Sunday, 9 June 2024

 

*ఖాళీ* ✍🏻జ్ఞానశిశువు.
వివేకానందులు అమెరికా చేరిన మొదటి వారంలోనే అన్ని ఆధారాలూ పోగొట్టుకుని "ఖాళీ"గా నిలబడ్డారు.
అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.
అరవిందులు పాండిచ్చేరి సముద్రతీరంలో తన వద్ద మిగిలిన చివరి నాణేన్ని సముద్రంలోకి విసిరిపారేసి "ఖాళీ"గా నిలబడ్డారు. అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.
రమణులు ప్రయాణంలో మిగిలిన పైకాన్ని కోనేరులో విసిరివేసి, దుస్తులను సైతం వదిలి కేవలం ఓ గోచీతో "ఖాళీ"గా నిలబడ్డారు. అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.

* * *


ఒకరు గురువుగారిని అడిగారు ....దైవీశక్తిని నేను చవి చూడాలంటే ఏంచేయాలి? అని..అతనికి గురువుగారు ఇలా చెప్పారు-

500 రూపాయిలు జేబులో ఉంచుకుని, ఆ పైకంతో బస్సులోగానీ, రైలులోగానీ ఎంతదూరం ప్రయాణం చేయగలవో అంతదూరం ప్రయాణం చేసి అక్కడ దిగేయ్.... నీ జేబులో ఒక్కరూపాయి కూడా ఉండకూడదు....అక్కడ ఓ నెలరోజులు గడిపి, తిరిగి నీ స్వస్థలానికి చేరుకోగలిగితే తెలుస్తుంది..ఆ దైవీశక్తి నిన్ను ఎలా నడిపించిందో అనేది.

ప్రత్యక్షానుభవం కలుగుతుంది..
కోటి ఆధ్యాత్మికగ్రంథాలు చదివినా కలగని అనుభవం, ఈ ఒక్క పని చేయడం వలన కలుగుతుంది...అన్నారు.
అతడు నవ్వుతూ ఓ హాస్యకథలాగా విన్నాడేగానీ,
ప్రాక్టికల్ గా సాహసం చేయలేకపోయాడు.

ఈ ఘట్టం విని నా స్నేహితుడు, గురుభక్తుడు అయిన సుధాకర్ అనేవాడు అలా రైలులో బయలుదేరి దత్తక్షేత్రమైన గాణ్గాపురం చేరాడు..అక్కడ దిగి మిగిలిన చిల్లరపైకాన్ని పారవేసి, ఊళ్లోకి ప్రవేశించాడు.
అక్కడే ఓ కాషాంబరధారి వద్ద శిష్యుడిగా చేరి, ఊళ్లో భిక్ష చేసుకుంటూ ఓ నెలరోజులు గడిపి, తిరిగి స్వస్థలమైన శ్రీకాళహస్తి చేరాడు. గురు బోధను అతనొక్కడే అలా ప్రాక్టికల్ గా చేసి దైవీశక్తిని అనుభవించాడు.

తిరిగొచ్చాక అతడు ఓ అవధూతలా మారిపోయాడు.....
కొందరు "అతడు పిచ్చివాడైపోయాడు" అని దూరమైపోయారు...
కొందరు అతన్ని ఓ గురువుగా ఆరాధించడం మొదలుపెట్టారు.
అతడు పిచ్చివాడో, అవధూతో దైవానికెరుక.

* * *


వాస్తవానికి ప్రతి ఒక్కడు ఈ భూమ్మీదకు దిగంబరంగానే వచ్చాడు."ఖాళీ"గానే ఈ ప్రపంచంలోకి ప్రవేశించాడు...

తనువును, తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను, భార్యాబిడ్డలను, సంపదలను, అనుభవాలను ఉచితంగానే పొందాడు..తిరిగి అందరినీ, అన్నిటినీ, చివరకు తనువును కూడా "ఖాళీ" చేసి వెళ్లిపోతాడు.

"ఖాళీ" అవడం తథ్యం....
కాబట్టి అన్నీ ఉన్నప్పుడు కూడా "ఖాళీ"గా ఉండడమే
గురువుగారు చెప్పిన "మెలకువలో నిద్ర".
భగవద్గీతలో చెప్పినట్టు- "అందరూ మేలుకుని ఉంటే, యోగి నిద్రిస్తుంటాడు."
నిద్ర అంటే పడుకుని నిద్రపోవడం కాదు.
"ఖాళీ"గా ఉండడం. అదే యోగనిద్ర.

భగవద్గీత చరమశ్లోకంలో-
సర్వధర్మాన్ పరిత్యజ్య....అన్నాడు కృష్ణభగవానుడు.
సర్వధర్మాలను వదిలేసి "ఖాళీ" అయిపొమ్మన్నాడు.

ధర్మములన్నీ ఇహానికి సంబంధించినవి.
"ఖాళీ" అనేది పరానికి సంబంధించినది

* * *


"నేను లేని స్థితి సర్వసమ్మతము"
"తాను ఆహారమగుటయే"
అని భగవాన్ ఉన్నది నలుబదిలో ప్రస్తావించిన వాక్యాలు ఈ "ఖాళీ" ని ఉద్దేశించినవే.

* * *


శ్రీరామకృష్ణులు ఆరాధించిన "ఖాళీ"యే కాళీమాత.
కాళీమాత అనేది ఓ విగ్రహం కాదు,

అర్థరాత్రి...
ప్రపంచంలో ఉండే నిశ్శబ్ధాన్ని(మౌనాన్ని) అంధకారాన్ని(అభేదాన్ని)
ఆస్వాదించడమే కాళీమాత దర్శనం.

మన గురువుగారు అలా అర్థరాత్రి ఏకాంతంగా కూర్చుని "ఖాళీ" ని అనుభవించడం నేను ఎన్నోసార్లు చూశాను.

పట్టపగలు కూడా ఆ నిశ్శబ్ధాన్ని, ఆ "ఖాళీ"ని అనుభవించగలగడమే సహజ సమాధి.

అలా రమణులు ఉండేవారు.
మన గురువుగారు ఉండేవారు.

రాత్రయినా, పగలయినా వారిలో స్థితిభేదం ఉండదు.
వారు సదా "ఖాళీ"గానే ఉంటారు.

* * *

కర్తృత్వభావన "ఖాళీ" అయిపోవడమే కర్మయోగం.
వ్యక్తిత్వభావన "ఖాళీ" అయిపోవడమే భక్తియోగం.
అహమిక "ఖాళీ" అయిపోవడమే జ్ఞానయోగం.

* * *

కళ్లు తెరిచే వున్నా సరే
ధ్యాననిష్ఠలో ఉండగలిగే స్థితిని ప్రసాదించారు గురువుగారు.

* * *


వ్యవహారంలో మునిగి వున్నా సరే
తనలో తాను మునిగి ఉండగలిగే స్థితిని ప్రసాదించారు గురువుగారు.

* * *

మాట్లాడుతూ వున్నా సరే
మౌనంగా ఉండగలిగే స్థితిని ప్రసాదించారు గురువుగారు.

* * *

కరచరణాదులతో పని చేస్తూ వున్నా సరే
అచలంగా ఉండగలిగే స్థితిని ప్రసాదించారు గురువుగారు.

* * *


అన్నీ ఉన్నా సరే
"ఖాళీ"గా ఉండగలిగే స్థితిని ప్రసాదించారు గురువుగారు.

* * *


నిజానికి తాను "ఖాళీ" అయిపోతే....
ఆ ఖాళీ ఖాళీగా ఉండదు...
ఆ ఖాళీ దైవంతో నిండిపోయి ఉంటుంది.
ఇదే "ఖాళీతత్త్వరహస్యం".

* * *

గురువుగారు కొన్ని వేల ఉపదేశవాక్యాలు మాకు ప్రసాదించారు అందులో నుంచి ఒకే ఒక వాక్యం ఎన్నుకోమంటే...జ్ఞానప్రసూనాలు 1-50 వాక్యాన్ని ఎన్నుకుంటాను...

అదే ఇది....
ఎవరూ లేకపోవడమే దేవుడు ఉండడం.
ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం.
ఏ అనుభవమూ లేకపోవడమే దైవానుభవం.

