలన్నదే ఇందులో నీతి)   
****** 

సుందరకాండ - సుందర తత్త్వం - తెలుగు వచస్సు ( 1వ సర్గము )3/15

  పాదాల కదలికలకు చెట్లపై ఉన్న పక్షులు భయపడెను, వక్షస్థల ఘాతముతో చెట్లు కూలి పోయెను, సింహం విజ్రుమ్భించి నట్లు విజ్రుం భించగా మృగాలు మరణించెను, మద్యమ జ్వాలలతో కూడిన అగ్ని నుండి ధూమము బయలు దేరెను,          
*(11) శుభ కార్యము జరుగుతున్నప్పుడు ఆకాశ కదలికలు, భూమి కదలిక ఉంటె శుభ సూచకాలని ఇందు మూలముగ తెలియ చేస్తున్నారు, సంకల్ప సిద్దితో ముందుకు పోయేవారి రూపమ్ ఎప్పుడూ  సింహములా ఉంటుంది, కొన్ని మాటలు జ్వాలలుగా మరికోన్నిమాటలు చల్లని జల్లులుగా మానవులను ఆవహిస్తూ ఉంటాయనే గ్రహించాలి,  శుభకార్యాన్ని పడుచేయాలనే దుర్మార్గుల గుండెల్లో సింహ స్వప్నం  ఉండాలనేది ఇందు నీతి)    

కొలుచుటకు శక్యము కానంత పెద్దదిగా శరీరమును పెంచెను, చేతులతోనూ, పాదములతోను, పర్వతమును గట్టిగా నొక్కెను
పర్వతము ఒక్కసారి ఊగగా చెట్లపైఉన్న పూవ్వులన్ని రాలెను, హనుమంతునిపై పుష్పాభిషేకమువల్ల పుష్పముల కొండవలె  ఉండేను.
*(12) శుభకార్యము చేసేవారు ఎవరా అని తెలుసు కోలేని విదముగా లీనమై పోవాలనే విషయాన్ని, ఉస్చాస నిస్వాసాలు మెత్తము కార్యదీక్షపై ఉంచి ఎవరు ఎమన్నా పట్టించుకోకుండా ఉండాలని, పెళ్ళిలో పుష్పాలు పంచుట కూడా  ఇందులో భాగమే,   అందరి దృష్టిలో మహానుభావుడు పూజింప దగిన మహాత్ముడు అనిపించుకోవాలని తెలియ పరిచిన నీతి)   

పర్వతముపై మదించిన ఏనుగులు మదోదకమును కార్చు చుండెను, పర్వతముపై ఉన్న ప్రాణులన్నీ వికృతమైన స్వరముతో అరచు చుండెను, సమస్త వర్ణ శిలలమద్య అగ్ని పుట్టివర్ణ దూమములు వచ్చు చుండెను, భూప్రకమ్పనల మద్య హనుమంతుడు బయలు దేరుటకు నిశ్చయించెను . 


*(13) వివాహమునందు మదించిన వారు అంటే అత్యధికంగా  ధనమున్నదనే గర్వపడేవారు, ఎవరికీ తోచిన విధముగా వారు కల్పించి  కధలు చెప్పుకుంటూ పెళ్లిని వర్ణంచేవారు, కామంతో విర్ర వీగేవారు, నన్నే చూడాలని కేశాలు విరబూసుకొని, అరువు తెచ్చిన నగలు పెట్టుకొని ఆకర్షణ కోసం పాకు లాడేవారు, ఎన్ని తగాదాలు వచ్చిన, ఎన్ని పొగలు వెంబడించిన మనోనిగ్రహ శక్తితో "కర్త"  ఉండాలనేదే ఇందు నీతి)             


తొకలపై స్వస్తిక్ చిహ్నములుగల సర్పములు నిలిచెను, విషము క్రక్కుచూ దంతములతో శిలలను కరచెను, శిలలు అగ్నిజ్వాలకు దగ్ధమై వేయి ముక్కలై ఎగెరెను, గిరిపై ఓషధ చెట్లు ఉన్న, శాంతింప చేయలేక పోయెను.


