Monday 30 December 2019

సుందర కాండము-10



 "మిత్రులకు శ్రేయోభలాషులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు"
 
శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-10
రావణుడు అశోక వాటికకు వచ్చుట
మంగళకరమైన చతుర్వాద్య ధ్వనులచే వేకువనే మేల్కొన్న ప్రతాపశాలియైన రావణుడు కామ వికారముచే సీతాదేవిని చూచుటకు అశోక వనమున ప్రవేశించెను. అప్పుడు హనుమ ఆకుల మధ్య నక్కి పరికించి చూచుచుండెను. అప్పుడు సీతాదేవి తొడలతో ఉదరమును, బాహువులతో వక్షస్థలమును కప్పుకొని (ముడుచుకొని) ఏడ్చుతూ కూర్చొనెను. (ఆచ్ఛా ద్యోదర మూరుభ్యాం బాహుభ్యాం చ పయోధరౌ, ఉపవిష్టా విశాలా౭క్షీ రుదన్తీ వరవర్ణినీ). వైవాహికో విధిః స్త్రీణాం ఔపనాయనికః స్మృతః అను స్మృతి వాక్యమును అనుసరించి స్త్రీలకు వివాహము పునర్జన్మ. వివాహ సంస్కార ఫలితముగా సీత ఇక్ష్వాకు వంశమున మెట్టినది. రావణుడు సీతను చూచి "సీతా నీవు భయపడనవసరము లేదు. స్వధర్మో రక్షసాం భీరు సర్వథైవ న సంశయః గమనం వా పర స్త్రీణాం హరణం సంప్రమథ్య వా, ఏవం చైత ద౭కామాం చ న త్వాం స్ప్రక్ష్యామి మైథిలి కామం కామః శరీరే మే యథా కామం ప్రవర్తతామ్ బలాత్కారముగా పరస్త్రీలను పొందుట రాక్షసులమైన మాకు స్వధర్మము. (మరి అయితే మానవ కాంతయైన సీత ధర్మములకు విలువ ఈయక పోవడంలో రావణుని నీచ ప్రవ్రుతిని తెలియజేస్తుంది. మన ధర్మము అనుసరిస్తూ పర ధర్మములను గౌరవించాలి. ప్రస్తుత కాలంలో ఇది పాటించబడుట లేదు. మిక్కిలి శోచనీయం) అయినను నేను కామాతురడను, కానీ బలాత్కారముగా నిన్ను తాకను. ఓ మైథిలీ! నీవు అనేకమైన దివ్యమైన సుగంధములు, వస్త్రములు ధరించి నన్ను చేరుము". ఈ విధముగా అనేక విధములుగా రావణుడు తన పరాక్రమమును చూపి, ప్రలోభములను పెట్టి సీతను తన వైపుకు త్రిప్పుకొనుటకు ప్రయత్నము చేసెను.
సీత రావణునికి హితవు పలుకుట
ఆ రాక్షసుని మాటలకు దుఃఖార్తియై, దీనురాలై శ్రీరాముని తలంచుతూ ఒక గడ్డి పరకను అడ్డుపెట్టుకొని ఇట్లు పలికెను. "నా నుండి మనసును మరల్చుకొని నీ వారిపై మనసును నిలుపుకొనుము. పాపము చేసినవాడు సిద్ధిని కాంక్షించుట ఎంత అయుక్తమో నీవు నన్ను 
కాంక్షించుట అంత అయుక్తము.
యథా తవ తథా౭న్యేషాం దారా రక్ష్యా నిశాచర 5.21.7
 
ఆత్మానమ్ ఉపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యతామ్
అకృతా౭౭త్మానమ్ ఆసాద్య రాజానమ్ అనయే రతమ్ 5.21.11
సమృద్ధాని వినశ్యన్తి రాష్ట్రాణి నగరాణి చ
 
మిత్రమ్ ఔపయికం కర్తుం రామః స్థానం పరీప్సతా        5.2119
వధం చా౭నిచ్ఛతా ఘోరం త్వయా౭సౌ పురుషర్షభః
 
విదితః స హి ధర్మజ్ఞః శరణాగత వత్సలః                      5.2120
తేన మైత్రీ భవతు తే యది జీవితు మిచ్ఛసి
 
పరుని భార్యను అనుభవించవలెనని కోరిక కలిగినప్పుడు ఒక్కసారి తన విషయమున గూడ నా భార్యను వేరొకడు బలాత్కరించి చెరబట్టినచో ఎట్లుండును? ఆలోచించుకొనుము. ధృడ మనస్కుడు కాక పాపకార్యములను ఆచరించు రాజును పొందినచో ఎంతటి సమృద్ధములైన రాజ్యములు నశించక మానవు. లోకములో నిలకడ కావాలని కోరినచో రామునితో మైత్రి చేసికొనుము. ఘోరమైన చావు చావకుండుటకైనను రామునితో మైత్రి చేసికొనుము.  
రావణునకు సీతమ్మ చేసిన ఈ ఉపదేశము సంసారులకు అందరికి ఉపదేశమే. ఇట్లు పలికిన సీత వాక్కులను విని రావణుడు కోపముతో .. బ్రతిమాలుచున్న కొలది స్త్రీకి చులకన యగును. నీపై కల్గిన కామముచే నా కోపమును ఆపి వేయుచున్నది.
 
వామః కామో మనుష్యాణాం యస్మిన్ కిల నిబధ్యతే
జనే తస్మిం స్త్వ౭నుక్రోశః స్నేహ శ్చ కిల జాయతే        5 .22 4
 
ఏ మనుజులపై కామము కలుగునో ఆ మనుజులు శిక్షింపదగిన వారైనను వారిపై దయా స్నేహములు కలుగును. నీవు నన్నాడిన పరుష వాక్యములకు నిన్ను క్రూరముగా సంహరింపవలసి యున్నది సీతా! నీకు సంవత్సరము గడువు ఒసగితిని. ఇంకా నీకు రెండు మాసములు మాత్రమే వ్యవధి యున్నది. అప్పటికి నీవు నన్ను అంగీకరింపనిచో నిన్ను  నాకు ప్రొద్దుటి భోజనమునకు వినియోగింతురు అని పరుషముగా మాట్లాడి వెడలిపోయెను. తరువాత రాక్షస స్త్రీలు, సీతకు నయానా, భయానా అనేక రకములుగా రావణుని పొందమని నచ్చచెప్పుటకు ప్రయత్నము చేసిరి. కానీ సీత వారి మాటలను నిరాకరించెను. అశోక వృక్షముపై యున్న హనుమ వీరి మాటలను నిశ్చలముగా వినెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

సుందర కాండము-9***




శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-9
హనుమ సీతను గుర్తించుట
 

హనుమంతుడు బలముగా కదపబడగా వృక్షముల నుండి ఆకులు, పూలు, పండ్లు పూర్తిగా రాలిపోయి బోసిపోయిన చెట్లు జూదములో పూర్తిగా ఓడిపోయి వస్త్రాభరణములను సైతము కోల్పోయిన జూదరి వలె యున్నవి. "నిర్ధూత పత్ర శిఖరాః శీర్ణ పుష్ప ఫల ద్రుమాః నిక్షిప్త వస్త్రా౭౭భరణా ధూర్తా ఇవ పరాజితాః 15" (జూదరులు మిక్కిలి వ్యసనమునకు లోనగుదురు. వారు వివేక భ్రష్టులై అమూల్యమైన వస్తువులను, తుదకు తమ వస్త్రములను కూడా జూదము నందు ఫణముగా పెట్టుదురు. వాటిని ఓడిపోయినను సిగ్గు పడరు. ధర్మరాజు కూడా ఇట్టి వ్యసనపరుడై తన రాజ్యమును, చివరకు భార్యను కూడా జూదములో ఓడిపోయినాడు. కావున జూదమాడుట ప్రమాదకరం).

 హనుమ అక్కడ ఆకులతో దట్టముగా యున్న ఒక శింశుపా వృక్షము నెక్కి  అటునిటు కలయ చూచెను. అప్పుడు అచట మలినమైన వస్త్రమును ధరించి, ఉపవాసములతో కృశించి, దీనురాలై రాక్షస స్త్రీల మధ్యలో ఉన్న స్త్రీమూర్తిని గాంచెను. జ్వాజ్వాల్య మానముగా ప్రకాశించుచున్న అగ్నిజ్వాలను పొగ కమ్మేసినప్పుడు దానికాంతి స్పష్టముగా గోచరించదు. అట్టి స్త్రీ మూర్తిని గుర్తించవలెను. (ఇప్పుడు హనుమ యుక్తియుక్తముగా తర్కించుకొని ఆమెను గుర్తించుటకై యత్నము చేయుచున్నాడు). ఆమె మలినమైన ఒకే ఒక వస్త్రమును ధరించి యుండెను. దుఃఖియై దీనావస్థలో యున్నది. జడగట్టిన ఆమె కేశపాశము నల్లత్రాచును బోలె కటిప్రదేశము వరకును వ్రేలాడుచుండెను. ఋష్యమూక పర్వతము మీదుగా వెళ్లుచున్నప్పటి అంగన రూపురేఖలే ఈమె యందు గోచరించుచున్నవి. ఈమె తన శోభలచే పున్నమినాటి వెన్నెలవలె అందరికి ఆహ్లాదము కలిగించునట్లున్నది కావున ఈమె సీతయే అయి ఉండవచ్చు. ఈ విధముగా సీతను చూచి హనుమ ఎంతయో సంతసించెను.  ఈమె కొరకే శ్రీరాముడు వాలిని సంహరించెను. నేను సముద్రమును దాటి లంకానగరమును చూచితిని.

ఇక శ్రీరాముడు సముద్ర పరివేష్టితమగు ఈ భూమండలమునే కాదు, జగత్తునంతయు తలక్రిందులు చేసినను సమంజసమే. (రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకా౭౭త్మజా, త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నా౭౭ప్నుయాత్ కళామ్.14). రాముని యందు ప్రీతిచే తన శరీరమును నిల్పుకొని యున్నది (నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్ప ఫల ద్రుమాన్  ఏక స్థ హృదయా నూనం రామమ్ ఏవా౭నుపశ్యతి 25). హనుమ సీతను స్పష్టముగా చూడగోరి దృష్టిని అటు ప్రసరింప చేసెను. అప్పుడు ఆయనకు ఆ సమీపముననే భయంకరాకారమైన అనేకమైన రాక్షస స్త్రీలు కనబడిరి. వారు ఎలా ఉన్నారంటే ..
 

ఏకా౭క్షీమ్ ఏక కర్ణాం చ కర్ణ ప్రావరణాం తథా
అకర్ణాం శ౦కు కర్ణాం చ మస్తకో చ్ఛ్వాస నాసికామ్         5.17.5
అతి కాయో త్తమా౭౦గీం చ తను దీర్ఘ శిరో ధరామ్
 

ధ్వస్త కేశీం తథా౭కేశీం కేశ కమ్బళ ధారిణీమ్                5.17.6
లమ్బ కర్ణ లలాటాం చ లమ్బోదర పయోధరామ్
లమ్బౌష్ఠీం చిబుకౌష్ఠీం చ లమ్బా౭౭స్యాం లమ్బ జానుకామ్    5.17.7
 

హ్రస్వాం దీర్ఘాం చ కుబ్జాం చ వికటాం వామనాం తథా
కరాళా౦ భుగ్న వస్త్రాం చ పి౦గా౭క్షీం వికృతా౭౭ననామ్  5.17.8
వికృతాః పి౦గళా: కాళీ: క్రోధనాః కలహ ప్రియాః
 

కాలా౭౭యస మహా శూల కూట ముద్గర ధారిణీః           5.17.9
వరాహ మృగ శార్దూల మహిషా౭జ౭శివా ముఖీః
గజో ష్ట్ర హయ పాదా శ్చ నిఖాత శిరసో౭పరాః               5.17.10
 

ఏక హస్తైక పాదా శ్చ ఖర కర్ణ్య౭శ్వ కర్ణికాః
గోకర్ణీ ర్హస్తి కర్ణీ శ్చ హరి కర్ణీ స్తథా౭పరాః               5.17.11
 

అనాసా అతి నాసా శ్చ తిర్య ఙ్నాసా వినాసికాః
గజ సన్నిభ నాసా శ్చ లలాటో చ్ఛ్వాస నాసికాః            5.17.12
 

హస్తి పాదా మహా పాదా గో పాదాః పాద చూళికాః
అతిమాత్ర శిరో గ్రీవా అతిమాత్ర కుచోదరీః                   5.17.13
 

అతిమాత్రా౭౭స్య నేత్రా శ్చ దీర్ఘ జిహ్వా నఖా స్తథా
అజా ముఖీ ర్హస్తి ముఖీ ర్గో ముఖీః సూకరీ ముఖీః       5.17.14
 

హయో ష్ట్ర ఖర వక్త్రా శ్చ రాక్షసీ ర్ఘోర దర్శనాః
శూల ముద్గర హస్తా శ్చ క్రోధనాః కలహ ప్రియాః       5.17.15
 

కరాళా ధూమ్ర కేశీ శ్చ రాక్షసీ ర్వికృతా౭౭ననాః
పిబన్తీ స్సతతం పానం సదా మాంస సురా ప్రియాః  5.17.16
 

మాంస శోణిత దిగ్ధా౭౦గీ ర్మాంస శోణిత భోజనాః
తా దదర్శ కపి శ్రేష్ఠో రోమ హర్షణ దర్శనాః              5.17.17
 

ఈ విధముగా హనుమ సీతను గుర్తించుటలో రాత్రి గడచి వేకువ జాముఅయ్యెను. ఈమె దుఃఖమును తొలగించుటకు ఏమి చేయవలెనని ఆలోచింప సాగెను. అజ్ఞానము ఆవరించి సద్వస్తువగు ఆత్మ కనబడకుండా చేయు జన్మయే రాత్రి.
శ్రీరామ జయరామ జయజయ రామ
 

--((***))--

Sunday 29 December 2019

సుందర కాండము-7



[6:06 AM, 12/29/2019] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-7
రావణ అంతఃపురమున హనుమ ప్రవేశించుట
హనుమ లంకానగరములో అనేకమైన భవనములను, పతివ్రతలగు స్త్రీలు వారి భర్తలతో నిదురించుటను, ప్రియురాండ్రపై తమ హస్తములు వేసిన స్త్రీలను, అనేకమైన పరిశుద్ధ స్వభావులు, మహానుభావలు, సుప్రభావలు, కాంతిమతులు, లజ్జావతులు, ప్రియుల ఒడిలో కూర్చున్నవారు, బంగారు కాంతుల గలవారు, మేలిముసుగు లేనివారు ఇలా అనేకమైన స్త్రీలను చూచెను. తరువాత రావణ అంతఃపురములోను వారి మంత్రుల భవనములలోను సీతకై వెదికెను. కానీ ఎచ్చటను కానరాలేదు. ఇంతకు మునుపు తాను సీతను చూడలేదు కావున, హనుమ తన మనస్సున సీతాదేవి యొక్క ఊహాచిత్రమును నిర్మించుకొనెను. వాస్తవముగా పదునారు కళలతో గూడి చంద్రుని వలె భాసిల్లు సీతాదేవి, శ్రీరాముని ఎడబాటు వలన విదియ చంద్రుని వలె కాంతిహీనమై, ధూళిధూసరితమై, రావణుని వాగ్భాణముల గుర్తులు ఆమె ముఖ కవళికపై యుండును. అట్టి జానకిని ఎంత వెదికినను తరుణీమణులలో కానరాకుండెను. పిమ్మట హనుమ మేఘము వలె మహోన్నతమైన పుష్పక విమానమును దర్శించెను.
 