తెల్లగా మెరిసిపోయే రెండు సమాంతర గోడలున్నాయి. వాటి మధ్య ఒంటరిగా ఒక మనిషి ప్రయాణిస్తున్నాడు. పరిశుభ్రంగా, చక్కగా ఉన్నాయే అని పది అడుగులు వేశాడు. కనుచూపు మేరలో మరో నరుడు కనబడలేదు. వడివడిగా మరో వంద అడుగులు వేశాడు. నరుడేకాదు; పురుగు కూడా లేదు. అటూ ఇటూ చూస్తే ఒకే రంగు. తల తిరిగినట్లయింది. ముందుకు పరుగెత్తాడు. తెలుపు... తెలుపు... ఒకే రంగు! భయం వేసింది. కాసేపటికి పిచ్చిగా కేకలు వేస్తూ పడిపోయాడు. అతడిలో ఒంటరితనమూ, నిస్సహాయతా... అన్నింటికంటే మించి వైవిధ్య రహితమైన దృశ్యమూ విపరీత పరిణామానికి దారితీశాయి. భగవంతుడు ఈ లోకంలో అన్నింటికీ తగు స్థానాన్ని కల్పించాడు. అవేవీ ఒకే జాతివి కావు. గడ్డిపోచ నుంచి మహావృక్షం వరకు, ఏక కణ జీవి నుండి ఏనుగు వరకు... ఎన్ని రకాలో! చిన్నపుట్టలు గుట్టల నుంచి మహాపర్వతాల వరకు ఎన్నెన్నో పరిమాణాలు. ఆకుపచ్చని చెట్టుకు ఎర్రటి పూలు! ఆ చెట్టుపై రంగు రంగుల రెక్కలతో ఎగిరే సీతాకోక చిలుక!
భారతీయుల దృష్టిలో ప్రతిదీ భగవత్‌ స్వరూపమే! సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే కొండల్నీ, గోవుల్నీ పూజించమని నందాదులకు సూచించాడు. ఈ భూమిని రక్షించడానికి శ్రీహరి చేపగా, తాబేలుగా, వరాహంగా అవతారాలెత్తాడు. గజముఖుణ్ని విఘ్నేశ్వరుడిగా పూజిస్తాం. కపివరుడైన హనుమంతుణ్ని పూజిస్తే శ్రీరాముని పూజించినట్లే! ఆంజనేయుడి గుండెలోనే తారక రాముడు కొలువై ఉన్నాడు. ఈ పౌరాణిక గాథల సారాంశం ఒక్కటే! భిన్న ఆకృతులతో కనబడే స్వరూపాలన్నీ భగవదంశలేగాని వేరుకాదు.
మానవుడు బుద్ధిజీవి. బుద్ధిని మంచికీ చెడుకీ- దేనికైనా ఉపయోగించవచ్చు. లోకమంతా తన చెప్పుచేతల్లో ఉండాలనుకోవడం రాక్షసత్వం. ప్రకృతిని వశం చేసుకొనే ప్రయత్నంలో మానవుడు రాక్షసుడవుతున్నాడు. ఒక్కొక్క జాతినీ హరిస్తున్నాడు. పట్టణాల్లో పిచ్చుకలు మచ్చుకైనా లేకుండా మాయమయ్యాయి. కాకులు కరవైపోతున్నాయి. రసాయన పదార్థాల దెబ్బకు ఇప్పటికే వేలకు వేల వృక్ష, జంతు జాతులు అంతరించిపోయాయి.
'బుద్ధి'కి పరమార్థం ఏమిటి? ప్రకృతిని భగవంతుని ప్రసాదంగా స్వీకరించి పరిరక్షించడం. 'బుద్ధిహీనత' అంటే? ప్రకృతిని పరిమార్చడం. కొండలను బండరాళ్ల కుప్ప అనుకుంటాం. హిమాలయాలు మాయమైన మరుక్షణం మన దేశం మనగలుగుతుందా? జీవనదులు ప్రవహిస్తాయా? ఇవన్నీ అంతరించిపోయిన తరవాత ఆ ప్రాంతానికి ఒక అందమా చందమా, ఒక చెట్టా పుట్టా? అప్పుడు కనబడే దృశ్యం ఒకటే! ఎటు చూసినా 'కాంక్రీటు' అరణ్యాలు. బండగుండెల మనుషులు. జీవజాలపు అస్తికల పర్వతాలు! ఒక వైవిధ్యానికి తావులేదు. ఎటు చూసినా ఒకే జీవజాతి. అదే మానవజాతి. చోటుకోసం, నీటికోసం, తుదకు గాలికోసం పోటీపడే మానవజాతి! పేరుకు మానవులు. ప్రవర్తనలో దానవులు. దేవాలయ స్థలాలూ, ఆస్తులూ వారి ఆకలికి చాలవు. వారి తర్కం ఒక్కటే! 'మనకే గతి లేకపోతే ఈ రకరకాల జీవులన్నింటినీ రక్షించడమేమిటి? వాటన్నింటినీ మనం ఆహారంగా ఉపయోగించుకుంటే తప్పేమిటి? పాపంలేదు. పుణ్యం లేదు! మన ఉనికే సత్యం, మిగతాదంతా కల్పన!' ఈ తర్కం కర్కశత్వానికి దారి తీస్తుంది. తన ఉనికిని రక్షించుకునే ప్రయత్నంలో సాటి జీవులకు మనుగడ లేకుండా చేస్తాడు. తెల్లవాడు లోకాన్నంతా తెల్లవాళ్లే పరిపాలించాలనుకుంటాడు. తెల్లతోలు గల మానవజాతి శ్రేష్ఠమైనదని నమ్మిస్తాడు. ఎదిరిస్తే ప్రాణాలు హరిస్తాడు. 'తెల్లగా ఉండటం అందం' అని అందరూ భ్రాంతిపడేలా చేస్తాడు. కానీ లోకంలో ఎంత వైవిధ్యం ఉంది. అందం రంగుకు సంబంధించిన సంగతి కాదు. కృష్ణుడిది ఏ రంగు? ఆ నల్లనివాడి దివ్య సౌందర్యాన్ని దర్శించి భక్తులు ధన్యులయ్యారా లేదా? అది త్రిజగన్మోహనమా కాదా? ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రంగు. ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క వాహనం! అంతా వైవిధ్యమే! అదే స్వామి- శ్రీరంగంలో ఒకరీతి, పండరి క్షేత్రంలో ఒకతీరు. అందంలో, అలంకారంలో... ఎంత వైవిధ్యం! అదే కన్నుల పండుగ! ఈ వైవిధ్యమే జీవితాన్ని రంగుల కలగా మారుస్తుంది. కష్టాలను మరపిస్తుంది. మనం చేసే అలంకారాల్లోనే ఇన్ని రకాలుంటే, దేవుడి సృష్టిలో ఇంకెన్ని ఉండాలి? వైవిధ్య భరితమైన ఈశ్వర సృష్టిని రక్షించడానికే మానవుడికి 'బుద్ధి'ని ప్రసాదించాడు. ఆ బుద్ధి సరైన విధంగా ఉపయోగించేటట్లు చేయమని తిరిగి ఆ పరమేశ్వరుణ్నే ప్రార్థించవలసివస్తోంది.
****

శతాక్షి అవతారం కధ.

శతాక్షి అమ్మవారి అవతారమును గురించి వ్యాసులవారు జనమేజయ మహారాజునకు తెలియచేశారు. మరల ఎంతోమంది పెద్దలు ఆ కధలను క్లుప్తంగా మనకు తెలియచేశారు. హిరణ్యాక్షుడి వంశంలో రురువు అనే దానవుడుండేవాడు. అతని కొడుకు దుర్గముడు. మహాపరాక్రముడు. కానీ దుష్టచిత్తుడు. దేవవిరోధి.దేవతల్ని శాశ్వతంగా నిర్మూలించడం ఎలా అని ఆలోచించేవాడు ఎప్పుడూ.
చివరికి అతనికో ఆలోచన తట్టింది-దేవతలకు బలాన్ని యిచ్చేవి వేదాలు. వాటిని వాళ్ళ దగ్గర లేకుండా చేస్తే వాళ్ళ రోగం కుదురుతుంది గదా – అని.ఆలోచన తట్టిందే తడవుగా హిమాలయానికి వెళ్ళి వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. విరించి సంతోషించి అతనికి ప్రత్యక్షమై వరమిస్తానన్నాడు.“పద్మాసనా! బ్రాహ్మణుల వద్దా, దేవతల వద్దా ఉన్న వేదాలు, మంత్రాలు నా అధీనం కావాలి. దేవతలు నా చేతిలో ఓడిపోవాలి” అంజలి ఘటించాడు దుర్గముడు.
“అలాగే” అన్నాడు పితామహుడు.

బ్రహ్మదేవుడి వరప్రభావం చేత బ్రాహ్మణులు వేదాలు మరచిపోయారు. సంధ్యావందనం, హోమం, జపతపాలు, యజ్ఞాలు మొదలైన నిత్యనైమిత్తిక కర్మలన్నీ మానేశారు. యజ్ఞాల వల్ల లభించే ఆహారం లేక దేవతలు శక్తిహీనులయ్యారు.
వేదాలు తన వశం కావడంతో దుర్గముడు మహాబలవంతుడయ్యాడు. అనతికాలంలోనే దుర్వార పరాక్రమంతో అమరావతి మీద దండెత్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. చేసేదిలేక దేవతలు కొండ గుహల్లోనూ, ఆరడవుల్లోనూ కాలం గడుపుతున్నారు.
ఇది ఇలా ఉండగా యజ్ఞ యాగాది క్రతువులు లేనందువల్ల దేశంలో అనావృష్టి విలయతాండవం చేసింది. చెరువులు, నూతులు, నదులు ఎండిపోయాయి. పాడిపంటలు లేక అన్నోదకాలు లేక ప్రజలు మలమలా మాడిపోయారు. ప్రపంచములో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.వంద సంవత్సరాలు గతించాయి.ఈ విపత్కర పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలి ?ఎవరికీ ఏమీ అంతుపట్టలేదు.చివరికి కొంతమంది విప్రులు హిమాలయానికి వెళ్ళి అనన్యమైన భక్తితో జగజ్జననిని ప్రార్ధించారు.
“అంబా! శాంభవీ ! మాకు నువ్వే శరణ్యం. సకల భువనాలకు నువ్వే ఆధారం. నువ్వు లేని జగత్తు జడ పదార్ధం. మాతా ! ప్రపంచానికి ఉపద్రవం వాటిల్లింది. ప్రజలకు తిండితిప్పలు లేవు. తాగటానికి నీళ్ళు లేవు. మా నిత్యకృత్యాలన్నీ నిలిచిపోయాయి. ఇంకా జీవనం సాగించడం మా వల్ల కాదు. పామరులమైన మా మీద కరుణామృతాన్ని కురిపించు. మా దోషాలన్నింటినీ పరిహరించి , ఈ ఘోర విపత్తు నుంచి మమ్మల్ని ఉధ్ధరించు తల్లీ!”అమ్మ హృదయం కరుణతో కరిగిపోయింది.
శ్యామల వర్ణంతో , శత (అనంత ) నేత్రాలతో, కోటి సూర్యప్రభలతో, శాకపాకఫలయుక్తమైన హస్తాలతో దేవి ప్రసన్నురాలైంది.అమ్మ కన్నులు శ్రావణమేఘాలై తొమ్మిది రాత్రులు నిర్విరామంగా వర్షించాయి.
నదీనదాలు నిండిపోయాయి. వాపీ కూపాదులు జలసమృధ్ధాలైనాయి. తరువులు పుష్ప ఫలభరితాలైనాయి. ఓషధులు తేజోవంతములైనాయి. ప్రకృతి నిండు గర్భిణిలాగా శోభించింది.
ప్రజల మనసులలో మల్లెలు గుబాళించాయి. ఉల్లాసం వెల్లివిరిసింది.దేవతలు ఆనందించారు. కొండగుహల్లోంచి, కారడవుల్లోంచి వచ్చి, విప్రులతోను మునులతోను కలిసి దేవిని నుతించారు.
“తల్లీ! నీ దయ వల్ల ప్రపంచం యావత్తూ సుభిక్షం అయింది. అనంతాలైన కన్నులతో మమ్మల్ని చల్లగా చూశావు కాబట్టి శతాక్షి అనే పేరు నీకు సార్ధకం అవుతుంది. ఈశ్వరీ! మేమందరం ఆకలితో బాధపడుతున్నాం. ఇంకా నిన్ను ప్రార్ధించే ఓపిక మాకు లేదు. ఒక్కటిమాత్రం కోరుకుంటున్నాం. వేదాల్ని మళ్ళీ మా ఆధీనం చెయ్యి తల్లీ !”