*(14 ) వివాహ వేదికలో కొందరు పెద్దలు, స్నేహితులు  సహకరిస్తూ సహాయము చేసే విధముగా ఉండాలని, ఓర్వలేవారు, తంపులు పెట్టేవారు ఉంటారు, జాగర్తగా ఉండాలని, హొమంలో సమిధులు ఆహుతి అవుతూ ఆ పొగ అంతా ఆవహించి చెడుని నాశనము చేయ గలదని ఇందు మూలముగా తెలుసుకోగలరు, కొందరు వితండ వాదులు, మూర్కులు, త్రాగినవారు  ఉంటారు, వారిని ఎటువంటి మందు శాంతిప చేయలేదని జాగర్తగా వారినుండి తప్పించుకొని కార్యము చేయాలనేదే ఇందు నీతి)    

భూతాలు పర్వతమును బద్దలు చేయు చున్నాయని తలచెను,  తినుచున్న లేహ్యములు, భక్ష్యములు, మాంసములు విడిచెను,  మునులు, యక్షులు,  విద్యాధరులు వారి స్త్రీలతో పైకే ఎగిరెను , అణిమా సిద్దులుగల విద్యాధరులు హనుమంతుని చూసి ఆరాదించెను
 

*(15) వివాహ వేడుకల లో సన్నాయి మాలములుతో,  కర్ణ ఖటోరమైన శబ్ధములతో బ్యాన్డుమేలములతో, పర్వతాలు బద్దలు చేయు శబ్దాలతో ఊరే గింపులు చేస్తున్నారు,    లేహ్యములు, భక్ష్యములు, మాంసములు భుజించుటకు చేస్తున్నారు  అవి ఆరగించి పెద్ద లందరూ నవ వదువులకు దీవించి ఆసీర్వాదములు  ఇవ్వటమే ఇందు ప్రధానము.
***** 


సుందరకాండ - సుందర తత్త్వం - తెలుగు వచస్సు ( 1వ సర్గము )


మెడలో హారములతోను ,  పాదములకు అందెలతోను, భుజములకు దండ కడియములతో,చేతులకు కంకణముల తోను, విద్యాదర స్త్రీలు ఆశ్చర్యపడుచు, భయముతో తమ ప్రియుల తోను, విద్యాధరులు పర్వతముపై నిలిచి హనుమంతుని గూర్చి సంభాషించెను. 
* (16)వివాహ వేడుకల ఊరేగింపులను  స్త్రీలు పురుషులు అందరూ చూసి,  కొందరు ఇద్దరు ఈడు అనేవారు, మరి కొందరు కాకిపిల్లకు దొండ పండు అనేవారు, మరికొందరు పెద్దలను గూర్చి సంభాషించు  కొనేవారు అనేదే నీతి   

శోభగల హనుమంతుడు భుజమును,  కంఠంను వంచెను, తేజస్సును,వీర్యమును,బలమును, పెంచి ఊపిరి బిగపట్టెను, 
నేత్రములు పెకిఎత్తి, పాదములతో గిరిని అదిమి  పై ఎగెరెను, మహాబలశాలీ, వానర శ్రేష్టుడు చేతులను చేర్చి సముద్రముపై చేరెను   
*(17) ఎవరైనా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళాలన్న, పైకి ఎగరాలన్న హనుమంతుని ద్యానిస్తే తప్పక విజయము సాధించును.

మకరములకు నివాసమైన సముద్రమును దాట దలచెను, పర్వతమువంటి శరీరముగల హనుమంతుడు ఒక్కసారి కదలెను, రోమములు దులుపుకొని, మహా మేఘము వలె ఘర్జించెను , రామునికోరకు, వానరులకోరకు సముద్రముపై లంఘించెను .
(*(18) మనం బయలు దేరేటప్పుడు ఎన్నో అవాంతరాలు వస్తాయి, అయిన వాటిని ఎదుర్కొని  శక్తి మన శరీరములోనే అంతర్గతముగా శక్తి ఉండును, అదే మనకు శక్తిని వాక్కును నిగ్రహించుకొని ముందుకు సాగాలి.)
    