తత స్తదా బహు విధ భావితా౭౭త్మనః
కృతా౭౭త్మనో జనక సుతాం సువర్త్మనః
అపశ్యతో౭భవ ద౭తి దుఃఖితం మనః
సుచక్షుషః ప్రవిచరతో మహాత్మనః  5 7 17
 
ఈ విధముగా అనేకవిధములుగా నిశిత బుద్ధితో ప్రయత్నమూ చేసినను సీత జాడ కాన రాకపోయేసరికి హనుమ మిగుల దుఃఖితుడు అయ్యెను. తరువాత నెమ్మదిగా రావణుని నిజ అంతఃపురమును చేరుకొన్నాడు. అందు రావణుడు అపహరించి తెచ్చిన కన్యలు, రావణుని పత్నులు, పానముచే అలసి యున్న స్త్రీ రత్నములు ఇలా అనేక మంది కనబడిరి. వారి మధ్య రావణుడు నక్షత్ర రాజు వలె యున్నాడు.
 

గౌరీం కనక వర్ణా౭౭భామ్ ఇష్టామ్ అన్తః పురేశ్వరీమ్
కపి ర్మన్దోదరీం తత్ర శయానాం చారు రూపిణీమ్  5.10.52
 
స తాం దృష్ట్వా మహాబాహు ర్భూషితాం మారుతా౭౭త్మజః
తర్కయా మాస సీతేతి రూప యౌవన సంపదా  5.10.53
 
హర్షేణ మహతా యుక్తో ననన్ద హరియూథపః
*ఆస్హ్పోటయా మాస చుచుమ్బ పుచ్ఛం
ననన్ద చిక్రీడ జగౌ జగామ*
 
స్తమ్భాన్ అరోహన్ నిపపాత భూమౌ
నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనామ్   5.10.54
 
అక్కడ శయ్యపై పరుండి బంగారు రంగును పోలిన స్త్రీ మూర్తిని (రావణుని పట్ట మహిషి అయిన మండోదరి) చూసి హనుమ సీతమ్మ అనుకొని భ్రమపడి కోతి చేష్టలు చేసెను. ఆనందముతో హనుమ జబ్బలు, తొడలు చరచుకొనెను. తోక ముద్దుపెట్టుకొనెను. పాటలు పాడెను. నృత్యము చేసెను. స్తంభములెక్కి దుమికెను. ఈ విధముగా సంతోషముతో పిల్లవాని చేష్టలు చేసెను. తరువాత బుద్ధిశాలియైన ఆ మహాకపి భర్తని ఎడబాసిన సీత ఇలా సర్వాలంకారణ భూషితయై నిదురించదు, ఈమె సీత కాదని వేరొక వనితయని  అని నిశ్చయమునకు వచ్చియుండెను. ఈ విధముగా అనేక మంది స్త్రీలను చూచినను సీత జాడ లేదు. ఈ విధముగా అనేకమైన భంగిమలలో స్త్రీలను చూచుటచే ధర్మ భంగమయ్యెనని ఒకింత చింతించెను. మరల తేరుకొని  …
 
మనో హి హేతుః సర్వేషామ్ ఇన్ద్రియాణాం ప్రవర్తనే
శుభా౭శుభా స్వ౭వస్థాసు తచ్చ మే సువ్యవస్థితమ్        5.11.41
 
మనస్సే కదా సర్వేంద్రియములను ప్రవర్తింపజేయుటలో కారణమైనది. కానీ నా మనస్సు నిలకడగా, ఎటువంటి వికారములు లోనుకాకుండా యున్నది. అయినను స్త్రీని వెతుకుటకు స్త్రీ సమూహములోనే వెతకాలి కదా! అనుకోని తాను ధర్మ భ్రష్టుడు కాలేదు అనుకొనెను. మరల ధైర్యము తెచ్చుకొని అనేకమైన లతాగృహములు మొదలుగాఁగలవి వెతుకుచుండెను.

అనిర్వేదః శ్రియో మూలమ్ అనిర్వేదః పరం సుఖమ్
అనిర్వేదో హి సతతం సర్వా౭ర్థేషు ప్రవర్తకః                5.11.10
 
కరోతి సఫలం జంతో:కర్మ య త్తత్ కరోతి సః
తస్మాత్ అనిర్వేద కృతం యత్నం  చేష్టే౭హ ముత్తమం 5.11.11
 
సర్వ విధముల అభివృద్ధికి నిర్వేదము లేకుండుటయే. ఉత్సాహము కలిగియుండుట ఐశ్వర్యమునకు మూలము. ఉత్సాహమే ఉత్తమ సుఖము. నిరుత్సాహవంతుడు కానివాడే అన్నిపనులను ఆరంభింపగలడు. కావున ఉత్సాహముతో మరల ఏయే ప్రదేశములలో శ్రద్ధ చూపలేదో ఆయా ప్రదేశములలో వెతుకుటకు హనుమ నిశ్చయించుకొనెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

Friday 27 December 2019

సుందర కాండము-6 ***








శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-6
లంకలో హనుమ ప్రవేశము
 
సముద్ర లంఘనమున హనుమ చేసిన దుష్కర కార్యములు నాలుగు. అవి - నూరు యోజనముల సముద్రమును దాటి సీత జాడ కనుక్కొని వెనకకు రాగలనని సంకల్పించుకొనుట, మైనాకుని సగౌరవ విశ్రాంతిని సున్నితముగా తిరస్కరించుట, సురసను జయించుట మరియు సింహికను చంపుట. ఈ నాలుగు నాలుగు లక్షణములు. 1 ధృతి: సర్వ వ్యాపారములను ఆత్మోన్ముఖం చేయుట, 2 దృష్టి: దేనిని పొందవలెనో దాని యందే దృష్టి తప్ప ఇతరములపై ఉండకుండుట. 3 మతి: ఆచరించ వలసిన కర్మలను ఆచరించుతూ బంధనమున పడకుండా "ఆత్మస్వరూప జ్ఞానము" ఉండుట. 4 దాక్ష్యము: నిషిద్ధకర్మ త్యాగము. ఇట్లు హనుమ ఈ నాలుగు లక్షణములతో సముద్రమును లంఘించినట్లే ఆధ్యాత్మిక మార్గములో పయనించువారు ముందుకు సాగుటకు ఈ నాలుగు ఆవశ్యకములు అని ఈ వృత్తాంతము సూచించును.
 
సూర్యాస్తమయ సమయమునకు, హనుమ నూరు యోజనముల సముద్రమును దాటి త్రికూట పర్వత శిఖరమున నిలిచి లంకను చూచెను. పరాక్రమశాలి అయిన హనుమ ఇటువంటి నూరు యోజనములు ఎన్నియైనను అవలీలగా దాటగలను అని హనుమ భావించెను. సాధన చేయువానికి ఇట్టి స్థితి ఆవశ్యకముగా నుండవలెను. ఆసనము పైనుండి ప్రాణాయామాదులు చేసి లేచిన తర్వాత శరీరము కానీ, మనస్సు కానీ బడలిక చెందరాదు. ఇంకను ఎంతకాలము చేసినను చేయగలనన్నట్లు ఉత్సాహము ఉండవలెను. ఇది కలుగు వరకు సాధన పూర్తి కాదు. అచ్చటి నుండి లంకా నగర శోభను, అచ్చటి రక్షణ వ్యవస్థను నిశితంగా పరికించి లంకా నగరమును జయించుటలోని పెక్కు ఉపాయములు ఆలోచించెను. ముందుగా సీతమ్మకై అన్వేషణ చేయవలెనని, అందుకు రాత్రి సమయమే సరియైనదని, అందుకు సూక్ష్మ రూపమున లంక నగరములో ప్రవేశించ వలెనని నిర్ణయించు కొనెను. నెమ్మదిగా లంకానగర ద్వారము వద్దకు వచ్చెను. అప్పుడు హనుమను కామరూపిణియగు లంక అడ్డగించెను. హనుమ లంకతో నీవెవ్వరివి అని అడగగా ..

అహం రాక్షస రాజస్య రావణస్య మహాత్మనః
ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్షా రక్షామి నగరీ మిమాం        5.3.28
 
అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ
సర్వతః పరిరక్షామి హ్యేత త్తే కథితం మయా   5.3.30
 
రాక్షస రాజైన రావణుని ఆజ్ఞను పాలించుతూ నేను ఈ లంకా నగరమును కాపాడు చున్నాను. నన్ను ధిక్కరించి ఇందు ప్రవేశించలేవు అనెను. అందుకు సౌమ్యముగా హనుమ, లంకతో .. "లంకానగర శోభను పరికించి వెడలెదను" అనెను. కానీ లంక తనను జయించనిదే నగరములో ప్రవేశించుట అసాధ్యము అని చెప్పుటతో హనుమ ఆడుది కదా యని ఎక్కువగా కోపము తెచ్చుకొనకుండా కొద్దిపాటి కోపముతో పిడికిలితో గద్దెను. దానికే నిశాచర, హనుమతో "నన్ను అనుగ్రహింపుము. నీచే ఓడింపబడితిని గాన బ్రహ్మ వర ప్రభావము వలన రాక్షసులకు కీడు కల్గు సమయము ఆసన్నమైనది. హాయిగా సీతమ్మను వెతుకు కొనుము" అని చెప్పెను. ఇక్కడ వాల్మీకి "అహం" అని రెండుమార్లు ప్రయోగము చేసినారు. ఈ 'అహం' దేహాత్మాభిమానాన్ని, అహంకారమును సూచించును. ఇట్టి అహంకారమును జయించిన నాడే  మనసులోని వాసనలు, చిత్తవృత్తులు నసించి సీతమ్మ దర్శనమగును. హనుమ లంకను జయించి ద్వారము గుండా కాకుండా ప్రాకారమును దాటి శత్రువుల తలపై మోపినట్లు తన ఎడమ పాదమును హనుమ ముందుగా పెట్టి  లోనికేగెను. (అద్వారేణ మహాబాహుః ప్రాకార మ౭భిపుప్లువే)   (గ్రామం వా నగరం వాపి, పత్తనం  వా పరస్య హి| విశేషాత్ సమయే సౌమ్య| న ద్వారేణ విశేనృప|| ప్రయాణ కాలే చ గృహప్రవేశే, వివాహ కాలే౮ పి చ దక్షిణాంఘ్రిమ్| కృత్వాగ్రతః శత్రుపుర ప్రవేశే, వామంనిదద్యా చ్చరణం నృపాలా|| ఓ రాజా! శత్రువు యొక్క గ్రామమును గాని, నగరమునుగాని, పట్టణమును గాని విశేష సమయమున ముఖ్య ద్వారము నుండి ప్రవేసింపరాదు, ప్రయాణము చేయుచున్నప్పుడు, గృహప్రవేశ సమయమున, వివాహ కాలము నందు కుడికాలు ముందుంచాలి. శత్రుపురమున ప్రవేశించునప్పుడు ముందుగా ఎడమ కాలు మోప వలెను. ఇది బృహస్పతి వచనము. ... నీతి శాస్త్రము.)
శ్రీరామ జయరామ జయజయ రామ
చక్కని మెసేజ్.
అమ్మ అనే పిలుపులో ఆప్యాయత ఉంది.
నాన్న అనే పిలుపులో నమ్మకం ఉంది.
తాత అనే పిలుపులో తన్మయత్వం ఉంది.
అమ్మమ్మ అనే పిలుపులు అభిమానం ఉంది.
నానమ్మ అనే పిలుపులో నవ్వు ముఖం ఉంది.
అత్త అనే పిలుపులో ఆదరణ ఉంది.
మామ అనే పిలుపులో మమకారం ఉంది.
బాబాయ్ అనే పిలుపులో బంధుత్వం ఉంది.
చిన్నమ్మ అనే పిలుపులో చనువు ఉంది.
అన్నా అనే పిలుపులో అభయం ఉంది.
చెల్లి అనే పిలుపులో చేయూత ఉంది.
తమ్ముడు అనే పిలుపులో తీయదనం ఉంది.
అక్క అనే పిలుపులో అనురాగం ఉంది.
బావా అనే పిలుపులో బాంధవ్యం ఉంది.
వదినా అనే పిలుపులో ఓర్పు ఉంది.
మరదలు అనే పిలుపులో మర్యాద ఉంది.
మరిది అనే పిలుపులో మానవత్వం ఉంది.
గురువు అనే పిలుపులో గౌరవం ఉంది.

మిత్రులారా!
నేడు మనం కట్టే బట్ట, చదివే చదువు, తినే తిండి అన్ని పరాయి పోకడలను అనుసరిస్తున్నాయి.

  • కనీసం పిలుపులో నయినా  మన అచ్చ తెలుగులో పిలుచుకుందాం బంధాలను నిలబెట్టుకుందాం.....!


 🕉🕉🕉🕉🕉🕉


🌸 *పరమాత్మ ను చేరే సులభ మార్గాలు.* 🌸

పరమాత్మ సకల జీవరాసులలో అంతర్యామి గా కొలువైఉన్మాడు అన్నది శాశ్వత సత్యం. అది మనకి ఎరుక లేకపోతే అది మన అజ్ఞానం. ఆ పరమాత్మ ని చేరాలంటే నాలుగు విషయాలలో ఎరుక తో ఉండి మనము ఆచరించాలి.