దేవి తాను తెచ్చిన శాకపాకాల్ని ఇచ్చి వాళ్ళ ఆకలి మంటల్ని చల్లార్చింది. అందుకనే ఆమె ‘ శాకంభరి ‘ అయింది.
చారుల ద్వారా ఈ విషయాన్ని విన్నాడు దుర్గముడు.ఆగ్రహావేశంతో హుటాహుటిగా బయలుదేరి హిమాలయంలో దేవీసమక్షములో వున్న దేవమునిగణాల మీద బాణాలు గుప్పించాడు.పరమేశ్వరి అతని బాణాలు వాళ్ళమీద పడకుండా తేజోమయమైన చక్రాన్ని గొడుగులాగా అడ్డంపెట్టి, తాను మాత్రం ముందుకొచ్చి దుర్గముణ్ణీ, అతని సైన్యాన్నీ శరపరంపరలతో ముంచెత్తింది.
దేవీ దైత్యుల మధ్య చెలరేగిన అప్పటి సంకులసమరంలో దేవి తన శరీరం నుంచి కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగళ, మాతంగి, త్రిపురసుందరి, కామాక్షి, తులజ, జంభిని, మోహిని, ఛిన్నమస్త, గుహ్యకాళి, దశసహస్రబాహుక అనే తీవ్రశక్తుల్ని సాయుధ హస్తాలతో పుట్టించింది. ఆ శక్తులు ఒక్కపెట్టున విజృంభించి గంభీరంగా గర్జిస్తూ, కరాళ నృత్యాలు చేస్తూ, అడ్డం వచ్చిన అసురసైన్యాన్ని అణచివేస్తూ , కదనరంగాన పదిరోజులపాటు విశృంఖలంగా విహారం చేశారు.
రాక్షస సైన్యమంతా నశించింది. చివరికి దుర్గముడొక్కడే మిగిలిపోయాడు.పదకొండో రోజున బాహాబల గర్వం పొంగులు వారగా దుర్గముడు దేవీశక్తుల్ని శక్తిహీనం చేసి. జగదంబకు ఎదురు నిలిచి వీరోచితంగా పోరాటం సాగించాడు.
అంబ అలిగి సారధిని, రధాన్నీ రూపుమాపి అగ్ని సమానములైన అమ్ములతో అతని వక్షాన్ని చీల్చింది.
వటవృక్షం లాగా వాడు భూమిమీద వాలిపోయాడు. వాడిశరీరం నుంచి ఒక తేజం వెలువడి దేవిలో లీనమైపోయింది.
ఆమె వేదాల్ని విప్రుల వశం చేసింది. అమరులు ఆనందించారు.శతాక్షిని వినయావనత వదనాలతో వినుతించారు.
ఆ తల్లి కదా తమ బాధలు చూసి , తమకోసం ఇంత సహాయం చేసిందని అందరూ అమ్మను ఎంతగానో కీర్తించారు.
దుర్గముణ్ణి సంహరించినందువల్ల అంబకు ‘ దుర్గ ‘ అనే పేరొచ్చింది.
****
ఇంద్రుడు వృత్రాసురుని సంహరించుటచే బ్రహ్మహత్యా దోషము సంభవించి వైభవము కోల్పోయాడు .అప్పుడు అతడు నిషాద పర్వతము మీద అజ్ఞాతవాసము చేయు చుండెను.

.దేవతలు,మునులును స్వర్గము నకు రాజు లేక అరాచకమై పోయి ఆపదలు వచ్చునని
భయపడి అనేక యజ్ఞములు చేసి మహా మహిమాన్వితుడైన నహుషుడి దగ్గరికి వెళ్లి ఇంద్రపదవి స్వీకరించమని కోరిరి.అతడు నాకు యోగ్యత వున్నదా?

అని సందేహించగా,యముడు,వరుణుడు మొదలగు వారు తమ శక్తి ,దర్పము లలో కొంత భాగము అతనికి యిచ్చి అతన్ని ఇంద్రుడిని చేసి స్వర్గమునకు అధిపతిని చేసినారు.భూలోకములో నున్నంత కాలము   మహాత్ముడు,శాంతుడు అని విఖ్యాతి పొందిన నహుషుడు స్వర్గాధి పత్యము రాగానే మారి పోయాడు.

ఇంక నాకేమి తక్కువ అని గర్వముతో తన యిష్టమొచ్చి నటుల ప్రవర్తించ సాగాడు.పరస్త్రీలను 
కన్నెత్తి  కూడా చూడనివాడు అప్సరసలతో కాలము గడపు తూ కొలువుకు రాకుండా నిర్లక్ష్యముగా 
ప్రవర్తించ    సాగాడు.

అంతే కాకుండా మంచి చెడ్డలు మరిచి త్రిలోక సుందరి యగు శచీదేవిని చూసి మోహించి రమ్మని కబురు పంపెను.ఆమె దేవగురువాగు బృహస్పతిని శరణు కోరింది.దేవతలందరూ కలిసి ఆమెకు
ఒక ఉపాయము చెప్పిరి.ఆమె నహుషుని దగ్గరకు వెళ్లి మాయమాటలు చెప్పి నాకు ఒక వ్రతము

    వుంది నీవు పల్లకి ఎక్కి మునుల చేత మోయించుకొని వస్తే నేను నీదాన్నవుతాను అని చెప్పింది.

వెంటనే నహుషుడు సప్తరుషులను పిలిచి మీరు బోయీలై నన్ను పట్టణమంతయు తిప్పవలయును అని ఆజ్ఞాపించెను.అది విని మునులందరూ తెల్లబోయారు.కానీ చేయునది లేక ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి మోయసాగారు.నహుషుడు గర్వముతో వారిని యిష్ట మోచ్చినట్లు మాటాడుతూ అదిలిస్తూ
మెల్లగా నడుస్తే ఊపిరి లేని వాళ్ళ లాగా అదేమీ నడక యని, వేగముగా నడిస్తే, అంత వేగముగా పోతున్నారెందుకు అని 'సర్ప'సర్ప' అంటే నిదానము,నిదానము అనేవాడు .మధ్యాహ్న కాలమైనందున
మునులు పల్లకి దింపి వేదమంత్రములు చెప్పసాగారు.నహషుడు ఆ మంత్రములు చాలించి పల్లకి మోయండి అని గద్దించెను.

వేదమత్రములను గురించి యెగతాళి చేసెను.దానితో అగస్త్యునకు కోపము వచ్చి యింత అహంకారము నీకు తగదు,'సర్ప'సర్ప' అని మమ్మల్ని అదిలించినావు కనుక .భూలోకములో పామువై పడి వుండు అని శాప మిస్తాడు.

అప్పుడు నహుషుడి కళ్ళు తెరుచుకుంటాయి అగస్త్యుని కాళ్ళపై బడి క్షమాపణ వేడి శాపవిమోచనం
ప్రసాదించమని వేడుకుంటాడు.అగస్త్యుడు శాంతించి సర్పముగా ఉంటూ అందరినీ ప్రశ్నలు అడుగుతూ వుండు.

నీవు వేసిన ప్రశ్నలకు ఎవరు
సరియైన సమాధానము ఎవరు చెప్తారో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు.నహుషుడు వేసిన ప్రశ్నలే 'యక్షప్రశ్నలు' గా ప్రసిద్ధికెక్కాయి.
పాండవులలో నలుగురు యీతని ప్రశ్నలకు సమాధానము చెప్పలేక చనిపోతారు.చివరకు ధర్మరాజు వచ్చి యీతని ప్రశ్నలకు సరియైన సమాధానము యిస్తాడు.అప్పుడు నీకేమి వరము కావలెనో అడుగు అని అడుగుతాడు.

అప్పుడు నా నలుగురి తమ్ముళ్ళను బ్రతికించ మని అడుగుతాడు.

అప్పుడు
నహుషుడు వీరిలో ఎవరినైనా ఒక్కరిని బ్రతికిస్తాను ఎవరిని బ్రతికించ మంటావో చెప్పు అని అడుగు తాడు.అప్పుడు ధర్మరాజు సహదేవుడిని బ్రతికించ మంటాడు.నహుషుడు ఆశ్చర్యపోయి నీవు బలవంతు లైన నీ సొంత సోదరులను కోరకుండా సవతి తమ్ముడైన సహదేవుడిని కోరుకున్నావు ఎందుకు అని అడిగాడు.అప్పుడు ధర్మరాజు కుంతీ పుత్రులలో జ్యేష్టుడిని నేను బ్రతికి వున్నాను మా పినతల్లి మాద్రి పుత్రులలో కనిష్టుడైన సహదేవుడు బ్రతికి ఉండుట న్యాయము కదా!అందుకనే సహదేవుడిని కోరుకున్నాను అంటాడు.అతని న్యాయ,ధర్మ సంద్రతకు మెచ్చి నలుగురినీ బ్రతికించి తన స్వస్వరూపముతో వెళ్ళిపోతాడు నహుషుడు.ఆ ప్రశ్నలే లోకములో యక్ష ప్రశ్నలు అని ప్రసిద్ధి చెందాయి.

అధికార గర్వముతో పెద్దలను ధిక్కరించి నిందించరాదు అని ఈకథ నీతి.
***-

Wednesday, 3 May 2023

 ప్రాంజలి ప్రభ నేటి ఆలోచన రామాయణం సుందరకాండ


ఉ.లంకను చేరి లంఖినిని మర్ధన చేసియు వామ పాదమై

లంకన మెట్టు మెట్టులను లాస్యము మాడక వెత్కె మారుతీ

సంకలు పెట్టె రక్కసుల చూపులు జానకి పైన ఉండుటన్

సంకట మోచనాలహను మంతుడు ఓర్పువహింప గల్గు టన్ 

......


 ..లంకప్రవేశము హనుమా 


సీ. పవన పుత్రుడు కదిలే పాలు కాజేసెడి 

మెల్లగా తారాడు పిల్లి వోలె

కళ్ళ గంతలు యున్న కలవారి గృహమున

దూరియన్వేషించు దొంగ వోలె

దొంగబుద్దిని తెల్పి దోపిడీ చేసేటి

నక్కి గాలించేటి నక్క వోలె

మనసున ముందుగా మనుగడ తెలిసిన

తనలోన వెదకెడు తపసి వోలె


తే. కపివరేన్యుడు తనపరాక్రమము మరచి

రామ భక్తిని తలచియు లంక చూడ

ఎవరికంటను పడకుండ ఎరుక దలచి

లంక గాలించ దళచియు లయలు జూపె 


......

రాక్షసులు సీతాదేవిని వేధించుట


ఉ.దెయ్యము లల్లె రక్కసులు దెబ్బలు కోపపు తిట్లు యుండుటన్

కయ్యము లాడి రావణుని కామము తీర్చుము గొప్ప చెప్పుటన్

నయ్యము లేక సంపెదము నానుడి ఏలను మోక్షమోందు టన్

భయ్యము లేల నీ మనసు బంధము చేయుము బాధ్యతే యగున్

.....

ఉ.రావణ దర్పమే ఇదియు రాజ్యము నంతయు నీదు పాదమై

తావును తెల్పుమా ఇపుడు తాడును పాముయు కాదుకదులే

భావన ఇచ్చిపుచ్చుటయు భాగ్యము నీదియు ఏలమౌనమే

కావడి కుండలా కనుల దానవు కాలము ఒప్పు కొమ్ములే

......