హనుమంతుని సముద్రలంఘనము గగనమునుండి   దేవలోకమునకుపోయిఅక్కడ సీతనువెదికెదను, కానరానిచో లంకకు పోయి రావణుని నగరముతోసహా తే గలగు తాను,  ఆకాశమునుండి వానర వీరులందరికి మారుతి అమృత మాటలు పల్కెను.  గమ్భీరముగా జెప్పుచూ నొక్క యూపు లొ సముద్రముపై కెగసెను.
(*(19)  మనం బయటకు వెల్లేటప్పుడు చేయవలసిన పని ఖచ్చితముగా చేయగలనని అందరికి గట్టిగా నమ్మేటట్లు చెప్పవలెను, మనం చేయలేని పనులుకూడ చేయగలనని చెప్పి అందరికి  ధైర్యము కలిగించి మరీ వెళ్ళవలెను, ఇది గ్రహించ గలరు.)      

అతని తొడల వేగమునుండి వచ్చిన గాలికి చెట్లువ్రేళ్ళతో సహా పైకి ఎగేరెను, దూరమునకు పోవు భందువులను పంపినట్లుగా కొంతదూరము పోయెను, మరలి చెట్లు అన్ని సముద్రములో రెక్కలు తెగిన పర్వతముల వలే పడెను, మహ సముద్ర మంతా పగటి పూట నక్షత్రాలతో నిండిన ఆకాశంవలె ప్రకాశించెను.
(*(20) కొత్తగా పెళ్ళైన వధూవరులతో  అందరూ కలసి కొంత దూరము దాకా నడచి వారు వెళ్ళాక చూసి తర్వాత  వెనుకకు వచ్చుట సహజము, అందరూ ఎవరి ఇంటికి వారు వెల్లుటే ఇది సత్యము. వివాహము చేసుకొనేటప్పుడు తలంబ్రాలు వధూవరులు ఒకరి తలపై ఒకరు పోసుకుంటూ సంతోషముగా ఉండుట  చూసిన వారికీ ఏంతో సంతోషముగా ఉంటుంది, అపుడు అందరు దీవెనలు అందిస్తారు, మేలతాలాలు మ్రోగిస్తారు, దేవతలే దిగివచ్చి ఆసీర్వాదములు పచుతున్నట్లు పెళ్లి పందిరి అంతా ప్రకాశ వంత మైన వెలుగులు విస్తరించును ఇదియే ఈ శ్లోకంలో నీతి)       


*******


సుందరకాండ - సుందర తత్త్వం - తెలుగు వచస్సు ( 1వ సర్గము )

భూతాలు పర్వతమును బద్దలు చేయు చున్నాయని తలచెను,   తినుచున్న లేహ్యములు, భక్ష్యములు, మాంసములు విడిచెను  మునులు, యక్షులు,  విద్యాధరులు వారి స్త్రీలతో పైకే ఎగిరెను, హనుమంతుడు పాద స్పర్స అంత అమోఘం.
*21. మంచివారు మనగ్రామ్గలో ఉనె అంటా మంచి జరుగును అనిభావించాలి, మంచి వారు లేని ప్రాంతము ఎప్పుడూ భూమి ప్రకంపనలు వస్తాయి, తినే ఆహారము దొరకక భాదలు వహించాలసు వస్త్గుంది, వలసి పోయే పరిస్తితి వస్తుంది అది గమనిమ్చుటే  ఈ శ్లోకం నీతి      

మెడలో హారములతోను ,  పాదములకు అందెలతోను, భుజములకు దండ కడియములతో,చేతులకు కంకణములతోను
విద్యాదరస్త్రీలు ఆశ్చర్యపడుచు, భయముతో తమ ప్రియులతోను , విద్యాధరులు పర్వతముపై నిలిచి హనుమంతుని గూర్చి సంభాషించెను.
*22. ధనవంతులు సంపాదించిన ధనములో కొంత బంగారములోకి మారుస్తారు, వాటి రక్షణ కోసం బ్యాంకుల్లో దాచుతారు,  కొందరునిత్యము ధరిస్తూ ఉన్నారు, కాని అనుకోని పరిస్తితిలో దొంగిలించటం జరిగిందని, రక్షణ కాశము అవుతుందని అంటే బంగారము గూర్చి, ధనవంతుని గూర్చి పలువిధాలుగా సంభా షించుకుంటారనేది ఇందు నీతి.
     