*అవి*:

🌷 *1) సంతోషం:-*

మనతో ఉన్నత స్థితిలో ఉన్నవారి పట్ల మనం ఈర్ష అసూయలతో ఉంటాం, కానీ మనము సంతోషం తో ఉండాలి అటువంటి సందర్భంలో.

🌷 *2) కరుణ:*

మన చుట్టూ ఉన్నవారు కష్టాలతో ఉంటే మనకి చెప్పారాని ఆనందము. కానీ ఇలాంటి సందర్భములొ కావాల్సింది కరుణ.

🌷 *3) స్నేహము:*

మనతో సమానముగా ఉన్నవారి పట్ల మనకు పోటీ తత్వం ఉంటుంది. కానీ దీని బదులు స్నేహం ఉండాలి. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం.

🌷 *4) ఉపేక్ష:*

మన చూట్టూ ఉన్నవారు పాపాలు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నవారు అయితే మనము వారి వెంటపడి వారిని మార్చే ప్రయత్నం లో నిరంతర జ్ఞాన బోధ చేస్తాం. కానీ పాపం వారు వినిపించుకునే దశలో ఉండరు. కానీ ఇలాంటి వారి పట్ల మనకి కావాల్సినది ఉపేక్ష. ఎందుకంటే సమయమే వారిలో మార్పు తెస్తుంది. మన ఇతిహాసాలు ఈ సత్యం నే చెప్తాయి.

చూశారా
సంతోషము, స్నేహము, కరుణ, ఉపేక్ష అన్నవి నిజముగా పరమాత్మ దగ్గరకు మనని చేరుస్తాయి.

బుద్ధ జయంతి సందర్భంగా ఆ మహానుబావుడి భోదల నుంచి గ్రహించి వ్రాసినది.

🙏🏻🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻


🕉🕉🕉🕉🕉🕉

--(())--
నేనుమొన్న
 పెట్టిన పోస్ట్ కి చి"రాధ కృష్ణ శాస్త్రీ సేకరించిన 15రాగాలపేర్లు గమనించగలరు.చి"రాధాకృష్ణ శాస్త్రీకి ఆశీస్సులు అభినందనలు ఇంత చిన్నవయసులోనే సంగీతంమీదున్న ఆసక్తి ఎంతైన ప్రశంసనీయం

అంబాపారాకు     నాటరాగం
అవతరించువయ్య  శ్రీ రాగం
రావోరావో       ...   కాంభోజి
చెలువారు          అఠాణ
తగదిదితగదిది   వసంత
ఈశునిదాసుగా  రీతి గౌళ
కానిపనిమదనా  బేగడ
చిలుకటటడి      సరస్వతి
సామగ సామగ  హిందోళ
ఇంతర్ లూడు  హంసధ్వని
విరులనియపూజ  సావేరి
అం బాయని          సామ
మనమే                  సామ
బిడియపడి   మధ్యమావతి
మంగళం          సురటి
-
-(())--
*మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాసేస్తాడు కాదా,*
*మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది.*

అయితే బ్రహ్మ నుదుటిని రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాసాడంట.
నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను.
మీరు మీ ఉపాసనలతోటి, మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాసారంట.
అర్చనలు, ఉపాసనలు కర్మఖాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడతున్నాను అని తెలిపారు.

ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్ళు ఆయువు రాస్తే, ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆవ్యక్తి ఆయువు తగ్గుతుంది.

ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూర్చుకునే శక్తి కూడా మనకి కర్మఖాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు.
పురాణాలు శ్రద్దగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది.

పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు,
ఇతనికి 50 వ ఏట మరణ గండం ఉంది. ఆ మరణ గండాన్ని ఎవ్వరు తప్పించలేరని రాసాడు బ్రహ్మ.

అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి, గురువు చెప్పినట్టు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసినవాడు బ్రతికాడు.

జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి  జాతక రీత్యా వీడు చచ్చిపోవాలండి, కాని బ్రతికాడని అనుకుంటే…
అప్పుడు వశిష్ట మహర్షి ఇలా అన్నాడు…

 ఇతనికి జాతక రీత్యా చావు ఉన్నప్పటికి గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయట పడ్డాడని చెప్పాడు.

కాబట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చడు గాని, మనం ఇలా పురాణాలను శ్రద్దగా వినడం, మంత్రాలను చదవడం, ప్రదక్షణలు చేయడం వలన చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది.

ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండిటిని స్మరించాలి.
అమ్మ పాదాలను స్మరించడం వలన బ్రహ్మ వంటి దేవతలను మనకు సేవకులను చేస్తుంది.

128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు, ద్రౌపతిని జుట్టుపట్టి దుశ్యాసునితో ఈడ్పించడం వలన చేసిన పాపానికి 60 వ ఏట చనిపోయాడు.

కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ, బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు.
అదే పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతికినవాళ్ళు ఉన్నారు.

*అందుకని ఏ కష్టం వచ్చిన బ్రహ్మ నాకు ఇలా రాసాడు అని కృంగిపోకుండా… ఆ రాతను మార్చుకోవడానికి పూజలు, దానాలు, ధర్మాలు, పేదలకు సహాయం చెయ్యండి.*

ఈ విషయం అందరికి తెలియజేసి కొంత మీరు కూడా పుణ్యం మూట కట్టుకోండి.

Thursday 26 December 2019

సుందర కాండము-5



శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-5
సింహిక
 గరుడ వేగముతో హనుమ ఆకాశము నందు సాగు చుండగా ఎదురుగాలి చే మందగించిన ఓడ వలె హనుమ వేగము తగ్గెను
ప్లవమానం తు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసీ
మనసా చిన్తయా మాస ప్రవృద్ధా కామ రూపిణీ 5.1.173
అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యా మ్య౭హమ్ ఆశితా
ఇదం హి మే మహత్ సత్త్వం చిరస్య వశమ్ ఆగతమ్      5.1.174
కామరూపియైన సింహిక నామ రాక్షసి ఆకాశమున పోవుచున్న హనుమను చూచి "ఆహా! చాలా కాలమునకు నాకు ఒక మహా జంతువు ఆహారముగా దొరకబోవుతున్నది" అని ఆలోచించి, హనుమ ఛాయను బట్టి హనుమను తన నోటిలోనికి ,లాగుకొనుచుండెను.  క్రిందికి చూడగా సముద్రములో హనుమ ఒక మహాభూతమును చూచెను.  సుగ్రీవుడు సముద్రములో నీడను బట్టి లాగెడి ఒక మహారాక్షసి గలదు అని చెప్పిన మాట జ్ఞప్తికి వచ్చి హనుమ శరీరమును ఒక్కసారిగా పెంచెను. కానీ అందుకు తగిన పరిమాణంలో సింహికారాక్షసి గూడ పాతాళ కుహూరమును బ్రోలు తన నోరును పెంచెను. వెంటనే హనుమ తన శరీరమును సంకోచింప చేసి, దాని నోటిలో దూరి తన గోళ్ళతో దాని మర్మములను త్రుంచి మరల అంతరిక్షము చేరెను. హనుమ చేసిన ఈ కార్యమునకు సంతోషించి ఆకాశములోని  భూతములన్నియు బాగు, బాగు అనెను.
ఆధ్యాత్మిక మార్గములో పయనించువాడు విహిత కర్మలను ఆచరించవలెను. నిషిద్ధ కర్మలను పరిత్యజించి వలెను. శాస్త్రములో చెప్పని కర్మలను ఆచరించిన యడల అవి మనలను హింసించును. కావున అవి "సింహిక" అనబడును. సింహిక అనగా హింసించునది. నిషిద్ధ కర్మకు మనమెట్లు వశమగుదమో మనకే తెలియదు. చేయకూడదని తెలిసియు, చేయవలదను కొనుచునే దానికి వశమగుదుము. (ప్రస్తుత కాలములో మద్యపానము, ధూమపానం,  జూదము ఇత్యాది). వశమైన తర్వాత గాని వశపడినట్లు తెలియదు. అట్టి కర్మలు తెలియకుండా ఆక్రమించుట - సింహిక నీడను బట్టి లాగుట. అందుకనే సురసను చంపకుండా వదిలిన హనుమ సింహికను చంపెను.
హనుమానునిపై పడు సూర్యకిరణముల వలన తన నీడయే క్రిందనున్న సాగరముపై వ్యాపించెను. ఈ వర్ణన ద్వారా వాల్మీకి యోగ మార్గములో ప్రాప్తించే ఒక ఛాయా సిద్ధిని మనకందించెను. ఉపనిషత్తులలో ఈ ఛాయా పురుషుడు అంగుష్ఠ మాత్ర పురుషుడుగా వర్ణింపబడినాడు. ఈ అంగుష్ఠమాత్ర పురుషుడు ఎంతో బలవానుడు మరియు త్రికాలదర్శి. "కఠోర ఉపనిషత్" లో "ఈశాన" అని తెల్పినారు.
శ్లో|| అంగుష్ఠమాత్ర పురుషో జ్యోతి రివా  ధూమకః|
      ఈశానో భూత భవ్యస్య స ఎవాద్యసఉశ్వః||
ఈ ఛాయాపురుషుడు చాతుర్మాత్రాత్మక జగత్తున కతీతుడై, త్రికాలజ్ఞుడై, త్రిలోకగామియై యుండును.
శ్లో|| మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం|
      వాతాత్మజం వానర యూధ ముఖ్యం, శ్రీరామదూతం శరణం ప్రపధ్యే||
మారుతమనగా దేశకాలములకు అతీతము. కాలమునకు అతీతమగుట వలన ఛాయాపురుషుడు ఇతరులకు కనిపించడు. తాను ఏ వస్తువును తాకినను, ఆ వస్తువు కూడా అదృశ్యమగును. ఎవరైతే ఈ ఛాయాపురుషుని ఉపయోగము నీచకార్యములకు వినియోగింతురో అతడు తన అధఃపతనమును కొని తెచ్చుకొనును. సాధనలో ఛాయాపురుష అవస్థ చాలా ఉత్కృష్టమైనది. అధఃపతనము చెందిన సింహికా రాక్షసి అవస్థయే వేదమున ఈ విధముగా వర్ణింపబడినది.
య ఈ చకార్న సౌ అస్య వేదయ ఇద దర్శహిరుగిన్ను తస్మాత్,
సమాధుర్యోమ్ నా పరివీతో అంతర్బహు ప్రజా నిరుతిమా వివేశః  (ఋ.వే.1 164 32 )
అజ్ఞానముతో నున్న జీవి మాతృగర్భము ద్వారా అనేక జన్మలను ధారణ చేయును. జన్మలకు అతీతమైనను, సర్వజ్ఞమైనను, ఘోర కర్మలో పడి తానేమి చూచుచున్నదో ఏమి చేయుచున్నదో తెలియని అజ్ఞాన స్థితిలో యుండును.
దేహము నాలుగు రకాలు. మొదటిది - ఎముకలు, మాంసము, మజ్జ, రక్తముతో కూడుకొన్న "జడ దేహము". సుషుప్తావస్తలో సూక్ష్మ శరీరములో ఉండునది - "లింగ దేహము". ఇదియే ఛాయాపురుషుడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలములకు, దేశకాలములకు  అతీతము. తన యొక్క ఛాయవలె కనిపించే ఈ లింగ దేహము/శరీరము ను బంధనమున ఉంచి దాని ద్వారా సిద్ధులకు ఉపయోగించు సాధకుడు పతనము నొందును.   హనుమాన రూప సాధకుడు ఇట్టి బంధనమున చిక్కుకొనడు. మూడవది లింగ దేహము కన్నను ఉన్నతమైనది  - "కారణ దేహము". సంకల్ప మాత్రముననే కార్యము నెరవేరును. అంతకంటెను సూక్ష్మమైనది "మహాకారణ దేహము". ఈ సంసారమునకు కారణ బీజమైనది. యోగ వాసిష్ఠములో ఇట్టి అతివాహిక సూక్ష్మ దేహముతో లీల (సరస్వతి దేవి   భక్తురాలు), సరస్వతులు ఇద్దరు సమస్త బ్రహ్మాండములు తిరిగారని వసిష్ఠ మహర్షి చెపుతారు. సరియైన ఆధ్యాత్మిక మార్గములో పయనించువారు హనుమ వలె ఛాయాపురుషునకు అతీతముగా యుందురు.
శ్రీరామ జయరామ జయజయ రామ

9)మll
మనుజగ్రామణి సత్కృపాత్త కపిసామ్రాజ్య స్థితుండయ్యుభూ,
తనయాన్వేషణ కార్యమున్‌ మఱచి కందర్పక్రియామత్తుఁడై,
తనివిం జెందక యున్న భానుజునిఁ దత్కాలార్హ నీత్యుక్తయు,
క్తిని బోధించిన నీతిశాలివి నినుం గీర్తించెదన్‌ మారుతీ!

తాత్పర్యం:- ఈ పద్యంలో మనుజ గ్రామణి అంటే ప్రజలకు రాజు =శ్రీరాముడు, భానుజుడు అంటే సూర్యుని కుమారు డు =సుగ్రీవుడు. సత్కృప + ఆత్త, సాంమ్రాజ్యము= గొప్ప దయచేత పొందబడిన సాంమ్రాజ్యము. కందర్ప క్రియా మత్తుడు = రతిక్రీడలో మదించి ప్రవర్తించు వాడు.
శ్రీరాముని యొక్క గొప్ప దయతో లభించిన(కిష్కింధా) రాజ్య పరిపాలకుడైన సుగ్రీవుడు, (ఈ వర్షాకాలం నాలుగు నెలలు గడచిన తర్వాత లోలాంగూలభల్లూక కపి సైన్యంతో) సీతాన్వేషణ జరిపిస్తానని (శ్రీరామునికి)ఇచ్చిన మాట మరచి; తార, రుమ మొదలైన భార్యలతో రతిక్రీడలలో
మునిగిపోయి మదించి తృప్తిచెందక ప్రవర్తిస్తున్న సందర్భం లో ( శ్రీరామునిచే పంపబడిన లక్ష్మణుడు అగ్రహోదగ్రుడై సుగ్రీవుని హెచ్చరించుటకు వచ్చిన సందర్భంలో) నీవు
యుక్తియుక్తముగా, మిత్రధర్మాన్ని అనుసరించాలనే విషయాన్ని సుగ్రీవునికి బోధించన నీతిశాలివి. అట్టి నిన్ను స్తుతించుచున్నాను స్వామీ!