ఉ.పాలన నీదియై కనుము పాఠము చెప్పుము నీవు మాలొ క

ల్లోలన ఏల చూపెదవు లోలక బుద్దిని మార్చు మిప్పుడే

కాలము నాశనమ్ముగుట కల్లలు ఏలను తేల్చి చెప్పుమా

బేలవు మాది శక్తి గను బింకుము పోకుము తీర్పు నీదియే 

.....

జానకి హెచ్చరిక


మదన దర్ప వృత్తము

భ స జ ర జ గ 10 యతి


ఎల్లరు కమలంబు లౌరు బింకముల్ సుగంధమే

తెల్లని వదనంబు మార్చ బుద్ధియే విశేషమే

కొల్లలు తగువేల ధర్మ మార్గమేను జూచులన్

కల్ల పలుకు లేల కాని దైన దేల గన న్ మదీ 

......

హరిణీ వృత్తము

న స మ ర స వ 12 యతి


కురిసె కనులన్నీకన్నీరేను చూడుకాల మదీ 

పరిపరి విధంబుల్ బాధల్ ఏల బావురేయి విధీ 

సరిగతిని చూడండీ మీరే నాదు సక్యతేను నిధీ 

తరుణము యిదీ మీర్రున్ మార పాపబుద్ధి సుధీ

.......

ఆ.మం దు ఎక్కువైన మతి చెడి పోవును,

త్రా గు  భ్రమ గొలుపు త్రాచు వలెను,

ల క్షణమగు బ్రతుకు శిక్షయే యగు సమ 

యంబు మించకుండ మదియె గనుము

....

*నర్కుట వృత్తము నిజభజ జవ 11యతి 

అనుమతికోరువారులకు రక్షగ నుండ గలన్

మనుగడ నివ్వ చూపరుల శక్తి దయెన్ 

చినుకుల వల్లె సేవలును పంచ గలన్

ఆణువణువూ మనోభవము మార్చ గలన్

......

కం.అంబుది అలలే మదిగా

అంబర తలపే కళలుగు ఆశలు మిగిలే

సంబర మన్నది లేదులె

ప్రభల కథలు కలుగుటేను ప్రాభవ నీడల్

......

సీతాదేవి రక్కసులతో తెలిపినది నా భర్త సుఖమే  నాకానందం వినండి (గజిల్ )


అంధకారమున మెరుపులు సఖ్యతగను భర్తసుఖం 

బంధ మలుపు లలోన మది దుఃఖభావ భర్త సుఖం 


సమరశక్తికి చెలిమియై సమయతృప్తి నిచ్చుటయే

చదరంగపు రాజకీయ తెలుపుటయే భర్త సుఖం 


రాత్రిన తారల మధ్యన చందమామ నచ్చుటయే

హృదయానందము వెన్నెల నీడలోన భర్త సుఖం 


కనుపాప కదలిక లన్ని కలలన్నిటి మింగుటయే

వెలుగును పంచి పొందియున్న కళ్ళలోన భర్తసుఖం


మగువ మనసు తెలుపగలుగు పరమార్ధం సుఖమగుటే 

నలుపు తెలుపు సప్తవర్ణ కళలలోన భర్త సుఖం 


కాకిశ్వరము కన్నను కోకిల స్వర భర్త సుఖం 

వృద్ధకేశములు యవ్వన కేశములలొ భర్త సుఖం 


.....


ఉ.సంకుచితమ్మ చింతకల సంభవ సాధన వల్లనే యగున్

మంకు తలంపులేల కళ మానస భావము మంద బుద్దిగన్

జంకును బొంకు మాటలగు జాడ్జ్యము వల్లన ఆరితేరుటన్

ఏకుల మాదిరే కదలి ఎల్లరి సౌక్యము చూడ గల్గుటన్


మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ


ప్రాంజలి ప్రభ నేటి ఆలోచన రామాయణం సుందరకాండ 03/05


రావణ సీతను జూచి ఈ విధముగా పలికె


చం.తలుపుల చాటు నుండిన సితారవు ఊహలు చేరి చూపులై

పిలుపుల వల్ల కీర్తనలు పాడుచు హాయిగ పిల్పు కన్నులై

తలపులు తెల్ప గల్గియు సుతార మోహపు కళ్ళ వైనమే

మలపుల జీవితమ్మగు సమాన దాహము తీర్చ గల్గుటే 

.......

అటువైపే సుఖముంది ఒప్పులను ఏమంత్రమ్ము చెప్పేనులే

మటు మాయమ్ వలపంత ఇష్టమని ఓదార్చుము నిప్పేనులే

ఘటనే నేరమనేటి బుద్ధియిది సంఘంమ్మే సహాయమ్ము లే

కటువైనా మనసేను నిబ్బరము ముఖ్యమ్మేను సంతృప్తి లే

......


ఇ.నీవు పరస్త్రీ ని నీడతాకను లేవు

నన్ను ఆశించుట నీదు మూర్ఖత్వము

నమ్మితె చ్చా నని నమ్మ పలుకు లేల

ముఖ్యమై పెరుగుట మూఢత్వ మేయగు


ద్విపద..రక్కసులు సామదాన బేధముగా పలికిరి


యిన్నావుగా అయ్య ఏమి సెప్పిండొ?

యె న్నాళ్ళు నీవిట్ట ఏడుస్తవమ్మ

ఉన్నోళ్లు నీతోడు రారేమి ఎపుడు

కన్నోళ్లు కనలేవు కష్టమే ఇపుడు


ఇక్కడికి ని మొగు డెట్ట వస్తాడు?

చెక్కిటా చెయిదీసి చెఒగ్గి యినుము

వక్కతి వైనావు ఒప్పుకో దారి

మక్కువ తోమేము చెప్పది యినుము 


ఇప్పుడే మేము నిన్నను సేయ బోము

తప్పుడాలోచన తల దూరనీకు

ఒప్పుకొనుటయేను మార్గము నీకు

చెప్పుచుంటిమి నీకు ముందుగా యినుము 


ఎప్పటికీ రాణి నీ వవుతావు

చెప్పేడి మాటలు కావులే నీకు

గొప్ప మహారాణి వవుదువు నీవు

లిప్పటికైన నీ వదనమ్ము తెల్పు


పడతివై సౌక్యమ్ము పంచాలి ఇపుడు

కడతీర్పు పలుకులే తెలిపాలి యినుము 


మామాట వినక పోతె బతుకేలేదు

ఏమాట యనకయే ఒప్పుకో నీవు

....


మ.కాల కర్కశ మేను నన్నును కానిదానిగ మార్చెనే

ఏల చెప్పను కష్ట మొచ్చిన ఎప్పు డైనను మీకునూ

కాల నిర్ణయ మెవ్వరూ కన కాన లేరును ఎప్పుడూ

తాళ లేకయు శోకమే యగు తీవ్ర తాపము నాకునూ 

....

హనుమంతుడు చెట్టుపైనుండి


తే. చెట్టుపై నుండి సీత దుస్థితి ని జూచి

ఓర్పు నశియించి హనుమంతు డొక్క సారి

బిగ్గరగాను గర్జనచేసె పిడుగు మల్లె

రక్కసులు పరుగులు చేసె రక్ష కొరకు 

....

ఉ. వారల గాంచి మారుతియు వాసన బీల్చుచు క్రోధ నేత్రుడై

దారుణ మైనసంఘటన తప్పులు చేసెడి రక్కసీ లపై

తీరున కోపమొచ్చి గని తేరుకొనే మది వాయునందనన్

ప్రార్ధన రామ భక్తి గను పాలన ఏలను సీత చూచుచున్

.....

రక్కసి సీతతో తెల్పు ట


అతి వినయ వృత్తము

న న న న న స.11 యతి


మనుట కొరకు సుఖము విమల మగును వినుమా

తినుట కొరకు మనుట నతియె యగును కనుమా

మనుజ లనిన సహన సమత మమత తనమా

ననవరతము ఇపుడు తనమన యనుట సుధీ 

.......

సీతాదేవి రక్కశిలతో ఇలా పలికింది


శుభికా వృత్తము                   

మ భ న న భ భ గ 13 యతి


కారుణ్యంబన్నది పడతి కెపుడు గాపయి రక్షణ యే

కారుణ్యంబెప్పుడు విడువ వలదు కాలము నేస్తముయే

స్త్రీ రమ్యంబౌ వయసు తనము గతి  శీలము గన్ నిజమౌ

శ్రీ రమ్యమ్మే వినయ విధి కళ విశేషము గాను మదీ 

.....

ఖచరప్లుత వృత్తము..

న భ భ మ స స వ 12 యతి


తనువు కోవెలె చక్కనిదైన ధ్యా నము నిచ్చు మనోధరున్

తనువు గొప్ప వరంభగు నమ్మాత్ర మ్ము వినోదపు వాహినీ

తనువు దేలు నరుండును ఏమాత్రమ్ము సతమున్ భళా

తనువు దాహము తీర్చెది విద్యల్ తాహ తు కల్గియు ప్రేమగా

....

ప్రభాకలిత వృత్తము

న జ జ భ ర స వ13 యతి


హృదయము సంపదయోను మాన కృపర్వ కాలములోననే

హృదయము గూర్చుసుమీ ప్రభాకృతి మోమునన్ వరులన్ సదా 

హృదయము నేర్పు సమాజనాకృతిదారుణమ్ము గనో విదీ

హృదయము మార్గము జూపు చక్కగ హాయి పంచ గనో సుధీ 

.....

వనమంజరీ వృత్తము

న జ జ జ జ భ ర 11యతి


వినుము సహాయమనమ్ము వివేక వినమ్ర భావము నిత్యమై

వినయ సమర్ధత నేత సవీక్ష మనోహరమ్ముయు సత్యమై

ఘనమగు కీర్తి వినీల విఘాత సుదూరమేయగు ధర్మమై

మణుజుల లక్ష్యము దేహ సమర్ధ సకాల నిర్ణయ ప్రేమయే 

......

మణిగణ నికరము

న న న న స 9 యతి


ప్రకృతియె మనకొక వరమగు జననీ 

ప్రకృతికి సరియగు రమణత గలిగే 

ప్రకృతి యనునది పరమ సుఖమిడుగా

ప్రకటిత సహజపు ప్రభలివియు మధీ!!

......

అని సీతాదేవి పలికేను 

త్రిజట పలుకు లు 


కం.    వేద పురాణాల నొసగ

          వేదత్రిజటే మతిగను విశ్వ పలుకుగా 

          పాదములకు మ్రొక్కెద నే

          మీదౌ జన్మ దిన పృథ్వి మిష్ఠను భక్తిన్ 


......