శోభగల హనుమంతుడు భుజమును,  కంఠంను వంచెను, తేజస్సును,వీర్యమును,బలమును, పెంచి ఊపిరి బిగపట్టెను
నేత్రములు పెకిఎత్తి, పాదములతో గిరిని అదిమి  పైకి  ఎగెరెను, మహాబలశాలీ, వానర శ్రేష్టుడు చేతులను చేర్చి సముద్రముపై చేరెను, 
 

*23. ప్రతిఒక్కరు తేజస్సును,వీర్యమును,బలమును పెంచు కుంటూ ఉండాలి, అవసరము వచ్చినప్పుడు అధర్మాన్ని ఎదుర్కొనుటకు పతిఒక్కరు సంఘటితంగా ఏకమై ముందుకు సాకి చేతులు చేతులు కలిపి ఉద్యమించాలి.
 
మకరములకు నివాసమైన సముద్రమును దాట దలచెను, పర్వతమువంటి శరీరముగల హనుమంతుడు ఒక్కసారి కదలెను, రోమములు దులుపుకొని, మహా మేఘము వలె ఘర్జించెను, రామునికోరకు, వానరులకోరకు సముద్రముపై లంఘించెను.
*24. మనం బ్రతకల్సింది ఇతరులు కోసం అని గమనించాలి, సముద్రం లాంటిమన మనస్సును అదుపులో పెట్టుకొని ప్రవర్తించాలి,  అవసర మైనప్పుడు ధర్మం కొరకు తప్పని పరిస్తితిలో దుర్మార్గానిపై  ఘర్జన చేయాలనేదే, స్నేహితులను బంధు వులను ఆదుకోవాలనేదే  ఇందు నీతి.
    
గగనమునుండి   దేవలోకమునకుపోయిఅక్కడ సీతనువెదికెదను, కానరానిచో లంకకు పోయి రావణుని నగరముతోసహా తేగలగు తాను , ఆకాశము నుండి వానర వీరులందరికి మారుతి అమృత మాటలు పల్కెను, గమ్భీరముగా జెప్పుచూ నొక్కఊపులో సముద్రముపై కెగసెను, అణిమా సిద్దులుగల విద్యాధరులు హనుమంతునిచూసి ఆరాధించెను. 
 

*25. ఏవిషయమైన ఘమ్భీరముగ చెప్పాలి, చెప్పిన మాటను నిలబెట్టు కోవాలి, ఎవ్వరి మనస్సును నొప్పించక అందరి మనస్సు శాంత పరిచే మాటలు పలకాలి అనేడి ఇందు నీతి .

*****


సుందరకాండ - సుందర తత్త్వం - తెలుగు వచస్సు ( 1వ సర్గము )5/20
అతని తొడల వేగమునుండి వచ్చిన గాలికి చెట్లువ్రేళ్ళతో సహా పైకి ఎగేరెను, దూరమునకు పోవు భందువులను పంపినట్లుగా కొంతదూరము పోయెను, మరలి చెట్లు అన్ని సముద్రములో రెక్కలు తెగిన పర్వతముల వలే పడెను, మహ సముద్ర మంతా పగటి పూట నక్షత్రాలతో నిండిన ఆకాశంవలె ప్రకాశించెను.
(*26 పెళ్లి చేసి  వధువరులను  సాగనంపేటప్పుడు కొంత దూరము వచ్చి వెనుకకు వెళ్ళుట    అనేది హనుమంతుని వెంబడించిన చెట్లులాగా ఉంటుంది, పిల్లను పంపిన తర్వాత  అన్దరూ నీరసముగా అన్నిసర్డుకొని వేల్లుటే వజ్ర  హతమైన పర్వతాలు ఒక్కసారిగా  కూలినట్లు వారి మనసు భధకరముగా  మారుతున్నదనేదే  ఇందు నీతి)   