10)
శాll లేరా కీశులనేకులుం? ద్రిజగముల్‌ వీక్షించి రా నేర్పరుల్‌
గారా? రాముఁడు జానకిన్‌ వెదక వీఁకన్‌ గీశులం బంపుచో
నారూఢిన్‌ భవదీయ దివ్యమహిమవ్యాపారముల్‌ సూచికా
దా!రత్నాంగుళి భూషణం బిడియె నీ హస్తంబునన్‌ మారుతీ!

తాత్పర్యం:- కీశులు= కోతులు, వీకన్= పరాక్రమము గల, ఆరూఢిన్= నిశ్చయముగా, భవదీయ= నీయొక్క , రత్నాంగుళి =రత్మములచే పొదగబడిన ఉంగరం, భూషణం= ఆభరణం.
సుగ్రీవునిచే సీతాన్వేషణకు నియోగింపబడిన వాన రులు ఎంతమంది లేరు?. వారిలో అప్పటికే ముల్లోకాలను తిరిగి చూసిన వారెందరో వున్నారు కదా, అట్టివారు నేర్పరులూ, అనుభవ శాలురూ గారా? అటువంటప్పుడు ఓ మారుతీ! శ్రీరామచంద్రుడు ప్రత్యేకించి పిలిచి నీ చేతికి
తన రత్నాంగుళీయకం ఇచ్చి, సీతాదేవి కనిపించినప్పుడు ఆమెకు ఇవ్వమని చెప్పినాడంటే ( సీతాస్వేషణలో సఫల త నివ్వగల) నీయొక్క దివ్య శక్తిసామర్ధ్యాలను గమనించి యేకదా!
ఇంకావున్నాయి.,

11) మ. వనజాప్త ప్రియపుత్రుఁడెంతధిషణావంతుఁడొ,
సర్వంసహా,తనయాన్వేషణ మాచరింప గపులం దా
బంపుచో, గార్యసా,ధనమందీ వతి దక్షిణుండవని
కాదా! నేర్పుతో దక్షిణంబునకున్‌ నిన్నధికారిఁ జేసి
పనిచెన్‌ మోదంబునన్‌ మారుతీ!

తాత్పర్యం:- వనజాప్తప్రియపుత్రుడు= తామరలకు ఆప్తు డైన వాని (సూర్యుని) కి ఇష్టుడైన కుమారుడు అనగా సుగ్రీవుడు. ధిషణావంతుడు= మేధావంతుడు. సర్వసహా
తనయా= భూదేవి పుత్రిక అంటే సీతాదేవి. కార్యసాధనమందు+ ఈవు+ అతి దక్షిణుండవు= పనులు చేయుట యందు నీవు మిక్కిలి సామర్థ్యము గలవాడు. పనిచెన్= పంపెను.
ఓ మారుతీ ! వానరరాజైన సుగ్రీవుడు ఎంతటి మేధా శక్తి గలవాడో కదా,కనుకనే సీతాన్వేషణ చేయుటకు కోట్ల కొలది వానరులను తాను నలుదిక్కులకు పంపినసందర్భం
లో , నీవు కార్యసాధన చేయుటలో మిక్కిలి సామర్థ్యం గల వాడివని అప్పటికే తెలిసివున్నందునే కదా సంతోషముతో నిన్ను దక్షిణ దిక్కునకు పంపిన కపిసేనలో ప్రముఖునిగా నియోగించినాడు , స్వామీ!

12)శా.సీతన్‌ గానక,దప్పిచే బడలి గాసింజెందు శైలాటసం,
ఘాతంబుం గొని, శైలగహ్వర సుధాకల్పాంబువుల్‌,సత్ఫల,
వ్రాతంబుం దనివార నందఱ భుజింపంజేసి, తద్దేవతా,
ఖాతశ్వభ్రము వెల్వరించితివి యోగప్రౌఢిచే మారుతీ!

తాత్పర్యం:-గాసించెంది= అలసిపోయి. శైలాట + సంఘాత ము= కోతుల గుంపు. శైల గహ్వరము= పర్వతగుహ. సుధాకల్పాంబువుల్= అమృత ప్రాయమైన జలము.
సత్ఫల వ్రాతము= మంచి రుచిగల పండ్ల సమూహము. తనివార= తృప్తిగా. దేవత+అఖాత+శ్వభ్రము= దేవతచే ( అనగా మయునిచే) నిర్మింపబడిన బిలము. వెల్వరించు
= బయటకు తీసుకొని వచ్చు. యోగప్రౌఢి= యోగశక్తి. ఈ పద్యం చదువుతూవుంటే శ్రీవాల్మీకి రామాయణం, కిష్కింధా కాండ 50,51,52,53 సర్గలలో చెప్పబడిన స్వయంప్రభ కథ గుర్తుకొస్తుంది. అంగదుని నాయకత్వంలో దక్షిణదిక్కుగా సీతాన్వేషణ సాగిస్తున్న వానరసేన, ఒక దశలో అలసిసొలసి ఆకలిదప్పికలకు లోనై కనీసం నీళ్ళై నా తాగందే బతకలేమని నీళ్ళకొరకు వెతుకుతారు. ఒక బిలం నుండి తడిసిన రెక్కలతో ఎగురుతూ వస్తున్న పక్షుల
ను చూసి, ఆ బిలంలో నీళ్ళు వుంటాయని తలంచి వాన రులు అందులో ప్రవేశిస్తారు. అంతా చీకటి, ఒకళ్ళచేతులు మరొకళ్ళు పట్టుకొని ఆ వానరులంతా బిలంలో చాలా దూరం నడిస్తే వాళ్ళకొక రత్నఖచిత భవనం కనిపిస్తుంది. అది మయుడు, అప్సరస అయిన హేమ కొరకు నిర్మించిన భవనం. హేమ అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది. ఆమె చెలికత్తె స్వయంప్రభ మాత్రం ఆ భవాన్ని సంరక్షిస్తూ ఎప్పు డూ అక్కడే తపస్సు చేసుకుంటూ వుంటుంది. వానరులు
ఆమెతో సీతాన్వేషణకు దారితీసిన కథంతా చెప్పారు. ఆమె మథుర ఫలాలతో , స్వచ్ఛజలాలతో ఇచ్చినఆతిథ్యం స్వీకరించి, ఆదమరచి నిద్రించారు. ఆ గుహ ఎటువంటి దంటే లోపలికి వచ్చిన వారిని వెలుపలకు పోనివ్వదు. సుగ్రీవుడిచ్చిన నెలగడువుముగిసిపోయింది. తమకుచావు తప్పదనుకున్నారు. వారిది రామకార్యం గనుక స్వయం ప్రభ దయదలచింది. "మీరంతా కళ్ళుమూసుకొంటే, తన యోగశక్తితో గహనుండి బయటపడవేస్తా" నన్నది. కళ్ళు
మూసి తెరిచేంతలో వానరులంతా బిలం బయట సముద్ర పు వొడ్డున పడివున్నారు.
ఓ మారుతీ! ఈ ఘట్టంలో ఆకలిదప్పులను లోనై ప్రాణా వశిష్టులైన వానరులకు పండ్లూనీళ్ళూ అందేలా చేసి, వృక్ష బిలంలో చిక్కుకొని పోయిన వారిని సురక్షితంగాబయటకు చేర్చుటలో నీవు చూపినప్రతిభాపాటవాలు,యౌగికశక్తులు అసాధారణమైనవి, అనితరసాధ్యమైనవి, స్వామీ!

13) మll.జనకక్ష్మాపతిపుత్రి యున్నవిధమున్‌ సర్వంబు
సంపాతిచే, విని, నీలాంగద ముఖ్యవా నరులు వేవే
గంబె ప్రాయోపవే, శనమున్‌ మాని భవత్సమేతులగు
చున్‌ సంప్రీతితో నా, మహేంద్ర నగారోహణ
మాచరించి రఁట విన్నాణంబుగా మారుతీ!

తాత్పర్యం:- జనకక్ష్మాపతిపుత్రి = జనకమహారాజు యొక్క కుమార్తె, వేవేగంబె = వెనువెంటనే, ప్రాయోపవేశనము= ఆమరణ నిరాహారదీక్ష, భవత్సమేతులగుచున్= నీతో గూడినవారై, నగారోహణం= పర్వతాన్ని ఎక్కటం, విన్నాణంబుగా= నేర్పుగా .గతపద్యంలో స్వయంప్రభ వృక్షబిలం నుండి బయట వేయబడిన వానరులందరూ దక్షిణ సముద్ర తీరంలో పడి లేచారు. సీతాన్వేషణకు సుగ్రీవుడు విధించిన నెలరోజుల గడువు తీరిపోయినది. తిరిగి వెళ్ళి సీతదేవి కనిపించలే దని చెబితే జరిగే అనర్థాలకు ఆస్కారం ఇవ్వడం కంటే, నిరాహారదీక్ష చేసి ఈ సముద్రపు వొడ్డున మరణించడం మేలనుకుంటూ, ఒక్కసారి వారిలో వారు అప్పటి వరకు
జరిగిన రామకథా సంఘటనలను గూర్చి మాట్టాడుకుం టారు. ఆ కథలో జటాయువు ప్రస్థావన, సీతాపహరణను అడ్డుకున్న ఆ జటాయవును రావణాసురుడు సంహరించటం, ఆ సముద్రానికి సమీపంలో వున్న కొండగుహలో నివసిస్తున్న సంపాతి అనే గృధ్రము (గద్ద పక్షి) వింటుంది.
వానరుల ద్వారా జరిగిన కథంతా అడిగి తెలుసుకుంటా డు. కొండమీద నుండి దక్షిణ దిశగా తేరిపారజూసి రావణా సురిచే అపహరించబడిన సీతాదేవి లంకలో అశోకవనంలో
రాక్షసస్త్రీల కాపలాలో వున్నట్లు చెబుతాడు. ఆవిషయం విన్న నీలుడు, అంగదుడు మొదలైన వానరవీరులందరూ, ఎవరైతే ఆమరణనిరాహారదీక్ష చేయ తలపెట్టినారో వారం
దరూ, వెనువెంటనే వారి ప్రయత్నాన్ని మానుకొని, ఓ ఆంజనేయా! నీ చుట్టూచేరి, నీతో కలిసి, ఆ సముద్రానికి దగ్గరిలో వున్న మహేంద్ర పర్వతాన్ని ఆనందోత్సాహాలతో అధిరోహించినారు కదా, స్వామీ!

14)మll శరధింగాంచి యలంఘనీయ మని తత్సంతారణా
దక్షులై, వరుసన్‌ గీశులు భీతిచేఁ గళవళింపన్‌ వారి
వారించి ని, న్నురుపాథోధి విలంఘన క్షమునిఁగా నూ
హించి ధీమంతుఁడా, పరమేష్ఠి ప్రియపుత్రుఁ డంచిత
గతిన్‌ బ్రార్థింపఁడే మారుతీ!

తాత్పర్యం:- శరధి= సముద్రం,అలంఘనీయం= దాటుటకు సాధ్యముకాని, తత్ + సంతారణ+అ దక్షులై= ఆ సముద్రా న్ని దాట చేతకానివారై, గళవళింపన్= కలతచెందగా, నిన్ను+ఉరు పాథోధి= నిన్ను గొప్పసముద్రం, విలఘన క్షమునిగా= బాగా దాటగలిగే సమర్థత గలవానిగా,
ధీమంతుడు= బుద్ధిమంతుడు, పరమేష్టి ప్రియపుత్రుడు= బ్రహ్మదేవుని కుమారుడైన జాంబవంతుడు, అంచిత గతిన్ = గౌరవనీయమైన పద్ధతిలో, ప్రార్థింపడే= ప్రార్థించినాడు కదా!
సముద్రం మధ్యలో వున్న లంకలో సీతాదేవి వున్నదని సంపాతి చెప్పటమైతే చెప్పాడు. అక్కడి చేరాలంటే నూరు యోజనాల దూరం సముద్రం లోనుండో పైనుండో ప్రయాణించాలి. వామ్మో.. ఇది మనకు సాధ్యమయ్యే పనిగాదు. వైనతేయ వంశస్థుడైన సంపాతి స్వయంగా తన కళ్ళతో
చూసి చెబుతున్నాను, " సీతమ్మ సమద్రం మధ్య నున్న రావణ లంకలో అశోకవనంలో రాక్షస స్త్రీల కాపలాలో బంధించబడివున్నది" అని చెప్పాడు గదా!. ఇటునుండి ఇటే వెనక్కు తిరిగి వెళ్ళి, ఇదే విషయం సుగ్రీవునితో, రామునితో చెబుదాం, అన్నారు కొందరు కపులు. జాంబ
వంతుడు అందుకు అంగీకరించ లేదు. మనల్ని సీతమ్మ ఎక్కడుందో వెతికి చూసి జాడ తెలిసికొని రమ్మన్నారు, అంటే దానర్థం ఎవరో చెప్పిన జాడను తెలుకొని వచ్చి
చెప్పమని కాదు. స్వయంగా మనకళ్ళతో మనల్ని చూసి; వీలైతే సీతమ్మతో మాట్లాడి; శ్రీరాముడు, సుగ్రీవుని సహా యంతో చేస్తున్న ప్రయత్నాల్ని సీతమ్మకువివరించి,సీతమ్మ
వున్న ప్రదేశానికి చేర్చే మార్గాన్ని తెలుసుకొని రమ్మని చెప్పి నట్లు. ఇలా, సముద్రాన్ని దాటి లంకకు చేర లేని చేతగాని వాళ్ళమైనామని దిగులుతో చింతాక్రాంతులైన కపిసేనకు
వివరించిన జాంబవంతుడు, కొద్దిదూరంలో నిర్వికారంగా కూర్చున్న, ఓ హనుమత్ ప్రభూ! నిన్ను సమీపించాడు. నీ శక్తి సామర్ధ్యాలను నీకు గుర్తుచేశాడు. నూరుయోజనాల
సముద్రాన్ని ఆకాశమార్గంలో అవలీలగా దాటగల దక్షుడ వు నీవే నని ప్రస్తుతించాడు గదా!

15) శాll
"ఏలా మీకు భయంబునేఁగలుగ,మీరిందుండుఁడేనొక్కఁడన్‌
వాలాయంబు పయోధి దాటి యనువొందన్‌లంకలోజానకిం
బోలం గన్గొని వత్తు, నిత్తు బరమామోదంబు మీ" కంచు ధై
ర్యాలాపంబులు వల్కి తేర్చితివి గాదా కీశులన్‌ మారుతీ!