ఆ.వె. పుడమి నందు మునుగ పూజ్యుల బ్రతుకులే 

          తథ్య మయ్య యెపుడు ధర్మ మందు 

          భక్తి యందు మునుగ భర్త సేవలు నెంచ 

          సులభ మయ్య మనుజ చులక నొద

....

మ.గుణమున్ సుందర రూపమున్ విభవముమ్ సౌభాగ్య కూటమ్ముగ న్ 

క్షణమున్ చారుచరిత్రముమ్ కులము క్షత్రీ సత్యముమ్ ధర్మభూ

షణముమ్ సంద పతివ్రతా మహి మె యం ప్రేమత్వ ముమ్ పెంపుటే 

కణమై కామ్యము సీత దేవతయు సంఖ్యమ్మే సులక్ష్యా విదీ 

.....


తే. నల్లని వలువలు గల లంకాధి పతియు

బురద మలపంక మందున బోర్ల పడియు

కంఠమునకు ఉరి కలిగి కాళి లాగె

త్రిజట కలగాంచె సమయమ్ము తెలిపె యచట 

మీ రందరూ ఎక్కువమాట్లాడవద్దు,  తాయిలాలకు, మీ కోపాలకు, రావణ ఆశలకు తనఖా పెట్టే జానకి తనువు కాదు, తరువులా పరాయిపీడనలోనున్న మీ అందరికీ సహాయము చేయగలదు, మరవకండి, ప్రేమించండి 

ఉచితా నుచితాలు మరచి ఎరవేసే గుణాలు మానండి,  అరచేతిలో స్వర్గంచూపినా భర్తను తప్ప వేరొకరిని ప్రేమించదు, లోకదర్మాన్ని విస్మరింంచి ప్రవర్తించదు, నేను కలగన్నాను రావణ సంహారం, సీత రాముని చేరిక, మీ మాటలు కట్టిపెట్టండి. అంటూ అరచింది వృద్ధ త్రిజట, తోటి వనితలతో l


ప్రాంజలి ప్రభ నేటి ఆలోచన రామాయణం సుందరకాండ 04/05


సీతాదేవి బాధతో పలుకులు


ఉ. కామము మీద నాసగల కాముని కేక్కడి కీర్తి కీర్తిపై

వే మన కల్గు నాతనికి విత్తము మీద మరెక్కడాస? ఈ

కామ జగంబునందుకల కాలము కీర్తి మదంబు గాంచి మ

మ్మా మను దుష్ట బుద్దిగను మాయను చేరియు రాక్షసమ్ముగన్

.....

సమయము నున్న మనకాల సం తసము నర్గును క్షణములో

మమతయి పెండ్లి సమకాల దగు చూడ వత్సరములో

సమ సహనమ్ము నధికంబు? సాధు పని కూలిపోవును కదా

అమరిక ప్రేమ గను నుండు నట్లె పతినందు విద్యను కదా

....

వాకిటి వెల్గులు ప్రారంభంలో తోడై తరింప సహసౌందర్యం అదేభాగ్యము అదేస్వర్గము 

చీకటి మూసిన ఏకాంతంలో తోడోకరుండిన అదేభాగ్యము అదేస్వర్గము (ప్రకృతి)

ప్రేమను చూపిన ఏకాంతంలో ఆనందమోందిన అదేభాగ్యము అదేస్వర్గము

దేహము దాహము తీర్చేప్రేమే సంతోష పర్చిన అదేభాగ్యము అదేస్వర్గము

....

ప్రతి అణువులోపల స్పందన మందే ప్రాణ శక్తి

ప్రతి  కణము లోపల ఉజ్వల మందే కాంతి శక్తి

ప్రతి చనువు లోపల యైక్యత మందే స్నేహ శక్తి

ప్రతి తనువు లోపల సంస్మర నొందే ప్రేమ శక్తి

.....

ఆ. కడగి వట్టి యాస కడ తెరనివ్వదు

ఇడుములందు పెట్టి ఈడ్చగాని 

పుడమి జనుల భక్తి పొడమంగనియ్యదు

కడవరకు కలలగు కనుల నీరు

......

నన్ను నన్నుగా ప్రేమించే మనసు నాకు తోడు నీడగవుంది

మన్ను మిన్నుగా ప్రేమించే తరుణ మేను ఆశ నిండుగవుంది

కన్ను కన్నుగా ఆశించే కరుణ యేను నాకు మెండుగఉంది

నన్ను నన్నుగా గుర్తించాలి ఇక రామభద్ర చెండుగఉంది

....

నిరాశ నిస్సహాయత గురి ఏల

ఎవరో ఒకరు వస్తారు, తోడై మార్గం చెపుతారు

పరాన తంత్ర మేయిది సెగ లేల

మనలో మనము చూస్తాము, కాలం మార్పే చెపుతారు

విరోధి మంత్రమే యిది పగలేల

కధలే కదలు చూస్తాము, ప్రేమా కొర్కే చెపుతారు

సరాగ మయము ఇక సుఖ లీల 

జరిగే విధియు చూస్తాము, స్నేహం ప్రాణం పోస్తారు

.....

ఉ.మక్కువ తోన వచ్చు సుఖ మార్గము తెల్పుదు రొక్క రొక్కరు

న్మక్కవ నుద్ద రించుటలు మైత్రికి జూడగ యుక్తమే సుమీ

చెక్కలు నీటి తేలి యగు చిక్కులు మాపును నిత్యసత్యమున్

దక్కక వచ్చుచుండుట నిదానము గాదె ఒ రామ భద్రుడా

....

ఆ. భూమి నిప్పు నీరు భుక్తికి తోడుగా

కడలి పొంగు మల్లె గాలి కదలు

సర్వ సౌక్య మిచ్చు సమయమ్మ నీడగా

అంబరమ్ము జోడు ఆశయమగు

....

మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ

**************

పాట సందర్భంపై నా విశ్లేషణ.

**************************

  అతనో లంకాధి పతి 

 అతనిపై మనసు లేదని మాట చెప్పిన సీతతో  స్వచ్ఛమైన నిజాయితీ   సంస్కారం అతని అత్యుత్తమమైన   మానసిక పరిణతి

 ప్రతిబింబించేలా   ఈ పాట.

************************************************

పల్లవి:-

*********

చెట్టు క్రింద  దొరసాని

మీది మీదికి రమ్ము మరి మరీ 

నా దృష్టిలో మహరాణివి 

నీ కోరికను తీర్చ గలుగు తాను నేను.


నా నీడైనా  నీకు చేరువ కాకూడ లేదు 

నీ ప్రేమకు వంచన చేయలేను 

మంచిని నేను నా భర్తకై వేచి ఉన్నను 

నీ దారిని నేను రాలేను ఎప్పడికీ 

 నీ తోడును ఎన్నటికీ  కాలేను!!


చెట్టు క్రింద  దొరసాని

మీది మీదికి రమ్ము మరి మరీ 

నా దృష్టిలో మహరాణివి 

నీ కోరికను తీర్చ గలుగు తాను నేను.

చరణం:-

**********

మీ కింద  నేను మాట తప్పను ఏనాడు 

నాపై నీ ఆలోచనలు మార్చుము ఈనాడు

నిప్పు ను పట్టలేవు, స్త్రీని స్త్రీ గా చూడలేవు


మీ కాపలా కుక్కగా ఉంటాను 

విశ్వాసమే  నా జాతి జీవం అది తెలుసుకో

నన్ను చూసి రెచ్చిపోకు, నీవు నా స్వాధీనంలో నున్నావు 

ఆ ప్రేలాపన మాటలు మానుము 

ఏ ఆశా లేని   జీవనం అనకు సర్వం నీకుధారపొస్తున్నాను 


చెట్టు క్రింద  దొరసాని

మీది మీదికి రమ్ము మరి మరీ 

నా దృష్టిలో మహరాణివి 

నీ కోరికను తీర్చ గలుగు తాను నేను.


చరణం:-

********

నీతి తప్పిన నిమిషమే 

నింగిలోకి చేరును నా ప్రాణం.

రాక్షసులకు మానవ వనిత కాజాలదు 

జాతి వైరం ఉన్నచోట బ్రతుకు ముడిపడదు 


జ్ఞానం  అజ్ఞానమైతే సర్వం నాశనం ఖాయం 

అర్ధం చేసుకో నేటి ధర్మం

దరిచేరాలనే ఆలోచనే మహా పాపం!!


నియమం పరిది దాటి అత్యాశగా మారితే

జరిగే ఘోరం ఊహకే  అందని అరాచకం


కలలో  గనపడి ఉడికించే రాకుమారి

నీ ఒప్పు కోనేదాకా తాకను నేను 

మల్లి కనిపించనుమట్టి సాక్షిగా చెబుతున్నా ఓ సుందరి

నీ ప్రేమకై తపిస్తూ వెను తిరుగుతున్నా 

 పల్లవి:-

********

చెట్టు క్రింద  దొరసాని

మీది మీదికి రమ్ము మరి మరీ 

నా దృష్టిలో మహరాణివి 

నీ కోరికను తీర్చ గలుగు తాను నేను... (2)


***************************


లంకాఆధిపతి గర్వము ఇదీ 


శా.ఈ ధీమా గమనమ్ముగాను యిలలో ఈప్సిత్వ భావమ్ముగా

స్వాధీనా కలలన్ని ఆశయముగా సాధ్యా మసాధ్యమ్ముగా

బంధీఖాన యనేది బంధ మయమై బంధుత్వ లక్ష్యమ్ముగా

సంధీ భావము లేక గర్వము కళే సందర్భ లంకాధి పా 


కందగీతగర్భ చంపకము


సీతాదేవి రాముని ప్రార్ధించుట 


స్థిర కరుణాకరా రమణ శ్రీ మతి చిన్మయ చూపు నిల్పగా 

వర కృప నీ మదీ సహన వందిత సేవలు కాల నిర్ణయం 

మరి మరి తెల్ప దా విమల!మంగళ విశ్వగుణాభి రామ ముం 

దర వినుతా!సుధీ! జయము సుందర నీ సతి ప్రేమ బ్రోవుమా


హనుమంతుని సీతాదేవి రామలక్షణాలను తెలపమంది 

సుభద్రక వృత్తము..

భ ర న ర న ర న గ 12 యతి


నీవని నే ననా యనగ తెల్పు నేస్తము మనోభి రామ కథను తె

ల్పావలె సాధనా గుణము కల్లలాడకము నాదుప్రేమ విలువ సా 

ధ్యా వరమై సహాయ మది శోక దా హమగు సేవ దృక్పధము మ

న్యోవిధి రమ్యతా మలుపు కార్యమో వినయవాంఛలే మనసుగా

.....