హనుమంతుని రెండు బాహువులు పాము పడగలువలే కనిపించెను, అతని రెండు నేత్రములు పర్వతముపై రెండు అగ్నిజ్వాల లవలే  ప్రకాశించెను,    అతని వాలము ఇంద్ర ద్వజము వలే ధగ ధగ మెరుయు చుండెను, అతని ముఖము సంద్యారాగముతో కూడిన సూర్యబింబమువలె నుండెను.
(*27. నిత్య అగ్ని హోత్రుని  దృష్టి చూడాలంటే అందరికీ కష్టమే, వారి చేతులు చూడగా పాము పడగల వలె కనిపించును, నేత్రములు అగ్నిగోళముల వలె కనిపించును. ముఖము బ్రహ్మ   వర్చస్సుతో వెలుగు చుండును  అటువంటి వారికి పాదాబివందనాలు చేసి ఆసీర్వాదము  పొందాలన్నది ఇందు నీతి, .కోపముగా  ఉన్నవారి  కళ్ళు  కుడా  అగ్నిలా  వెలుగుతూ  ఉండటాయి అటువంటి వారి   ముందు   జాగర్తగా   ఉండాలనేదే   ఇందు నీతి.
      
హనుమంతుని  ఎఱ్ఱనైన పిరుదులు బ్రద్దలైన ధాతుశిలలవలె నుండెను, అతని జంకల నుండి వచ్చేవాయువు మేఘము యురుము వలె నుండెను, ఉత్తరము నుండి దక్షణ దిక్కు వైపు పోవు ఉల్క వలే ప్రయాణించు చుండెను ,  రామభాణము ఎంత వేగముగా పోవునో అంతే వేగముగా పోఉ చుండెను
(*28 కొందరి శరీర అవయవాలు బహు చక్కగా ఉండునని, మరి కొందరివి వికృతముగా ఉండునని ఇందు మూలముగ తెలియు చున్నది, కొందరి మాట శబ్దానికి మించి ఉండునని, వేగము, మాట,   తోక చుక్క కన్నా మించి ఉండు నని ఇందు మూలముగా తెలుసుకోవచ్చు ననేదే నీతి    

హనుమంతుడు  త్రాడును తెంచుకొని పరుగెడుతున్న ఎనుగువలె నుండెను, అతని ముఖము చుట్టు తోక ఉండగా సూర్యునివలె ప్రకాశించు చుండెను,  అతని నీడ సముద్రము పై పడి ఒక పెద్ద నౌక వలె కనబడు చుండెను, వక్షస్తలము నుండి వెడలిన గాలిచే కెరటములు రెండంతలు ఎగసి పడు చుండెను
(*29) ఒక్కోక్కరు నడుస్తుంటే  భూమి, గాలి , కంపిస్తున్నది, కొందరి ముఖముచూస్తె వేలుగుతోనిండి పోతున్నది, కిరణాల తాకిడికి నీడ ఆవహిస్తున్నది, అందు చెఅ ప్రతిఒక్కరు త్రాడును తెంచుకొని పరుగెడుతున్న ఎనుగువలె నుందాలన్నదే ఇన్దునీతి      

ఉత్తరమునుండే వచ్చే వాయువు హనుమంతునికి ఎగురుటకు  తోడ్పడెను,  తాకాలని కేరటములు పైకి ఎగిరి పెద్ద గుంటగా ఏర్పడి పైకి ఎగురు చుండెను, భూమి యందు ఉన్నసముద్రమును మారుతి త్రాగుచున్నట్లుగా కన బడెను, హనుమంతుడు ఆకాశమున తలపైకి ఎత్తిన ఆకాశాన్ని  మ్రింగి నట్లుండెను
(*30) కొందరి చూపులు మింగెసి నట్లుగాను, మరికొందరి చూపులు తాగేసినట్లుగాను ఉన్న వారిదగ్గర జాగర్తగా ఉండాలనేదే ఇందు నీతి, మన ప్రయాణములో ఎన్నో ఆటంకాలు వచ్చిన ధైర్యముగా ముందుకు పోవాలన్నదే ఇందునీతి.