తాత్పర్యం:-వాలాయంబు=తప్పనిసరి,పయోధి=సముద్రం, అనువొందన్= నేర్పుగా, పోలం = స్థానము, పరమామోదం బు= మిక్కిలి సంతోషం, ధైర్యాలాపంబులు= ధైర్య వచనాలు, తేర్చు= శాంతింపజేయు. తామున్న దక్షిణతీరంనుండినూరుయోజనాలదూరంలో సముద్రం మధ్యలోవున్న లంకను చేరటం తమవల్లకాదనివానరులందరూ ఆందోళన చెందుతున్న సందర్భంలో, జాంబవంతుడు,కాస్త దూరంలో మౌనంగా కూర్చొని వున్న ఆంజనేయస్వామివారి వద్దకు వెళ్ళి,ఆ స్వామిని స్తుతించి, స్వామిలో వున్న అపరిమితమైన శక్తిని మేల్కిపినాడు.
ఇంతవరకు జరిగిన కథను ఇంతకు ముందటి పద్యభావం లో తెలుసుకున్నాం. జాంబవంతుని ప్రబోధతో ప్రచోదనతో ఉత్తేజితు డైన స్వామి, పలికిన పలుకులు కవి, ఈపద్యం లోవ్రాశారు.
"ఓ గోలాంగూలభల్లూకవానర మిత్రులారా! నేనుండగా, మీరెందుకు భయపడతారు. మీరిక్కడ (సముద్రపు వొడ్డు న) వుండండి. నేనొక్కణ్ణే తప్పనిసరిగాఈసముద్రాన్నిదాటి, నేర్పుతో లంకలో ప్రవేశించి సీతామాత ఎక్కడుందో వెతికి ఆ తల్లిని వుంచిన తావు తెలిసికొని ఎలా వెళ్ళానో తిరిగి
అలాగే వస్తాను. మీ అందరిరికీ అమితానందాన్ని కలిగించి తీరుతాను", అని ధైర్యవచనాలను పలికి, నిరాశానిస్పృహ లలో దిగులుపడుచున్న ఆ వానరాదులను ఓదార్చి, శాంతింపజేసితివి కదా మారుతీ!

16) మll
బలిబంధించిననాఁటివామనతనుప్రాబల్యముందాల్చి,యు
జ్జ్వల చంద్రోదయవేళఁ బొంగు తటినీశస్ఫూర్తినుప్పొంగి,ఘో
ర లయాభ్రంబు తెఱంగునన్‌ భయద గర్జారావముం జేసి,త
జ్జలధిందాటఁగఁబూనితీవుపరమోత్సాహమ్మునన్‌మారుతీ!

తాత్పర్యం:- ప్రాబల్యం= బలిష్టత, ఉజ్జ్వల= ప్రకాశించు, తటినీశ=సముద్రం, ఘోరలయాభ్రంబు= భయంకరమైన
ధ్వనితో ఉరుము, తెరంగునన్= విధముగా, భయదగర్జా
రావము= భయాన్ని పుట్టించేంతటి పెద్ద అరుపు,తజ్జలధిం = ఆ సముద్రాన్ని, పూనితి+ఈవు= తలపెట్టినావు, పరమోత్సాహమ్ము= దృఢప్రయత్నం. కవి ఈ పద్యంలో శ్రీఆంజనేయ స్వామి వారి సముద్రలం ఘన దృశ్యాన్ని అత్యద్భుతంగా వర్ణించినాడు. పద్యప్రారం
భంలోనే, "బలి బంధించిన నాఁటి వామన తనుప్రాబల్య ముం దాల్చి", అని చదవగానే మహావిష్ణువు దాల్చిన వామానావతారం గుర్తుకొస్తుంది. మూడు అడుగుల నేల దానం అడిగి, ఇస్తానన్న బలిచక్రవర్తి సామ్రాజ్యాన్ని రెండుఅడుగులతో ఆక్రమించి, మూడవ అడుగు ఎక్కడపెట్టమం టావని వామనుడు అడుగడం, బలి తన తలమీద పెట్టమ నడం, అలాగే వామనుడు, బలితలమీద కుడిపాదాన్ని మోపి బలిని పాతాళానికి అణచివేయడం, పాతాళంలో
బలి బంధీకృతుడవ్వడం జరుగుతుంది. ఈ లీలలో పొట్టి వామనుడు, 'ఇంతింతై వడుడింతై' అన్నట్లుగాశరీరాకృతిని అనూహ్యంగా పెంచి తాను అనుకున్నకార్యాన్నిసాధిస్తాడు.
అలాగే ఓ ఆంజనేయస్వామీ! ఆనాడు బలిచక్రవర్తినిపాతా ళలోకంలోనికి అణచి వేసి, అక్కడ బంధీకృతుని చేయడం లో వామనావతారుడైన శ్రీమహావిష్ణువు తన ఆకృతిని పెంచినట్లగానే, నీవునూ నీ దేహాన్ని అపారంగాపెంచినావు. చంద్రుడు ఉదయించి తన వెలుగులను బాగా విజిమ్ముతు న్న వేళ, సముద్రం ఎలా పైకిలేస్తుందో, నీవునూ అలాగే మహేంద్రగిరి నుండి పైకి ఎగిరావు. ఆకాశం పెద్దధ్వనిచేస్తూ ఉరిమిన రీతిగా భయంకరమైన గర్జన చేసి,ఆ సముద్రాన్ని
ఆకాశమార్గంలో పయనించి దాటడానికి పరమోత్సాహం తో పూనుకొంటివి గదా స్వామీ!

17) మll
స్థిరసత్త్వంబున శైలరాజము ధరిత్రిం గ్రుంగఁ బాదంబులూ
ది, రహిన్‌ భూరిభుజోరు వేగమున ధాత్రీజాతముల్‌ పెల్లగి
ల్లి రయంబారఁగఁ దోడ రా,గగనమున్‌ లీలాగతిన్‌ మ్రింగ సు
స్థిరశక్తిం జనుమాడ్కి దాటితివి గాదే నింగికిన్‌మారుతీ!

తాత్పర్యం:- స్థిరసత్త్వంబున= చెదరని బలముతో, శైలరా జము= పర్వతరాజము ( అంటే ఇక్కడ మహేంద్ర పర్వత మని అర్థం), ధరిత్రి= భూమి, పాదంబులు+ ఊది= అరికా
ళ్ళతో అదిమిపట్టి, రహిన్= విధముగా, భూరి+భుజ+ఉరు వేగమున= విస్తారమైన భుజములను కదిలించుటవలన ఉత్పన్నమైన వేగమున, ధాత్రీజాతములు= చెట్లు, మాడ్కి= రీతిగా, గగనము= ఆకాశము ఓ మారుతీ! నీవు ఆకాశంలోనికి ఎగరడానికి ఉద్యుక్తుడ వైనప్పుడు, ఆ మహేంద్ర పర్వత శిఖరాన్ని గట్టిగాఅరికాళ్ళ తో బలంగా అదిమి పట్టినావు, అప్పుడా పర్వత పీఠం భూమి లోనికి క్రుంగి పోయింది. విస్తారమైన నీ భుజములు కదిలించుటవలన జనించిన వేగానికి, ఆ పర్వతాన్ని ఆశ్ర యించుకొని వున్న వృక్షాలు కూకటివ్రేళ్ళతో సహా పెల్లగిం
చబడి, కొన్ని నీ శరీరానికి చుట్టుకొన్నాయి.ఆకాశాన్నిమ్రింగ టానికి పోతున్నావా.. అన్నట్టు, ఆకాశానికి ఎగిరిప్రయాణిం చిన నీతోపాటే, నిన్నుచుట్టుకున్న ఆ వృక్షాలు కుడా ప్రయా
ణించాయి. అవి నీకు అదనపు భారమైనా , లెక్కచేయ కుండా స్థిరసంకల్పంతో నీవు మాత్రం ఆకాశంలోముందుకు దూసుకొని పోయావు కదా స్వామీ!

18) మll
అగజాలావృతమూర్తివై భుజరయోద్యద్వారివాహంబు లొ
ప్పుగ నిర్వంకల నంటి రా గదలి యంభోరాశిమధ్యంబునన్‌
గగనాధ్వంబున నేగు నిన్నమిషుల్‌, గంధర్వులున్‌ లంబప
క్ష గిరీంద్రంబును బోలె జూచిరికదా సంభ్రాంతులై మారుతీ!

తాత్పర్యం:-అగజాలావృతమూర్తివై= చెట్లూ పూలతో చుట్టి వేయబడిన శరీరము గలవాడై, భుజరయో+ ఉద్యత్+ వారివాహంబు= రెండు భుజముల యొక్క వేగముచేత రెండు ప్రక్కలకు తోసివేయబడిన మబ్బులు,ఒప్పుగ=చక్క గా, ఇర్వంకల= రెండు పక్కల, అంభోరాశి మధ్యంబునన్=సముద్రం మధ్యంలో, గగన + అధ్వనంబున=ఆకాశమార్గ మున, ఏగు= వెళ్ళు, నిన్+ అనిమిషుల్= నిన్ను దేవతలు, లంబపక్షి గిరీంద్రంబు= పెద్దపొడవైన పర్వతమంత పక్షి,
సంభ్రాంతులై= మిక్కిలి విభ్రమమునకు లోనైనవారై. ఓ మారుతీ! చెట్లూపూలతో చుట్టుకొనబడిన శరీరము తో, రెండుచేతులతో వేగంగా తోసివేయబడిన మేఘాల ను ఇరువైపుల వెంటనంటిరాగా, సముద్ర మధ్యానికి చేరు తున్న నిన్ను, అప్పడు ఆకాశంలో వెళ్ళుతున్న దేవతలు, గంధర్వులు చూచి, ఆహా.. ఏమిటిది, మనం ఎన్నడూ చూడని ఇంతపెద్ద పొడవైన పర్వతమంత పక్షి ఆకాశంలో ఎగురుతూ పోతున్నదేమిటో, అని వారిలో వారు అను
కుంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనైనారు గదా స్వామీ!
--(())--

Wednesday 25 December 2019

సుందర కాండము-4*



*శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-4*
*సురసా రాక్షసి*
పిమ్మట దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు నాగ మాత యగు సురసతో .. నీవు  ఆకాశమంత నోరుతో హనుమ కు విఘ్నము కలిగించి అతని కార్యసాధన దీక్షను పరీక్షించుము అనిరి. ఇట్లు వారు కోరగానే సురస హనుమ మార్గమును అడ్డగించి "ఓ వానరా! దేవతలు నిన్ను నాకు ఆహారముగా ఒసగినారు కావున  నీవు నా ముఖమున ప్రవేశించుము" అనెను. అప్పుడు హనుమ "నేను రామకార్యార్థినై సీతాన్వేషణకు వెళ్లుచున్నాను కావున నేను సీతాదేవిని చూచి ఆ విషయము రామునికి ఎఱింగించి తర్వాత నీనోట పడుదును కావున నన్ను అడ్డగించవద్దు" అని కోరెను. అందుకు సురస ఒప్పుకొనకపోగా హనుమ సురసతో నా శరీరము పట్టగలిగినంత నీ నోరు తెరువుము అని, హనుమ తన శరీరమును వరుసగా పది, ముప్పది, తొంబది యోజనములు పెంచెను. సురస గూడ తన నోరును వరుసగా ఇరువది, నలుబది, నూరు యోజనములుగా పెంచెను. అప్పుడు బుద్ధిశాలి అయిన హనుమ తన శరీరము సూక్ష్మముగా చేసి నోటిలో ప్రవేశించి వెంటనే బయిటకు వచ్చి నీ కోరిక తీరినది గాన నన్ను వెడలుటకు అనుమతిని ఈయమని కోరెను. అప్పుడు సురస తన స్వసరూపమును పొంది ..
*అర్థ సిద్ధ్యై హరి శ్రేష్ఠ గచ్ఛ సౌమ్య యథా సుఖమ్*
*సమా౭౭నయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మనా*          5.1.162
"ఓ! వానర శ్రేష్టా! హాయిగా ముందునకు సాగి కార్యసిద్ధిని పొందుము. మహాత్ముడగు శ్రీరామునితో సీతమ్మను చేర్చుము". అని ఆశీర్వదించి చనెను,  ఆకాశములో నిలిచి యున్న భూతగణము లన్నియు భేష్ భేష్ అని ప్రసంశించెను.
ఇందలి యోగ రహస్యమును పరిశీలిద్దాము. రాక్షసి తన నోరును శతయోజనములు పెంచినదియట. మానవుని శరీరము అందునా నోరు శతయోజనముల యంతటి పెద్దదిగా యుండునా? వివేకము భ్రష్టమైనప్పుడు మానవుడు తన దుర్గుణములు తద్వారా వాని అధఃపతనము శత విధముల/శతముఖముల జరుగును. *"వివేక భ్రష్టానాం, భవతి విని పాతః శత ముఖః"*  ఈ సురస శత యోజన వృత్తి రూపము సాధకుని మ్రింగుటకై లాలస పడును. కానీ సాధకుడు అహంకార రహితుడై చిన్న వాడైనచో అటువంటి వాని ముక్తి జరుగును. సాధకునికి లభించు అష్ట సిద్ధులలో లఘిమ - అనగా అణువంత చిన్నవాడవడం, ప్రాకాయి - శరీరమును అతి విశాలముగా చేయడము - భాగములు.
యోగ మార్గములో సిద్ధులు అవశ్యముగా సిద్ధించును. అయితే సాధకుడు ఆ సిద్ధులకు బానిస కానిచో తదుపరి ప్రగతి సాధ్యమగును. కానిచో సిద్ధుల మాయలో పడి సాధకుడు అతి తీవ్రగతితో పతనమగును. సంసార మాయ నుండి విడుదలై సిద్ధుల మాయలో చిక్కుకొనిన సాధకుడు అక్కడి నుండి విడిపించుకొనుట కష్టము. ఈ సిద్ధుల యొక్క మాయ శత యోజనముల యంత పెద్దదిగా యుండి మహాసాధకులను కూడా మ్రింగి వేయును. అందుచే బుద్ధిమంతుడైన హనుమ అట్టి మాయ నుండి ముక్తమగుటకై నమ్రతతో సూక్ష్మ రూపుడై తనకు ప్రాప్తించిన సిద్ధులన్నియు పరమాత్మకు సమర్పించును. ఈ సూక్ష్మ శరీరము ద్వారా తనలోని అహంకారమును హనుమ వదిలెను. ఇదే కాండలో లంకలో సీతను అన్వేషించునప్పుడు గూడ హనుమ సూక్ష్మ రూపముతోనే తన అహంకారమును వదిలి సర్వము రామునిపై కార్య భారము మోపి, తనతో కార్యము రాముడే (భగవంతుడు) చేయించుచున్నాడు అని తలచి  అన్వేషించును.
*శ్రీరామ జయరామ జయజయ రామ*

Tuesday 24 December 2019

***సుందర కాండము-3




శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-3
హనుమ సాగరయానము

తతో రావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శనః
ఇయేష పదమ్ అన్వేష్టుం చారణా చరితే పథి 5.1.1
 
అంగదాది వానరుల అభ్యర్థనను అనుసరించియు, జాంబవంతుని ప్రోత్సాహముతో హనుమ సముద్రమును లంఘించుటకు మహేంద్ర పర్వతమును అధిరోహించి సీతాన్వేషణకు చారణాది దివ్య జాతుల వారు సంచరించు ఆకాశ మార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. ఇచట ఆకాశమున వెళ్ళుట యనగా బ్రహ్మనిష్ఠ కలిగి యుండుట. ఆకాశమనగా పరబ్రహ్మము (అంతటా పూర్ణముగా ప్రకాశించువాడు). దాని యందు విహరించువాడే సంసార సముద్రమును తాను దాటి జీవులను తరింప చేయగలడు.
 