వో రాక్షసి వనితలారా అమ్మతో వనండి


మ. కో . రామ ధర్మము నిత్య సత్యము  రామ ధీరత  కోరుమా

రామ రాజ్యము ధర్మ మార్గము రామ ధామము కాంచుమా

రామ నీతిని రామ నిష్టను రామ ప్రేమను  పొందుమా

రామ సౌమ్యత రామ శ్రేష్టత  రామ స్వచ్ఛత మెచ్చుమా


రామ నామము రామ రూపము రామ పాదము పట్టుమా

రామ రక్షణ రామ శిక్షణ రామ దీవెన లందుమా

రామ బాణము తీర్గు లేనిది రామ లక్ష్యము చూడుమా

రామ శక్తియు సర్వ సృష్టియు రామ యుక్తియు నేర్చుమా


రామ దక్షత సత్య వాదము రామ పాలన చూడుమా

రామ నిష్ఠను విశ్వ నేస్తము రామ శ్రేష్ఠత తెల్పుమా

రామ రూపము సర్వ భావము రామ శిక్షణ తెల్పుమా

రామ దూతయు సేవ చేయును రామదీవెన నిత్యమూ


......


**************

పాట సందర్భంపై నా విశ్లేషణ.

**************************

  అతనో లంకాధి పతి 

 అతనిపై మనసు లేదని మాట చెప్పిన సీతతో  స్వచ్ఛమైన నిజాయితీ   సంస్కారం అతని అత్యుత్తమమైన   మానసిక పరిణతి

 ప్రతిబింబించేలా   ఈ పాట.

************************************************

పల్లవి:-

*********

చెట్టు క్రింద  దొరసాని

మీది మీదికి రమ్ము మరి మరీ 

నా దృష్టిలో మహరాణివి 

నీ కోరికను తీర్చ గలుగు తాను నేను.


నా నీడైనా  నీకు చేరువ కాకూడ లేదు 

నీ ప్రేమకు వంచన చేయలేను 

మంచిని నేను నా భర్తకై వేచి ఉన్నను 

నీ దారిని నేను రాలేను ఎప్పడికీ 

 నీ తోడును ఎన్నటికీ  కాలేను!!


చెట్టు క్రింద  దొరసాని

మీది మీదికి రమ్ము మరి మరీ 

నా దృష్టిలో మహరాణివి 

నీ కోరికను తీర్చ గలుగు తాను నేను.

చరణం:-

**********

మీ కింద  నేను మాట తప్పను ఏనాడు 

నాపై నీ ఆలోచనలు మార్చుము ఈనాడు

నిప్పు ను పట్టలేవు, స్త్రీని స్త్రీ గా చూడలేవు


మీ కాపలా కుక్కగా ఉంటాను 

విశ్వాసమే  నా జాతి జీవం అది తెలుసుకో

నన్ను చూసి రెచ్చిపోకు, నీవు నా స్వాధీనంలో నున్నావు 

ఆ ప్రేలాపన మాటలు మానుము 

ఏ ఆశా లేని   జీవనం అనకు సర్వం నీకుధారపొస్తున్నాను 


చెట్టు క్రింద  దొరసాని

మీది మీదికి రమ్ము మరి మరీ 

నా దృష్టిలో మహరాణివి 

నీ కోరికను తీర్చ గలుగు తాను నేను.


చరణం:-

********

నీతి తప్పిన నిమిషమే 

నింగిలోకి చేరును నా ప్రాణం.

రాక్షసులకు మానవ వనిత కాజాలదు 

జాతి వైరం ఉన్నచోట బ్రతుకు ముడిపడదు 


జ్ఞానం  అజ్ఞానమైతే సర్వం నాశనం ఖాయం 

అర్ధం చేసుకో నేటి ధర్మం

దరిచేరాలనే ఆలోచనే మహా పాపం!!


నియమం పరిది దాటి అత్యాశగా మారితే

జరిగే ఘోరం ఊహకే  అందని అరాచకం


కలలో  గనపడి ఉడికించే రాకుమారి

నీ ఒప్పు కోనేదాకా తాకను నేను 

మల్లి కనిపించనుమట్టి సాక్షిగా చెబుతున్నా ఓ సుందరి

నీ ప్రేమకై తపిస్తూ వెను తిరుగుతున్నా 

 పల్లవి:-

********

చెట్టు క్రింద  దొరసాని

మీది మీదికి రమ్ము మరి మరీ 

నా దృష్టిలో మహరాణివి 

నీ కోరికను తీర్చ గలుగు తాను నేను... (2)


***************************


లంకాఆధిపతి గర్వము ఇదీ 


శా.ఈ ధీమా గమనమ్ముగాను యిలలో ఈప్సిత్వ భావమ్ముగా

స్వాధీనా కలలన్ని ఆశయముగా సాధ్యా మసాధ్యమ్ముగా

బంధీఖాన యనేది బంధ మయమై బంధుత్వ లక్ష్యమ్ముగా

సంధీ భావము లేక గర్వము కళే సందర్భ లంకాధి పా


సరసిజ వృత్తము

మ త య న న న న స

10,,,18..యతి...

4 వ అక్షరం తర్వాత ప్రాస యతి...అంటే....6 వ అక్షరం


ప్రేమేలే విద్యా వినయమ్మూ ప్రతిభ సహనము శపధ మది విధమే 

ప్రేమేలే రమ్యా రమణమ్మే ప్రగతి విధివిభవ ప్రభల గమనమే

ప్రేమేలే బ్రహ్మా భ్రమలన్నీ ప్రణతి వినతి గతి పలకు చలనమే

ప్రేమేలే రాజ్యం రమ తత్వం ప్రభల

వెలుగు మది ప్రమిద వినయమే


సీతా దేవి ప్రేమగురించి లంకాధిపతి తో నీభార్యలను సుఖపెట్టు అనితెలిపే 


కందగీతగర్భ చంపకము


సీతాదేవి రాముని ప్రార్ధించుట 


స్థిర కరుణాకరా రమణ శ్రీ మతి చిన్మయ చూపు నిల్పగా 

వర కృప నీ మదీ సహన వందిత సేవలు కాల నిర్ణయం 

మరి మరి తెల్ప దా విమల!మంగళ విశ్వగుణాభి రామ ముం 

దర వినుతా!సుధీ! జయము సుందర నీ సతి ప్రేమ బ్రోవుమా


హనుమంతుని సీతాదేవి రామలక్షణాలను తెలపమంది 

సుభద్రక వృత్తము..

భ ర న ర న ర న గ 12 యతి


నీవని నే ననా యనగ తెల్పు నేస్తము మనోభి రామ కథను తె

ల్పావలె సాధనా గుణము కల్లలాడకము నాదుప్రేమ విలువ సా 

ధ్యా వరమై సహాయ మది శోక దా హమగు సేవ దృక్పధము మ

న్యోవిధి రమ్యతా మలుపు కార్యమో వినయవాంఛలే మనసుగా

.....

ఛందోగోపనము.కందపద్యము


కనుల మెరుపు లె కధగా

చణువే చూపియు మనసున చేరువ యగుటే

తణువే విధి గురువను చే

కొని చదువంగ మొదటి వగు కోమలి చెపుమా

.....


వో రాక్షసి వనితలారా అమ్మతో ఉండండి 


మ. కో . రామ ధర్మము నిత్య సత్యము  రామ ధీరత  కోరుమా

రామ రాజ్యము ధర్మ మార్గము రామ ధామము కాంచుమా

రామ నీతిని రామ నిష్టను రామ ప్రేమను  పొందుమా

రామ సౌమ్యత రామ శ్రేష్టత  రామ స్వచ్ఛత మెచ్చుమా


రామ నామము రామ రూపము రామ పాదము పట్టుమా

రామ రక్షణ రామ శిక్షణ రామ దీవెన లందుమా

రామ బాణము తీర్గు లేనిది రామ లక్ష్యము చూడుమా

రామ శక్తియు సర్వ సృష్టియు రామ యుక్తియు నేర్చుమా


రామ దక్షత సత్య వాదము రామ పాలన చూడుమా

రామ నిష్ఠను విశ్వ నేస్తము రామ శ్రేష్ఠత తెల్పుమా

రామ రూపము సర్వ భావము రామ శిక్షణ తెల్పుమా

రామ దూతయు సేవ చేయును రామదీవెన నిత్యమూ


......


త్రిజట పలుకులు


అశ్వలలిత వృత్తము

న జ భ జ భ జ భ వ 13యతి


మ. ఇంతలోపల దైత్యకాంతాలు ఇష్టమోచ్చిన రీతినా

అంతు బట్టక ఉండలేకయు ఆశ చూపుట ఏలనో

భీతి చెందెను రాక్షషాంగన భీకరమ్మగు అర్పులే

దూరముండుము కాలనిర్ణయ దూర్త రావణ లీలలే


ఉ.మందన త్రాగిరే మరియు మానస వాక్కులు గొప్ప చెప్పిరే 

వందన మంటు కోర్కెలను వాదన చేయుచు దిక్క రింతురే

బంధము మీకు మాకు యిది బాదర చేష్టలు నీ సదస్సులో 

నందరు నందరేమరియు నందరు నందరె యందరందరే


 తే.ఇపుడు నేనొక కలగంటి నింతు లార

అందు మనరావణుని కన్న అందగాడు

నిలమేఘపు ఛాయాతో నెగడు వాడు

అతడు రామచంద్రుడు కలనందు చూచె


తే. వాని ప్రక్కన అపరంజి వన్నె వాడు

నాగఫణి కాంతి కలవాడు నయన రేడు

కోడె వయసున దనరాడు కొత్తవాడు

అతడు లక్ష్మణుడు కలలో అతని చూచె


ఆ. అనుచు త్రిజట తెలిపె మనముగా కలసియు

సీత వద్ద కేగి చేతు లెత్తి

దండములను పెట్టి దయచూడ మని కోరె

సీత పలుకు శుభము సీఘ్ర మందు 


తే. ఇరువురు కళ తో సైన్య వాహినులతోడ

ముమ్మరమ్ముగా లంకను ముట్టడించి

యుద్ధ విద్య రావణ సంహ రించి కదలి

చనిరి సీతమ్ము తోడ పుష్పకము నెక్కె


వనమంజరీ వృత్తము

న జ జ జ జ భ ర 11యతి


 మనసు జగాన సుధర్మ  సమాన విధాన భాగ్యపు రమ్యతే

వినయము జ్ఞానము విశ్వపు వీక్షణ వేగ లభించు నిక్కమో

ఘనమగు కీర్తికి నీకిక కారణ మౌను సుమీ జయంబగున్

మనుజుడ విద్య మహత్తది మానక విద్యను నేర్వు సుధీ!!

....