  **********
 
ఆధారము లేకుండ  రెక్కల పర్వతమువలె హనుమంతుడు ప్రకాశించు చుండెను, మేఘ పంక్తులలోకి పోవుచూ బయటకు వచ్చుచూ గరుత్మంతుడివలె ఉండెను,ఎరుపు,నలుపు,తెలుపు,పచ్చ, మేఘాలల్లో హనుమంతుడు ముచ్చటగా నుండెను
హనుమంతున్ని చూసిన ఋషీశ్వరులు, దేవతలు, గంధర్వులు పరాక్రమమును  ప్రశంసించెను
*(31) కొందరకి తన శక్తి అసలు తెలియదు, అనుకున్న పని అనుకున్న సమయముము కన్నా ముందే చేయగలుగుతారు, ఎందరు ఎదుర్పడినా ఎన్నిఅవాంతరాలు వచ్చిన తన కార్యమును తను చేసినవారికి,  అందరి దీవెనులు ఉంటాయని  ఈ శ్లోకభావం.

కొండంత ఎత్తుగా లేచుచున్న సముద్ర తరంగములను వక్షస్థలముతో 'డి' కొని ఎగేరెను,  హనుమంతుని తో వచ్చే గాలి, మేఘముల గాలి, సముద్రపు గాలి కలసి భీకరశబ్దముగా వినబడెను, సముద్రములో ఉన్న తరంగాలన్ని భూమి ఆకాశాన్ని తాకు చున్నట్లుగా ఉండెను, ఎగసిపడుతున్న సముద్ర తరంగాలను లెక్క పెట్టు చున్నాడా అన్నట్లు దాటు చుండెను .
*(32) ఎవరైనా సరే తప్పని సరి పరిస్తితిలో పనిచేయాలంటే  గుండె ధైర్యముతో, శబ్ధకాలుష్యాన్ని తట్టుకొని, ఈర్శ్య ద్వేషాలను తట్టుకొని, ఎగసి పడుతూ అడ్డు వచ్చిన వారిని  దాటుకుంటూ  ఎంత మంది అడ్డువచ్చారో లేక్క కట్టుకుంటూ ముందుకు  సాగాలన్నదే ఇందు నీతి.  .   

తిమింగళములు, మొసళ్ళు, వస్త్ర విహీనులయన మనుష్యుల్లా  ఉండెను, సర్పములు హనుమంతుని చూసి గరుత్మంతుడని భావించి భయ పడెను, హనుమంతుడు ఆకాశములో మేఘముల కన్న ముందుకు పోవు చుండెను. మేఘాలచే కప్పబడుచు బయటకువచ్చుచూ ఉండే చంద్రుడిలా ప్రకాశించు  చుండెను
*(33) కొందరు నీ పనికి అడ్డు పడుటకు, ఆక ర్షిమ్చుటకు, వస్త్ర విహీనులై , ఎంతో భయము నటించేవారు ఉంటారు జాగర్తగా మేలగాలనేదే ఇందు నీతి, చూపి చూపనట్లుగా మనసును లాగేవారు ఉంటారు జాగర్తగా మనం ప్రవరిమ్చాలనేదే ఇందు నీతి.  

హనుమంతుని నీడ సముద్రము మీద పది యోజనాలతో విస్తీర్ణముగను, ముప్పది యోజనాల పొడవుతో ఉండెను,  దేవా దాన గంద ర్వులు పుష్ప వృష్టిని కురిపించెను, హనుమంతుని చూసి దేవగణాలన్ని పరమా నందమును పొందెను  
*(34) కొందరు కార్య సాధకులుగా ముందుకు సాగేటప్పుడు వారి నీడను వారే చుడలేరు, ఎంత విస్తీర్ణము ఉందో చెప్పలేరు అనేదే తెలుసు కోవలసిన విషయం మరియు పనిలో ఉన్నప్పుడు పనివిషయము తప్ప అన్య విష యము ఆలోచించ కూడ దనేది ఇందు లోనీతి  

******