ముమోచ చ శిలాః శైలో విశాలాః సమన శ్శిలాః
మధ్యమేనా౭ర్చిషా జుష్టో ధూమ రాజీ రివా౭నలః 5.1.16
 
ఆ మహాబలుడి చే అదుమబడిన మహేంద్రగిరి తన పగుళ్లనుంచి బంగారు, వెండి, కాటుక ధారలను వెలిగ్రక్కును. ఏలనన అగ్ని యొక్క సప్తార్చులలో [1]"మాధ్యమార్చి" అనునది సులోహిత. దాని జ్వాలల నుండి పొగలు వెలువడుచున్నట్లు హనుమచే అదుమబడిన ఆ మహేంద్రగిరి నుండి పెద్ద పెద్ద ఎర్రని శిలలు ముక్కలు ముక్కలుగా బయటపడ సాగెను. హనుమ పైకి ఎగుర సన్నద్ధుడై అంగదాది వానరులతో ఇట్లనెను.
 
వానరాన్ వానర శ్రేష్ఠ ఇదం వచనమ్ అబ్రవీత్
యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః     5.1.39
 
గచ్ఛేత్ త ద్వద్గమిష్యామి ల౦కా౦ రావణ పాలితామ్
న హి ద్రక్ష్యామి యది తాం లఙ్కాయాం జనకా౭౭త్మజామ్  5.1.40
 
అనేనైవ హి వేగేన గమిష్యామి సురా౭౭లయమ్
యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యా౭మ్యకృత శ్రమః        5.1.41
 
బద్ధ్వా రాక్షస రాజానమ్ ఆనయిష్యామి రావణమ్
సర్వథా కృత కార్యో౭హమ్ ఏష్యామి సహ సీతయా       5.1.42
 
ఆనయిష్యామి వా లఙ్కాం సముత్పాట్య సరావణామ్
ఏవమ్ ఉక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః         5.1.43
 
ఉత్పపాతా౭థ వేగేన వేగవాన్ అవిచారయన్
సుపర్ణ మివ చా౭౭త్మానం మేనే స కపికుంజరః 5.1.44
 
రామబాణము వలె మిక్కిలి వాయువేగముచే రావణ పాలిత లంకకు ఎగెదను. అక్కడ సీతమ్మ కనబడనిచో, అదే వేగమున సురలోకమునకు పోయెదను. అక్కడ గూడ సీతాదేవి కనబడనిచో రావణుని బంధించి తీసుకొని వచ్చెదను. ఏదిఏమైనా కృతకృత్యుడనై వచ్చెదను. లేనిచో రావణనునితో సహా లంకను పెకిలించుకొని తీసుకొని రాగలను. అని చెప్పి మిక్కిలి వేగముతో గరుడుని వలె అంతరిక్షమునకు ఎగిరెను. ఆత్మీయులను వీడ్కోలినప్పుడు వారిని కొంతదూరము అనుసరించి, వాటి ఎడబాటునకు తట్టుకొనలేక దుఃఖాశ్రువులను రాల్చి శోక తప్తులగుదురు. అదేవిధముగా అచ్చటి మహావృక్షములు ఆయన వేగమునకు కొంతదూరము అనుసరించి పుష్పములను రాల్చుతూ సముద్రముపై పడిపోయెను.
 
దశ యోజన విస్తీర్ణా త్రింశ ద్యోజనమ్ ఆయతా            
ఛాయా వానర సింహస్య జలే చారుతరా౭భవత్ 5.1.76
 
సంధ్యా సమయము కావడం మూలాన మారుతి యొక్క శరీరచ్చాయ పొడవు పది యోజనములు, వెడల్పు ముప్పది యోజనములుగా కనబడెను. త్రోవలో సాగరుని యొక్క ప్రోద్బలముచే మైనాకుడు (సముద్రములో నున్న పర్వతము) హనుమను  కొంచెము తడవు విశ్రాంతి తీసుకొనమని ప్రార్ధించగా, అందుకు సున్నితముగా తిరస్కరించి హనుమ తన ప్రయాణమును కొనసాగించెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

Monday 23 December 2019

***సుందర కాండము-2 సుందరకాండ సౌందర్యము



[

5:59 AM, 12/24/2019] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-2
సుందరకాండ సౌందర్యము
శ్రీరామాయణము మహాకావ్యము. కావ్యమున శబ్దము, అర్థము, రసము - అను మూడు ఉండును. ఈ  మూడును సుందరములై యున్న ఆ కావ్యము మాహాకావ్యము. సుందర కాండలో ఇట్టి శబ్దార్థరస సౌందర్యములు అధికము. కావుననే ఇది సుందరకాండ.
ఇందలి కావ్యగతశబ్దార్థరస సౌందర్యములను పరిశీలింతుము.
1 శబ్ద సౌందర్యము
హంసో యథా రాజత ప౦జర స్థః
సింహో యథా మన్దరకన్దర స్థః
వీరో యథా గర్విత కుఞ్జర స్థః
చన్ద్రో౭పి బభ్రాజ తథా౭మ్బర స్థః      5 5 4
మున్నగు శ్లోకములలో వర్ణ, పద, అనుప్రాసలు అందము కనబడును.
2 "అర్థ సౌందర్యము*
ఇందలి వర్ణనలు, కథ, అలంకారములు కడు మనోహరములు. ఉదాహరణకు
ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమ్ అన్వయుః
ప్రస్థితం దీర్ఘమ్ అధ్వానం స్వబన్ధుమ్ ఇవ బాన్ధవాః    5.1.47
తమ్ ఊరు వేగోన్మథితాః సాలా శ్చా౭న్యే నగోత్తమాః
అనుజగ్ముర్ హనూమన్తం సైన్యా ఇవ మహీ పతిమ్            5.1.48
ఆ కపివరుని వేగమునకు ఆ మహావృక్షములన్నియు ఒక ముహూర్తకాలము అతనిని వెన్నంటి ఒక మహారాజును అనుసరించుచున్న సైన్యము వలె కాన వచ్చెను.
అటులననే రావణుని అంతఃపురంలో పెట్టిన దీపములు ఆరకుండా జూదములో ఓడిపోయినను వదలలేక అటువైపు చూచుచున్న జూదగాళ్ళతో పోల్చెను. (9 .32 ). ఇట్టి అనేకమైన అలంకారములు సముద్రతరణ, లంకాన్వేషణ, సీతాదర్శనము, అశోకభంజనము, రావణ దర్శనము, లంకాదహనాదులలో కావ్య సౌందర్యము వర్ణనాతీతము.
3 రస సౌందర్యము
ఈ కాండలో నవరసాలు చాలా అందముగా వర్ణింపబడినవి. సీతారాముల పరస్పరానురాగము, ఎడబాటును  వర్ణించుటలో "శృంగారము" గోచరించును.  రాక్షసులను జయించుటలో "వీరరసము" గానబడును. సురస, సింహిక, లంకిణీల వ్యర్థాటోపము "హాస్యరసమును" సూచించును. రాక్షసులను చంపుటలో "రౌద్రరసము" కనబడును. లంకాదహనములో "భయానకం" గోచరించును. సముద్ర లంఘనములో "అద్భుతము" గోచరించును. సీత కనబడక హనుమ నిర్వేదము చెందినప్పుడు "శాంతము" కనబడును.  రాక్షసుల వలన సీత పడిన బాధ "కరుణ" ను చూపును.
ఈ కాండ యందు మొదట నుండి చివర వరకు హనుమ కనబడును. పదిహేనవ సర్గ నుండి చాలా వరకు సీత కనబడును. చివరి సర్గలో శ్రీరాముడు కనబడును. ఈ ముగ్గురి యొక్క సౌందర్యములు ఇందు అభివ్యక్త మగుటచే దీనికి "సుందరాకాండ" అయినది.
సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా|
సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం||"
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః|
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం||
అనునది ప్రాజ్ఞుల వచనము. పురుష మోహనాకారుడు, సుగుణగుణా సుందరుడు, శ్రీరాముడు. సర్వవిధముల భువనైక సుందరి సీతామాత. కాంచనాద్రి కమనీయ విగ్రహుడైన హనుమ పరమ సుందరుడు. అశోక వనము అతిలోక సుందరము. శ్రీసీతారామహనుమంతుల మహామంత్రములు దివ్యములు, సుందరములు. ఈ మహితాత్ముల కథ సర్వాద్భుత సుందరము. ఈ సుందరాకాండము యొక్క బహువిధవైభవములను వర్ణించు కవిత్వము (కావ్యము) అంత్యంత సుందరము. ఈ సుందర కాండము నందు సుందరము కానిదేది లేదు. సీతాన్వేషణ మహాకార్యమున ప్రముఖ పాత్రను నిర్వహించిన మహాత్ముడు హనుమ. హనుమ యొక్క శక్తిసామర్థ్యములు, బలపరాక్రమములు అత్యద్భుతములు, నిరుపమానములు. ఈయన కార్యదీక్షతలు అపూర్వములు. అణిమాది అష్ట సిద్ధులు అన్నియు ఈయనకు కారతలామలకములు. బుద్ధి, వైభవము సాటిలేనిది. సమయస్ఫూర్తి  ఉగ్గుపాలతో అబ్బిన విద్య. ఇంత ఎందులకు ఈ మహాత్ముని విషిష్ఠ లక్షణము లన్నియు ఈ సుందర కాండము గోచరించును. అయినను ఎల్లప్పుడూ తనను దాసుడుగానే అభివర్ణించుకొన్నాడు గాని సర్వస్వతంత్రుడిగా భావించుకోలేదు. అహంకారము ఈషన్మాత్రము గూడ లేదు.
శ్రీరామ జయరామ జయజయ రామ

Sunday 22 December 2019

సుందర కాండము-1* *హనుమ స్వరూపము*




ఓం శ్రీ రామ్ ... శ్రీ మాత్రే నమ: 
  • *శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-1*002 

*హనుమ స్వరూపము*
*వేదవేద్యే పరే పుంసి జాతే దశరాత్మజే*
*వేద: ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా*

వేదములచే తెలియబడు పరమపురుషుడు దశరధునికి కుమారుడైనట్లుగా,వేదము,వాల్మీకి వలన , రామాయణ రూపముతో ఉండినది..

శ్రీమన్నారాయణుడు ఈ భూమిపై మరల నసించిపోవు చున్న ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీరాముడు గా అవతరించాడని  మన భారతీయుల ప్రగాఢ విశ్వాసము. శ్రీరాముని మీద మనకు లభించినన్ని పరిశోధనా గ్రంథాలు వేటి యందు లభించవు. శ్రీరాముడు మానవునిగా జన్మించి తన శిష్య ప్రజ్ఞచే సకల శాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి, అకుంఠిత దీక్షతో ఆయా యోగ రహస్యాలను అభ్యాసం చేసి, తన సత్య సంధతతో భగవంతునిగా రూపాంతరము చెందినవాడు. తనను గూర్చి *"ఆత్మానాం మానుషం మన్యే"* (నేను మానవ మాత్రుడను) అని పేర్కొన్న శ్రీరాముడు *"సత్యేన లోకాన్ జయతి"*  అను ప్రమాణము ననుసరించి సత్యనిష్టాగరిష్ఠుడు అయినందున శ్రీరాముడు అన్ని లోకములను జయించ గలిగిన వాడై భగవంతునిగా ఈ లోకుల దృష్టిలో ఉండిపోయాడు. దుర్లభమైన మానవ జీవితమును వ్యర్థము చేసుకొనకుండా బాహ్యమున ధర్మాచరణమును, అంతరమున జ్ఞానము కలిగి ఉండవలెనని మనకు శ్రీరాముని ద్వారా తెలియు చున్నది.
రామలక్ష్మణులు సీతను అన్వేషించుతూ పంపా తీరమునకు వచ్చినప్పుడు, సుగ్రీవుని భయము పోగొట్టుటకై హనుమ సుగ్రీవునితో ఇది ఋశ్యమూకం గాన ఇక్కడికి వాలి, వాలి సంబంధీకులు రాలేరు అని చెపుతాడు. ఆ విధంగా రామాయణంలో హనుమ పాత్ర పరిచయము అయింది. రామసౌందర్యమును చూడగానే హనుమ ఆకర్షితుడయ్యెను. హనుమను చూచి, అతని సంభాషణ విని నంతనే రాముడు అతనిలోని గుణగణములను తెలుసుకొనెను. రాముడు లక్ష్మణుతో హనుమను గురించి చెపుతూ ..