మ. దేశమేయిది అందరందరి ధేనువే యగు సత్యమై

ఆశపాశమె జీవి తమ్ముగు ఆటమాటగా నిత్యమై

వేసమైనను విశ్వముందున వేయగల్గియు ధర్మమై

వాసికెక్కెడి తీరుమర్గము వాన మల్లెను దైవమై


మల్లాప్రగడ సుందరకాండ.. సీత ఆలాపన 06/05


ఉ.నిన్నును దల్చితీ నిజము నేనిను తల్వని రోజు లేదులే

మిన్నును సాక్షిగా పలుకు మేమన లేకయు తెల్ప చుంటి నీ

సన్నిధి నేనుకోరుటయు సామ్యము ధర్మము హృద్యమే యగున్

మన్నును సౌఖ్యసంపదను మర్చియు ఏదియు జీవితమ్మ గున్ 

.....

శా.నీరూపంబును నేను దల్చ మదిలో ఇష్టమ్ము సంతృప్తి గన్ 

భారంబెంతయు తగ్గి శాంతి కలిగీ ప్రారబ్ధ సంతోషమే 

సారంబెంతయు లేని జీవితమునీ సాన్నిధ్య సత్యమ్మునే 

జేరన్న్రాగలదారి కోరి పలుకే  చిద్రూప రామమ్ భజే

....

తే. గగన మందు ఘర్జనలేల గమ్య మిపుడు

వాన చినుకులు మనసుగా వసుధ పండు

ఆచరించని కళలకు అదును ఏది

ఆచరణయను లక్ష్యము మరచె రామ


సీత ఆవేదన

.....

నేత్ర రోగికి దీపము ఇష్ట మవదు

మనసున అశాంతి కష్టపు మార్గ మౌను

పరుష మగు జవాబు కళల ఫలము ఇదియు

భయము తొందర బాధ్యత బంది ఖాన

(సీత లక్ష్మణుని దూషణ ఫలితమని తలచె)

......

బంధుర వృత్తము

న న న న స భ భ భ గ 16 యతి


పలుకుల మెరుపులు కదలెను కథగన్ పండుగ నందున వేడుకగన్

తలపులు మరువక ఒకరికొకరుగన్ తాహతు మర్చియు సందడిగన్

మలుపులు తగువులు మరచి ఒకటిగన్ మార్గము సంతస లక్ష్యముగన్

తలుపులు తెరచియు శుభము గను రవిన్ తాండవ మాడమనే విధిగన్ 

....


మనవలె మనవలె మనవలె

సతమున్ మంచిగ, పెద్దల మాటలనో

వినవలె వినవలె వినవలె

నరుడా వీనుల విందుగ సత్యమునే

కనవలె కనవలె కనవలె

జయమౌ కల్మషమున్ విడి

నిత్యమికన్

జనవలె జనవలె జనవలె

శుభమౌ జ్ఞానపుమార్గము

వేడ్క సుధీ!!76

సీతాదేవికి పట్టాభిషేకం సంబరం గుర్తు కొచ్చింది 


....

ద్విపద 


బాహుబలము చూప లేకగ నున్న

దాహమునే పంచ వీలు లే కున్న


శ్రమ జలమును చింత చూపక నున్న

సమతను మమతను పంచక యున్న


పసిడి పంటకు తోడు లేకను యున్న

కసి చూపులను పంచ లేకను యున్న


ఆకలి యన్నది లేకను యున్న

ఏకము వీలును లేకను యున్న


పక్క నెట్టేది మనసు లేక యున్న

గుక్కతిప్పనులేని స్థితుగాను యున్న


అడుగేట్టె దారియు దొరకక యున్న

మడుగులో మునిగినా నావలా గున్న


నడుము కట్టె విధియు కానక యున్న

మడమ తిప్పి పలుకు ఒప్పక యున్న


ప్రాణ పణంగాను పెట్టలేకున్న

మాన సం రక్షణ శక్తిగా నున్న

....


తే. అర్ధ పరమార్ధ ఎరుగని ఆశ యదియు

అర్ధమయిన ఆవేదన చెప్ప లేక

మనసు యుద్ధము చేయటం మనుగడేల

ఇరువురి కలయు దుఃఖము ఇష్ట మేళ

.....

జలదరవ వృత్తము..15 యతి

8 న గణములు ఒక గురువు


కలలు కలత మలుపు లగట చినుకు కొరకు వగచి వెతలుగా

అలక యనునది సహజమగు విధి అనుటయు మనసు కథలుగా

పలక గలిగెడి విన గలిగెడిది పదముల పదును విధులుగా

కలకల గలగల జలరవమగు కనుల కదలిక కళలుగా 

....


భుజంగ విజృంభిత వృత్తము


మ మ త న న న ర స వ

9,,19 యతి...


ఏమాయో ఏమీ ఆశించే బ్ర తుకున కన నరకము ఏలనో యగుటే మది న్

కామమ్మే నన్నీ మార్గమ్మే ఇరుకున పడ విధిగనె కర్మమ్ము మనుటే యగున్

సామామ్మే లేకే సాధ్యా సాధ్యము తలవక సమరము శాంతిగా  పలుకే యగున్

నా మానమ్మే పొందాలన్నా నను పతియు గతియగునే ఔదర్య సుఖమే యగున్

....

సీత దేవి ఆవేదనతో 


తరుమ వలదు పరుల నెపుడు సమత మమత వరల వలయు గా

పరుల హితవు పరమగుణము

మరువ వలదు మహిని వినుమికన్

దురితములనుతరుమవలయు

వినదు మనసు విడువ నెపుడహో

గురువు వలన గురుతు నెరిగి

మరుగు దెలిసి మసలుమిక సుధీ!!77


ऊँ !

----

" चंद्रलेखा -- న స ర ర గ ..13/7..

--

సుదతి మనసే సూత్రమై జీవితంగా

విధి మలపులే విశ్వ మా యైపరంగా

మది తలపు లే మాన రక్షా విధంగా

హృదయ యతిశం హాయి లేకే భయంగా


----

 " జయవృత్తః -- స స భ స స స..18/10...

--

లలలా లలలా లాలల లలలా లలలా లలలా

చిలకా వినుమా గనుమా చెలిగా తరుణమ్ముగనే

అలకా పలుకే కులుకే అనకే అ ధరమ్ముగనే

మలుపే మెరుపై కలిసే మనసే చిలికే వయసై 


----

 వనితా వినవా నామది వలపై తలపై పలుకా

చినుకై నినునే తాకితి చెలిగా మనసివ్వుములే

తనువై నినునే కోరితి త మకమ్ముగనే విధియే

మనమై ఒకటై కల్సిన మధురం సుఖమే యగులే

.......

చలిగా గిలిగా ఉందిలె చరితం ఇదియే విధిగా

పలుకే వినుమా అర్ధము పదమే మనుమా ఎపుడూ

కలలో మెదిలే భావము కథలై కదిలే మిపుడూ

ఇలలో సుఖమే మార్గము ఇపుడే పెరిగే మదిలో

.......


సమ్మోహనం

ఆధారమే గతం... గతమే సమ్మతమ్ము

సమ్మత బ్రతుకులో... బ్రతుకే నిదానమ్ము

నిదాన జీవితాన.... జీవమే నరకమ్ము

నరకమే లోపమై... లోపమే శాపమ్ము


శాపమే మోహమై... మోహమే లోభమ్ము

లోభమే ఊతమై.. ఊతమే దాహమ్ము

దాహమే పాపమై... పాపమే నేరమ్ము

నేరమే కాలమై... కాలమే కష్టమ్ము

......

సీతాదేవి మానవులయొక్క అధికారాలను రక్కసులకు చెప్పుట 


మనిషికి అస్త్రం కన్న....శాంతము ఆకారము 

సరళ జీవిత మన్న.....  సాధన సహ కారము 

 ఐశ్వర్యం మున్నను... దానమ్ము పకారము 

శ్రేష్ఠ మైనది ప్పుడు... సహనా లంకారము


భరించలేనిమనిషి...మనసు భాధా కరం

విధించినట్టి శిక్షకు... ప్రేమయే దిక్కారము

మానవత్వమునకే... మణుగ డలంకారము

పుడమికి విధి నిత్యము... ఓర్పె అలంకారము


విద్యకు మొదలు దిద్దు..... పద్దతి శ్రీకారము 

మనిషిని గౌరవించు.... విధమే సాకారము 

స్త్రీ పురుష ప్రేమలో....ప్రేయసి మమకారము 

పలకరించే విధము.... సహన సాధి కారము 


 పదవితో పొందేది.... పలుకే అధికారము 

 లేకుండా చేయుట... నిజ ప్రత్యుపకారము 

వేల కోలం చేయు... నవ్వుల వెటకారము 

భయంతో చేసేది... శబ్దా భయంకరము 


బహుమతిగా తెలపెడి...జనుల పురస్కారము 

ఎదురించే బుద్ధి... లోల కత్వ కారము 

వద్దని తిప్పికొట్టె..... మనసు తిరస్కారము 

లెక్కల్లో తెల్పేది....గుణముయె గుణకారము 


గుణింతంలో అలక... ఒ గుణింతాకారము 

గర్వంతో ధనంతో ... తెలుపు అహంకారము 

సమస్యలకు తీర్చుట... సానుకూల కారము

ప్రయోగశాలలోన.... వాడు సురేకారము

.....