వాక్యకుశలః,(వాక్యకుశలుడు),  ఋగ్వేదమునందు బాగుగా శిక్షణ పొందినాడు, యజుర్వేదమును ధారణ చేసినాడు,  సామవేదమును చక్కగా ఎరిగిన వాడు, వ్యాకరణమును అనేక మార్లు వినినాడు, మాట్లాడినప్పుడు సందిగ్ధము లేకుండా, తొందరగా గాని, మెల్లగా గాని గాకుండా ముఖము నందు ఎట్టి వికార భావములు లేకుండా, మధుర స్వరముతో, సంస్కారముగా, మంగళకరమైన మధుర స్వరముతో మాట్లాడినాడు అనెను. ఇట్టివాడు దూతగా ఉన్నచో కార్యము తప్పక సిద్ధించునని దూతగా హనుమ యొక్క విశిష్టతను  చెప్పినాడు.  హనుమ యొక్క ఉత్పత్తి ప్రకారమును పరిశీలించిన శబ్దమునకు హనుమతో గల సామ్యము గోచరించును. మనలోని ఒక భావమును ఆవిష్కరించ వలెనన్న కోరిక గలిగినచో శరీరములోని వాయువులలో కదలిక గల్గును. ఆ వాయువుచే అభిహతమై మూలాధార స్థానము నుండి శబ్దము బయలుదేరి నాభిని, హృదయమును, కంఠమును దాటి తిన్నగా శిరస్థానమును చేరును. అచట నుండి పైకి పోవ వీలు లేక కంఠము నుండి ముఖము గుండా వెలికి వచ్చును. అట్లు వచ్చునప్పుడు నోటిలోని ఆయా స్థానములలో వాయువు యొక్క తాకిడిచే శబ్దముగా వెలికి వచ్చును. ఇందు హనుమకు, శబ్ధమునకు సాపత్యమును చూద్దాము.

1 హనుమ వాయువు వలన జన్మించాడు. శబ్దము కూడా వాయువు వలననే జనియించింది.
2 పుట్టగానే హనుమ సూర్య మండలము వైపు (సమాధి అవస్థ) కు పోయెను. శబ్దము కూడా ముందుగా శిరస్సు వైపు సాగును. అటు పోవ వీలుగాక నోటి నుండి వెలుపలికి వచ్చును. నోటిలోని ఆయా వర్ణముల అభివ్యక్త స్థానములే అంజన, కనుక అంజనాసుతుడు అయ్యెను.
3 సూర్యుని నుండి క్రిందకు పడిపోటచే దౌడలు సొట్ట  బోయి   హనుమ గా పేరు వచ్చినది. శబ్దము గూడ శిరఃస్థానము నుండి నోటిలోని దౌడల కదలికచే వర్ణ రూపమున వెలుపలికి వచ్చును గాన శబ్దము గూడ "హనుమ" అగును.
4 శబ్ద సామర్థ్యము వలన అవసరమైన కార్యములు నెరవేర్చుటలో మంత్రి వలే పని చేయును. స్వాధ్యాయన ప్రవచన శీలి యగు సుగ్రీవునకు హనుమ సచివుడు.
ఇట్టి హనుమయే రాముని సీతమ్మతో  కలుపును.
*శ్రీరామ జయరామ జయజయ రామ*
సీతారామ మనోభిరామ కళ్యాణ రామ 
సమస్త జనరక్షక పాలన రామ .. ఓం శ్రీరాం 
/మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
--(())--

Saturday 21 December 2019

*మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభోదయము

ప్రాంజలి  ప్రభ ... రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ (001) 
ఎందరో మహానుహవులు అందరికీ వందనములు ,, మూలం వాల్మీకి రామాయణము 
కార్తీక మాస సందర్భముగా సుందరకాండ పారాయణము చేయుట చాలా మంచిది అందుకని అందిరికి అందుబాటులో ఉండేవిధముగా వ్రాసిన రామాయణములో సుందరతత్వము పొందు పరుస్తున్నాను  

మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభోదయము

శ్రీరాముడు-యోగ తత్వ రహస్యము (sundarakaanda)


శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము కర్కాటక లగ్నము నందు, భరతుడు చైత్ర శుద్ధ దశమి పుష్యమి నక్షత్రము మీన లగ్నము నందు, లక్ష్మణ, శత్రఘ్నులు చైత్ర శుద్ధ దశమి ఆశ్లేష నక్షత్రము కర్కాటక లగ్నము నందును జన్మించిరి. వారి వారి జనన కాలము నందు రవి, కుజ, గురు, శుక్ర, శనులు ఉచ్చ దశలలో యుండిరి. జ్యోతిషశాస్త్ర ప్రమాణము ప్రకారము శ్రీరాముడు లోకనాయకుడు అనగా జగత్ప్రభువుగా, తక్కిన వారు జగత్ప్రసిద్ధులైరి.


సర్వే వేదవిదః శూరాః సర్వే లోక హితే రతాః
సర్వే జ్ఞానోప సంపన్నాః సర్వే సముదితా గుణైః   1 18  24

ఆ రాజకుమారులు వేదశాస్త్రములను అభ్యసించిరి. ధనుర్విద్య యందు ప్రావీణ్యము సంపాదించిరి. యుక్త వయస్కులైన తన పుత్రుల వివాహ విషయమై దశరథ మహారాజు ఆలోచించుచుండగా విశ్వామిత్ర మహర్షి వచ్చి యజ్ఞ సంరక్షణార్థమై శ్రీరాముని పంప వలసినదిగా కోరతాడు. ఆ కోరిక విని దశరథ మహారాజు విశ్వామిత్రునితో ..
ఊన షోడశ వర్షో మే రామో రాజీవ లోచనః
న యుద్ధ యోగ్యతామ్ అస్య పశ్యామి సహ రాక్షసైః  1 20 2

రాముడు పదుహారు సంవత్సరముల ప్రాయము వాడు, క్రూర రాక్షసులతో యుద్ధము చేయలేడు. ఇక్కడ వాల్మీకి తన కావ్యములో శ్రీరాముడు జననము తర్వాత వారు పదునారు సంవత్సరముల ప్రాయములో సకల విద్యా పారంగతులైరి అని చెప్పెను. తరువాత శ్రీరాముని వైరాగ్యము, వసిష్ఠ మహర్షి చెప్పిన ఆత్మ విజ్ఞానము మనకు వాల్మీకి రామాయణములో కానరాదు. అది యోగ తత్వము నందు యున్నది  గావున గమనించ గలరు. 

రావణుడు అమోఘమైన తపఃసంపన్నుడు. అట్టి రావణుని సంహరించుటకు రావణుని మించిన తపఃశక్తిని  పొంది యుండవలెను.


వేదము - సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము - అని మూడు భాగాలు. ఆరణ్యకంలో వివిధ తపస్సులు క్రింది విధంగా పేర్కొనబడినవి:

"ఋతం తపః, సత్యం తపః, శ్రుతం తపః, శాంతం తపః, దమస్తపః, శమస్తపః, దానం తపః, యఙ్ఞం తపః, భూర్భువస్వుర్బ్రహ్మై తదుపాస్య తపః.
1. ఋతము = సూన్రుత భాషణము - వాక్కుతో సత్యము పలుకుట, 
2. సత్యము = త్రికాలలో - భూత-భవిష్యత్-వర్తమానాలలో - ఉండేది. యథార్థ వస్తు చింతనం చేయటం. సత్యం ఙ్ఞానం అనంతం బ్రహ్మ (తైత్తిరీయోపనిషత్తు), 
3. శ్రుతము = వేదాధ్యయనము, 
4. శాంతము = శాంతముగా నుండుట (ఓర్పు), 
5. దమము = ఇంద్రియ నిగ్రహము, 
6. శమము = కామక్రోధాదులు లేకుండుట, 
7. దానము = బ్రహ్మార్పణముగా ఇతరులకు ఇచ్చుట, 
8. యఙ్ఞము = దేవతారాధన. ఇవేకాకుండా బ్రహ్మను (అంటే సర్వమూ తానే అయి, సర్వత్రా, సర్వకాలములలో ఉండేవాడు) ఉపాసించుట కూడ తపస్సే. యఙ్ఞములు పలు రకాలు. వాటిలో తపోయఙ్ఞం ఒకటి. అదే ఆ పైన చెప్పబడినదియే యఙ్ఞం తపః.
శ్రీమద్భగవద్గీతలో శ్రీ క్రుష్ణ భగవానుడు ఐదు రకాలైన యఙ్ఞ భేదములను ఇట్లా వివరించాడు.

ద్రవ్య యఙ్ఞాస్తపోయఙ్ఞా, యోగ యఙ్ఞాస్తధాపరే|
స్వాధ్యాయ ఙ్ఞానయఙ్ఞాశ్చ, యతయః సంశితవ్రతాః||
(ఙ్ఞానయోగము: 4-28)

వాటిలో తపస్సు కూడా ఒక యజ్ఞమే. ఈ మాదిరి పుణ్య కార్యాలు, తపస్సులు చేస్తే దైవారాధన వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. మహర్షులు, సాధు పురుషులు తమ స్వార్థం కోసంగాక, లోక క్షేమం కోరి తపస్సు చేస్తారు. కామక్రోధాలను, రాగద్వేషాలను దరిజేరనీయక, జితేంద్రియులై, సత్వ గుణ ప్రధానులై త్రికరణ శుద్ధితో తపస్సు చేస్తారు. అట్టి తపోధనుల తపస్సంపద లోక కళ్యాణానికి దారి తీస్తుంది. శ్రీరాముడు లోకకళ్యాణార్థమై తపస్సు చేస్తాడు.
రామాయణము జాగ్రత్తగా మొదటి నుంచి చివర వరకు గమనించితే శ్రీరాముడు సాధించిన ఇట్టి తపః ప్రభావములు గనపడును. మానవుని పురోభివృద్ధి ఎలా యుండవలెనో/సాగవలెనో రామాయణము కాండల రూపములో శ్రీరాముని పాత్ర ద్వారా వాల్మీకి వివరించారు. 

ఉదాహరణకు బాలకాండములో శ్రీరాముడు గురుకులంలో విద్యాభ్యాసము, వసిష్ఠ మహర్షి వద్ద ఆత్మ జ్ఞానము, విశ్వామిత్రుని వద్ద అట్టి విద్యను సత్యధర్మములనే ఆయుధములుగా అభ్యాసము (ప్రాక్టీస్) చేసినాడు. అయోధ్యాకాండములో భరతునికి రాజ ధర్మమును బోధించుట ద్వారా ఆచార్యుడు (గురువు) గా దర్శనము చేసినాడు. అనగా తాను చదువుకున్నది అభ్యాసము చేసినవాడే సరియైన గురుస్థానమును పొందగలుగును. జాబాలి నాస్తిక వాదాన్ని ఖండించుట ద్వారా వేద ప్రమాణాన్ని నిలబెట్టాడు. (ఆది శంకరాచార్యులు ఇటులనే ప్రాచుర్యములో యున్న నాస్తిక వాదమైన బౌద్ధమును ఖండించడము గమనించ వచ్చు). అరణ్య కాండలో అసురభావములను నాశనము చేసి సత్య ధర్మములను ప్రతిష్టించవలెనని తన నడవడిక ద్వారా చాటెను. కిష్కిందా కాండలో అట్టి అసుర భావములను నాశనము చేయుటకు మిత్రుని తోడ్పాటు కూడా అవసరమని గ్రహించి సుగ్రీవునితో స్నేహము చేసినాడు. Finally యుద్ధ కాండలో దుష్ట సంహారం చేసినాడు.

ఈ విధముగా మానవుడు అభ్యుదయము పొందవలెనన్న పరిణామ క్రమము ఎలా ఉండవలెనో శ్రీరాముని పాత్ర ద్వారా మనకు వాల్మీకి అవగతము చేసినారు.
రేపటి నుంచి సుందర కాండలో హనుమ స్వరూపమును విహంగ వీక్షణము చేయుటకు ప్రయత్నిద్దాము.

శ్రీరామ జయరామ జయజయ రామ
ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - 
ఓం శ్రీ రామ - ఓం  శ్రీ రామ - ఓం శ్రీ రామ - 
ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - 

--(())--
సేకరణ రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ 
   

Friday 4 October 2019

1



ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

ఎందరో మహానుభావులకు వినయపూర్వకముగా మనవి చేస్తున్నాను రామాయణ మాహా కావ్యాన్ని ఎందరో మహాను బావులు రచించారు నేను నాకున్న పరిజ్ఞానముతో అచ్చు తెలుగులో గద్యభాగముగా 2012     నుండి వ్రాసిన సుందరకాండను పొందు పర్చ దలిచాను ప్రతిఒక్కరుచదివి కనీసం ఒక్కరికి చదవమని చెప్పండి  సీతా రామ పఠాభిషేక  పటమును, రామభక్త జ్ఞాన స్వరూప ఆంజనేయ స్వామి పటమును,  పూజామందిరమున ఉంచి  చేయగలరని ఆశిస్తున్నాను  నా నా వ్రాతలలో ఏమైనా తప్పులుదొర్లిన క్షమించగలరు  ఆ పరమాత్ముని సంకల్పమని భావిస్తూ పొందు పరుస్తున్నాను .     

 ఆదికవి వాల్మీకి రచన  ఆధారముగా వ్రాయుటకు సంకల్పించినాను  నేను వ్రాయలేదు నేను  ఆరాధించే హనుమంతుడే వ్రాయించాడని అనుకుంటున్నాను. 
శ్రీ సీతారామాంజనేయ నమో నమ:

ముందుగా క్లుప్తముగా 

సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కథ. దీనిని "సీతాయాశ్చరితం మహత్" అని వాల్మీకి అన్నాడు. 24,000 శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును. రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు) గా విభజింప బడింది.

బాల కాండము (77 సర్గలు) : కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము

అయోధ్యా కాండము (119 సర్గలు) : కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము

అరణ్య కాండము (75 సర్గలు) : వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము

కిష్కింధ కాండము (67 సర్గలు) : రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము

సుందర కాండము (68 సర్గలు) : హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట

యుధ్ధ కాండము (131 సర్గలు) : సాగరమునకు వారధి నిర్మించుట, యద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము
ఉత్తర కాండము: సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి - (కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.)
బాలకాండము

శివ ధనుర్భంగము - రవివర్మ చిత్రం

ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని హతంచేయడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కిందలో ఉన్నాడు.