సంధులలో నుండే... మది దీర్ఘా కారము 

సాయం లో నుండే... నిత్యము సహకారము

స్త్రీలకు నచ్చేదియు.... ముఖ అలంకారము 

మేలు చేసే పనియే.. మది ప్రత్యుప కారము 


మది కీడు చేసేది... కలలై అపకారము 

శివునికి నచ్చే దియు... మది లింగా కారము 

విష్ణువులో ప్రార్ధన... నిత్యము ఓంకారము 

ఏనుగు చేయు శబ్ద... పెద్ద ఘిమ్ కారము 


మదంతో చేసేది.. మన్మదాకారము 

 పైత్యం తో వచ్చే... మనిషికి వికారము 


రూపంతో వచ్చే... మనిషిలొ ఆకారము 

ఇంటి చుట్టూ ఉండు... రక్షణ ప్రాకారము 

ఒప్పుకునే విధియే

.. అంగీకారము

సీతాదేవి మానవులయొక్క అధికారాలను రక్కసులకు చెప్పుట
మనిషికి అస్త్రం కన్న....శాంతము ఆకారము
సరళ జీవిత మన్న..... సాధన సహ కారము
ఐశ్వర్యం మున్నను... దానమ్ము పకారము
శ్రేష్ఠ మైనది ప్పుడు... సహనా లంకారము
భరించలేనిమనిషి...మనసు భాధా కరం
విధించినట్టి శిక్షకు... ప్రేమయే దిక్కారము
మానవత్వమునకే... మణుగ డలంకారము
పుడమికి విధి నిత్యము... ఓర్పె అలంకారము
విద్యకు మొదలు దిద్దు..... పద్దతి శ్రీకారము
మనిషిని గౌరవించు.... విధమే సాకారము
స్త్రీ పురుష ప్రేమలో....ప్రేయసి మమకారము
పలకరించే విధము.... సహన సాధి కారము
పదవితో పొందేది.... పలుకే అధికారము
లేకుండా చేయుట... నిజ ప్రత్యుపకారము
వేల కోలం చేయు... నవ్వుల వెటకారము
భయంతో చేసేది... శబ్దా భయంకరము
బహుమతిగా తెలపెడి...జనుల పురస్కారము
ఎదురించే బుద్ధి... లోల కత్వ కారము
వద్దని తిప్పికొట్టె..... మనసు తిరస్కారము
లెక్కల్లో తెల్పేది....గుణముయె గుణకారము
గుణింతంలో అలక... ఒ గుణింతాకారము
గర్వంతో ధనంతో ... తెలుపు అహంకారము
సమస్యలకు తీర్చుట... సానుకూల కారము
ప్రయోగశాలలోన.... వాడు సురేకారము
.....
సంధులలో నుండే... మది దీర్ఘా కారము
సాయం లో నుండే... నిత్యము సహకారము
స్త్రీలకు నచ్చేదియు.... ముఖ అలంకారము
మేలు చేసే పనియే.. మది ప్రత్యుప కారము
మది కీడు చేసేది... కలలై అపకారము
శివునికి నచ్చే దియు... మది లింగా కారము
విష్ణువులో ప్రార్ధన... నిత్యము ఓంకారము
ఏనుగు చేయు శబ్ద... పెద్ద ఘిమ్ కారము
మదంతో చేసేది.. మన్మదాకారము
పైత్యం తో వచ్చే... మనిషికి వికారము
రూపంతో వచ్చే... మనిషిలొ ఆకారము
ఇంటి చుట్టూ ఉండు... రక్షణ ప్రాకారము
ఒప్పుకునే విధియే
.. అంగీకారము
All reactions:
Yagna Narayana, Sridevi Mallapragada and 2 others

లంకేశ్వరుడు సీతను లోబరుచుకొనుటకు
రమ్మంచున్ క్షేమమ్మౌ తీరుణ్ రకరకముల రుచులు విధిగను మదీ
రమ్యమ్మే సౌఖ్యమ్మే నీకున్ రతి సుఖములు బడయ గలవులె సుధీ
మమ్మానందం పర్చే కాలమ్ మధురపు మమత సమత గనే
నమ్మా మార్గమ్మేలే వెడ్కన్ న యన గతి విధి మనసు యగున్
లంకేశ్వరుడు సీతను లోబరుచుకొనుటకుమద్రక వృత్తము
భ ర న ర స స న గ 11యతి
పచ్చనిచెట్లు నిన్నుగనుట భవ్య వెల్గులుగా హరితంబగును సుమీ
విచ్చెను మొగ్గ పువ్వులగును వెచ్చగా సహకారముగా నిజము సుమీ
కిచ్చట కీర్తి వచ్చునిక నాతి మంగళమౌనుకదా విమల సుమీ
మచ్చుక నన్నునమ్మవలె భామ పంతము ఏల సుధా మధుర సుధీ
.......
సాహిత్య వేదాంత మనోభవమ్మే నినునే కోరుట తిధీ
దాహమ్ము తీర్చాలి సమర్ధతమ్మే సమయమ్మే మది నిధీ
దేహమ్ము ధర్మమ్మె సుధా సమమ్మే వినయమ్మే సహ విధీ
మొహమ్ము మార్గమ్ము విదీ సుతారమ్మగుటే మానస మదీ
ద్విపద భావము
స్వప్న మాధురియగు స్వాగతంబిదియు
స్వప్న మే అంతరస్వర మాయ యగు
దృశ్య కదలికలు దీప్తిగా వరలి
దృశ్యమనేది యాకృతిగాను మెరువు
ప్రకృతి సౌందర్యపు ప్రగతియు వరము
ప్రకృతి పులకరింప ప్రతిభగా పలుకు
పుష్ప జాతులు నిద్ర పుడమిన మెరుపు
పుష్పసుగంధాలు పూజ్యము నగుట
నీలాల నింగిలో నియమాల కలలు
కోలాట సందడి కోరిక మెరుపు
నెమలికి నడకలు నేర్పిన యట్లు
ఆమని నటనల ఆనంద మల్లె
పావనము విధాత పారవస్యమగు
దీవెన కనువిప్పు దివ్యమై కదులు
హృదయమ్ము ఆనంద హేలగా వరలు
హృదయమ్ము భర్త సహేతుక మగును
అని సీతాదేవి త్రిజట చెప్పన కధకు హృదయానంద భరిత సంభవ మార్గ
మీ మల్లాప్రగడ రామకృష్ణ
4
  • Like
సీతాదేవిని కలసి హనుమ సంభాషణ
విచికిలిత వృత్తము
7..నగణములు1గ..13 యతి
నినుగనియు మురిసితిని విధి నియమ బ్రతుకు ఇదియే
నినుగని మరువక మదిన వినిమయమును తెలిపెదా
మనవలె రిపుడును పతి కళ మనసులగు విధిగా
కను జయ మగును మన మొకటి కళయికలు జరుగుటే
కనకలత వృత్తము
6 నగణములు1గ..యతి13
మగువగ జననము వడసియు మనసు శరముగా
తగు పురుషుని జతగను సతతము మధురగతిన్
జగతిని వరలుచు సరియగు సమము వడసియున్
జగడములెరుగక సతము సు చరిత గను సుధీ
.....
కరిబృంహిత వృత్తము
భ న భ న భ న ర యతి 13
అక్షయమయిన కార్యములకు సనాతన ధర్మములన్ విదీ
లక్షణ భరిత వేదము నయన రమ్యసుగతిని పొందుటే
సాక్షిగ వరలు మంచితనమను సద్గుణమగుట ధాత్రి దు
ర్లక్షణములను వేగమె విను దురా గత మయమగు సుధీ.
.....మహాశివుని ప్రదిస్తూ సీత
" ఇయ్యది.. సంస్కృత భాషలోని ' అనుష్టుప్ ' ఛందస్సు.."
జ ర త ర జ గు
మనో మయమ్ము రాగ లక్ష్యాన్నీ గురీంద్ర మూలమై
నినాద మార్గమే సహాయమ్మే ను నీల కాంతుడై
అనాది నుండియేను పూజ్యమ్మేను పార్వతీ పతీ
పినాక పాణినే నె కొల్వంగాను నిత్య ఈశ్వరా
...
ऊँ !
" పరేత భూమిసం చారం ,
క రీంద్రచ ర్మధారి ణమ్..
య న మ య జ గు
శివ శంకర మనోధర్మా సహాఁయమ్ము గానులే
భవ బంధమగు సత్యమ్మే సకాలమ్ము మేనులే
నవ భావమగు ధైర్యమ్మే ప్రభావమ్ము నాదిలే
అవ కాశము యె నిత్యమ్మే శివా నమ్మి కొల్చితీ
గిరీంద్రా త్మజమ నోజ్ఞం ,
నీ లకంఠం సమాశ్ర యే
----
హర నర్తన వృత్తము
ర స జ య భ ర.. 9 14 యతి
మస్తకంబన భవ్యమౌ మది వర్గంబౌ మధురమ్ సదా
స్వస్తకంబున నుండుసుమ్మ
సవిస్తారాంశపు శోభతో
నేస్తమై వరలంగ మానితమౌ తీరున్ నిను గాచునో
వాస్తవంబిదియె సేవ !ప్రభలన్
బొందన్ వడిగా సుధీ!!
సౌమ్యగుణోన్నతే బ్రతుకు సాధన శోధన గమ్య మాయనే
రమ్యతనూ విరాజితము రవ్వల వెల్గుల నీడలే యగున్
గమ్యము కానరాని దరి కానల నందున ఏల నుండుటన్
రమ్యతనూవిలాసుడగు రాముడు హాయిగ నుండ గల్గుటన్
సీస పద్యము (సిట్ దేవి ఆలోచన వివరణ)
కళలన్ని చూపేటి కాలమే మనము
గథలన్ని చెప్పేటి గగన జనము
మనసులో మోహమ్ము మమతల కణము
మమతలో మాయల్తొ మనసు మనము
ప్రేమించి పోందుట ప్రేమల వనము
సాయమ్ము చేసేది సమయము నిజము
ఆనందం మోందేటి అసలైన సుఖము
సంతోషం చిందేటి సమయ ఫలము
ఆటవెలది
మనము అనుకొనుటయు మార్గమే అవ్వును
వనము వల్ల గాలి హాయి గొలుపు
జనము చేయు లీల జాతి నెంచియు నుండు
కణము కణము గలసి జన్మ జరుగు
***
  • Like

సీతా దేవికి శుభశకునాలు
---------------/
చీకటి తెరలన్ని చిరువెలుగు లగు
వాకిట పరచిన వింతలు కలుగు
వెలుగులు మనసులో విరజిమ్ము చుండె
వెలుగుల వేకువ వెల్లువౌ తుండె
కళ్ళుతెరచి చూస్తు కనుల భానుడగు
కళ్ళు ఉర్వీకాంతి కమనీయ మగుట
కమలబాంధవుడుగా కనులలొ చేరె
విమల చరితుడుగా వీనుల విందు
సూర్యుని సొగసుతో సిగ్గుల చేరె
ఆర్యుని పిలుపులు అలసట చేరె
దాకున్నదృశ్యము దయనీయమగు
కాకున్న బాధయు కాలము తీర్చు
పసుపుగడపలపై పడిపరు గేల
ముసుగు నీడన నున్న ముందర హేళ
సుప్రభాతకిరణాలు శుభమును తెలిపె
ప్రప్రధాన మనసుకు ప్రభలుగా మలుపు
కోవెల గంటలు కోరక కదిలె
కోవెల దైవము కోరుకొనుటయు
జగత్తునంతయు చైతన్యపరచ
గగనమంతయు శబ్ద గానము తెలప
గుండెలనిండాను ఊపిరిపీల్ఛు
బండగ నున్నను బంధము పెరగ
సమైక్యతాత్మక సమ సుఖమగు
మమైక మగుటకు మార్గ శుభమగు
సాక్ష్యాలుగా వచ్చు సఖ్యత కోరి
లక్ష్యాన్ని చేరేటి సమయమిదేను
విచ్చుకుంటున్నవే విరులపైనుండి
మచ్చలేని మనసు మమతలు పెరిగె
యీ విధముగా శుశకునాలు సీతాదేవికి కిరాణరూపంలో తాకే
No photo description available.
All reactions:
V N Rayudu, Uppuluri Venkat Skmohan and 3 others