కులగురువు వశిష్టుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలనూ అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగసంరక్షణార్ధమై రామ లక్ష్మణులను తనతో పంపమని కోరాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ఎన్నో అస్త్రవిద్యారహస్యాలను బోధించాడు. దారిలో రామ లక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదము సోకి అహల్యకు శాపవిమోచనమైనది. రామ లక్ష్మణుల రక్షణలో యాగము జయప్రథముగా జరిగింది. మారీచ సుబాహులూ, ఇతర రాక్షసగణములూ దండింపబడ్డారు. తిరుగుదారిలో వారు జనకుని రాజధానియైన మిథిలానగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరచి, సీతకు వరుడైనాడు. సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతులు, శృతకీర్తి శతృఘ్నుల వివాహం కనుల పండువుగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించిన పరశురామనకు తాము ఇద్దరూ విష్ణుస్వరూపులే అని తెలిసింది. మహా వైభవముగా నలుగురు జంటలూ అయోధ్యకు తిరిగి వచ్చారు.
అయోధ్యా కాండము
భరద్వాజాశ్రమంలో సీతారామలక్ష్మణులు
దశరథుడు రాజ్యభారాన్ని పెద్దకొడుకైన రామునకప్పగింపవలెనని సంకల్పించాడు. పట్టాభిషేకానికి సర్వమూ సిద్ధమైనది. అంతటా వేడుకలు జరుగుతున్నాయి. రాముని సవతి తల్లియైన కైకేయి దశరథుని రెండు కోరికలు కోరింది - (1) భరతుని పట్టాభిషేకము (2) రామునకు 14 ఏండ్ల వనవాసము. రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి వనవాసానికి బయలుదేరాడు. రామునితోబాటు ఆత్మయైన సీతా, నీడయైన లక్ష్మణుడూ వనవాసానికి బయలుదేరారు. దారిలో గుహుడనే నిషాదరాజు వారిని గంగానది దాటించాడు. రామునికై విలపిస్తూ అయోధ్యలో దశరథుడు మరణించాడు.
భరతుడు సైన్యంతో అడవికి వెళ్ళి - "నీకు చెందవలసిన రాజ్యం నావంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి, అయోధ్యకు తిరిగివచ్చి మమ్మలనందరినీ ఏలుకో" అని ప్రార్థించాడు. తండ్రి మరణవార్త విన్న రాముడు దుఃఖించాడు. కాని "తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం. వనవాస దీక్ష ముగియవలసిందే" అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు - "14 సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంత వరకు నీ పాదుకలను సింహాసనంపై ఉంచి, భృత్యునిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను" అని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు.
సీతారామ లక్ష్మణులు మందాకినీ తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని జపతపాది కార్యములు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. వారు అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శించినపుడు సీతమ్మవారు అనసూయ ఉపదేశములు, ఆశీర్వచనములు గ్రహించింది.
అరణ్యకాండము
రామునితో బంగారు లేడిని తెమ్మని చెబుతున్న సీత - రాజా రవివర్మ చిత్రం
సీతారామలక్ష్మణులు మహర్షుల ఆశ్రమాలను దర్శించి, పిదప గోదావరి తీరాన పంచవటి వద్ద పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసింపసాగారు. అక్కడకి 8శూర్పణఖ అనే కామరూపియైన రాక్షసి వచ్చి రామ లక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి సన్నద్ధమైనది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు. రోదిస్తున్న శూర్పణఖ కసి తీరడానికి తన సోదరులైన ఖర దూషణులనే రాక్షసులు 14 వేల మందిగల రాక్షస సైన్యముతో రామునిపై దండెత్తారు. రాముడొకడే వారందరిని హతం చేశాడు. శూర్పణఖ వెళ్ళి రావణునితో మొరపెట్టుకొంది. కసితో రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామ లక్ష్మణులను దూరంగా వెళ్ళేలా చేసి, తాను సీతను ఎత్తుకుపోయాడు. సీత కనిపించక హతాశులైన రామలక్ష్మణులు ఆమెను వెతుకనారంభించారు. కొనవూపిరితోనున్న జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్నుమూశాడు. రామలక్ష్మణులు మాతంగముని ఆశ్రమంలో వారికోసం ఎదురు చూస్తున్న శబరి ఆతిథ్యం స్వీకరించి, ఋష్యమూకపర్వతానికి బయలుదేరారు.
కిష్కింధకాండము
వాలి మరణ సమయంలో రాముని ఉపదేశం
రాముడూ, వానరుడైన సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. వాలిని వధించి రాముడు సుగ్రీవునకు వానర రాజ్యం కట్టబెట్టాడు. తరువాత సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకూ సీతాన్వేషణ నిమిత్తమై పంపాడు. అలా దక్షిణదిశకు వెళ్ళినవారిలో అంగదుని నాయకత్వంలో హనుమంతుడూ, జాంబవంతుడూ, నీలుడూ, మైందుడూ, ద్వివిధుడూ, సుషేణుడూ వంటి మహావీరులున్నారు. వారు అనేక అవాంతరాలను అధిగమించిదక్షిణసముద్ర తీరానికి చేరుకొన్నారు. ఇక నూరు యోజనాల విస్తీర్ణమున్న సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతను వెదకడానికి హనుమంతుడు మహాతేజంతో సిద్ధమయ్యాడు.
సుందరకాండము
హనుమంతుని తోకకు నిప్పు అంటిస్తున్న రాక్షసులు c.1910's నాటి చిత్రం.
హనుమంతుడు దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు. రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, భీతయై కృశించిన సీతను చూచాడు. ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు. సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది. హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఓరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.
ఇక హనుమంతుడు ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు.
"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.
యుద్ధకాండము
హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది. రావణుని తమ్ముడైన విభీషణుడు రావణునితో విభేదించి, సాగరముదాటి, రాముని శరణు జొచ్చెను. కానున్న లంకాధిపతివని రాముడు విభీషణునకు ఆశ్రయమిచ్చి, కానున్న లంకాధిపతిగా సాగరజలాలతో అభిషిక్తుని చేయించెను. ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము విశ్వకర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో జరిగింది. వానర భల్లూకసేనల, రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు.
రామ లక్ష్మణులపై నాగాస్త్రమును ప్రయోగిస్తున్న ఇంద్రజిత్తు
ఇరు పక్షాలవారూ వ్యూహాలు సన్నద్ధం చేసుకొన్నారు. చిట్టచివరి ప్రయత్నంగా రాముడు పనిచిన అంగదరాయబారం విఫలమైనది.
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
అంటూ వానరసేన లంకను ముట్టడించింది. మహాయద్ధం జరిగింది. వానరులచేతిలో రాక్షసవీరులు భంగపడ్డారు. దానితో ఇంద్రజిత్తు మాయాయుద్ధమారంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. అంతా విషణ్ణులైన సమయానికి గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చి వారిని నాగబంధాలనుండి విముక్తులను చేశాడు.
అనేకమంది రాక్షస వీరులు వానరుల చేత, రామలక్ష్మణులచేత హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని యుద్ధానికి వెడలాడు. అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణుని పంపేశాడు. అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. లక్ష్మణునిబాణాలు కుంభకర్ణుని నిలువరించాయు. రాముడు దివ్యాస్త్రాలతో వాని బాహువులనూ, ఊరువులనూ ఖండించగా వాడు పర్వతంలా క్రిందపడ్డాడు.
మరునాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి అందరూ వివశులయ్యారు. హనుమంతుడు పర్వతసమేతంగా ఓషధులను తెచ్చి అందరినీ పునరుజ్జీవితులను చేసి, మరల పర్వతాన్ని యధాస్థానంలో ఉంచి వచ్చాడు. లక్ష్మణుడు అన్న ఆశీర్వాదము పొంది, హనుమంతుని భుజాలపై ఆసీనుడై వెళ్ళి, ఇంద్రజిత్తును చంపేశాడు.
పట్టాభిషిక్తులైన్ సీతారాములు
ఇక రావణుడు మహోదరాది మహావీరులతో యుద్ధానికి వెడలాడు. లక్ష్మణుడు దారుణంగా గాయపడ్డాడు. అప్పుడు రాముడు తనవారిని ఉద్దేశించి - "మీరు సౌమిత్రిని రక్షిస్తూ, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. రావణ సంహారం చేసి వస్తాను" అన్నాడు. రామ రావణ సంగ్రామం ప్రళయకాలాగ్నివలే చెలరేగినది. రావణుని అస్త్రంతో లక్ష్మణుడు కూలిపోయాడు. రాముడు విలపించసాగాడు. హనుమంతుడు మరల గిరిశిఖరానికి వెళ్ళి, శిఖరంతో సహా ఓషధులను తెచ్చి వాసన చూపగా లక్ష్మణుడు లేచి నిలబడి, "అన్నా! ఈ సాయంసంధ్యలో రావణుడు కడతేరాలి అన్నాడు".
రామునకు సహాయంగా ఇంద్రుడు మాతలిని సారథిగా పంపాడు. యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు అగస్త్యుడు "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు. రాముడు దానిని మూడు మార్లు జపించాడు. రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింపసాగారు. "రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. రావణుని తలలు తెగి పడుతున్నా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.
రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు.
అనంతరం రాముని నిరాకరణతో క్రుంగిపోయిన సీత అగ్ని ప్రవేశం చేసి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది. సీతారామలక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగివచ్చారు. వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది.

రాముని నిర్యాణము
రావణాది దుష్టులెల్లరును మడసిరి కావున రామా నీవీ అవతారమును చాలింపుము అని యముడు అనెను.రాముడు, ఆతని సోదరులెల్ల సరయూనదిలో దిగి వారి అవతారములు చాలించిరి.[3]


Tuesday 24 September 2019


మీ శ్రేయభిలాషి

వాల్మీకి రామాయణం - Valmiki Ramayanam

28వ దినము, కిష్కింధకాండ

సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం 4 దిక్కులకి వెళ్ళిన వానరములలో 3 దిక్కులకి వెళ్ళిన వానరములు నెల రోజుల తరువాత వెనక్కి తిరిగి వచ్చేశాయి. వాళ్ళు అన్ని ప్రాంతాలని వెతికినా సీతమ్మ జాడ ఎక్కడా కనపడలేదు.

దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరములు వింధ్య పర్వతం దెగ్గరికి వెళ్ళి, ఆ పర్వతంలో ఉన్న చెట్లని, గుహలని, సరస్సులని, మార్గమధ్యంలో ఉన్న నదులని, పట్టణాలని, గ్రామాలని అన్వేషిస్తూ వెళుతున్నారు. అలా కొంతదూరం వెళ్ళాక నిర్జనమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ చెట్లకి ఒక పండు లేదు, ఆకులు లేవు, ఒక జంతువు కూడా కనబడడం లేదు. అక్కడ తినడానికి కనీసం మూలములు కూడా కనపడలేదు. ఒకప్పుడు కణ్డువు అనే మహర్షి ఈ అరణ్య ప్రాంతంలో ఉండేవారు. ఆయన తపఃశక్తికి దేవతలు కూడా భయపడేవారు. అటువంటి సమయంలో కణ్డువ మహర్షి కుమారుడు ఈ అరణ్యంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు కణ్డువ మహర్షికి ఈ అరణ్యంపట్ల ఒక రకమైన ఖేదం ఏర్పడి ఈ అరణ్యంలో మనుష్యులు కాని, పక్షులు కాని, చెట్లు కాని, జంతువులు కాని ఏమి ఉండవు అని శపించారు.

వాళ్ళు ఆ అరణ్యాన్ని దాటి ముందుకి వెళ్ళగా, ఒక గుహ నుండి భయంకరమైన ఆకారం కలిగిన రాక్షసుడు బయటకి వచ్చి వానరాల మీదకి పరుగులు తీశాడు. ఆ రాక్షసుడిని చూసి దేవతలు కూడా భయపడతారు. అలా వస్తున్న రాక్షసుడిని చూసిన అంగదుడు వస్తున్నది రావణుడే అనుకొని, తన శక్తినంతా కూడబెట్టి అరిచేతితో ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి రాక్షసుడి నవరంధ్రములనుండి రక్తము కారి కిందపడిపోయి మరణించాడు. అప్పుడు వారు ఆ రాక్షసుడు ఉన్నటువంటి గుహని వెతికారు, కాని ఎక్కడా సీతమ్మ జాడ కనపడలేదు.

అలా వారు ఎన్ని ప్రాంతాలని వెతికినా ఏమి ప్రయోజనం లేకపోయింది. వాళ్ళకి ఎక్కడా నీరు, ఆహారము దొరకలేదు, దాంతో వాళ్ళకి విపరీతంగా ఆకలి వేసింది. అప్పుడు వాళ్ళు తడిరెక్కలతో ఎక్కడినుంచన్నా పక్షులు వస్తున్నాయేమో అని వెతుకుతున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక బిలం నుండి తడి రెక్కలతో పక్షులు రావడం కనపడింది, వాటి వెనకాల కొన్ని జంతువులు తడి శరీరాలతో బయటకి వస్తున్నాయి. అప్పుడా వానరాలు గడ్డితో, లతలతో కప్పబడి ఉన్న ఆ బిలంలోకి ప్రవేశించారు. లోపలికి వెళితే అంతా చీకటిగా ఉంది, అందుకని ఆ వానరాలు ఒకరి చేతులని ఒకరు పట్టుకొని మెల్లగా లోపలికి వెళ్ళారు.

తీరా లోపలికి వెళ్ళి చూస్తే, అక్కడ లేని వృక్షం లేదు, అక్కడ లేని లత లేదు, చెట్లన్నీ పండ్లతో, పుష్పాలతో పరమ శోభితంగా ఉన్నాయి. ఆ చెట్లకి పెద్ద పెద్ద తేనెపట్లు ఉన్నాయి, అక్కడున్న సరోవరాలలో బంగారంతో చెయ్యబడ్డ తామరపువ్వులు వికసించి ఉన్నాయి. ఆ బంగారు పువ్వు నుండి పడిన పుప్పుడి చేత ఆ సరస్సులలోని నీరు చాలా తీయగా ఉంది. అక్కడ అంతస్తులతో కూడిన మేడలు ఉన్నాయి, ఒక అంతస్తు బంగారంతో, మరొక అంతస్తు వెండితో, మరొక అంతస్తు బంగారంతో, అలా అంతస్తులన్ని బంగారం, వెండితో తాపడం చెయ్యబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా వజ్రాలు పొదగబడ్డ బంగారు శయనాలు, ఆసనాలు ఉన్నాయి. ఆ వానరాలు ఈ ప్రాంతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ సరోవరాలలో ఉన్న నీటిని తాగి దాహం తీర్చుకున్నారు.

అప్పుడు వాళ్ళకి కొద్ది దూరంలోనే ఒక స్త్రీ కనబడింది. ఆ స్త్రీ కృష్ణాజినం కట్టుకొని, నారచీర కట్టుకొని, తేజస్సుతో, తపోశక్తితో మెరిసిపోతూ ఉంది. ఆ తల్లి దెగ్గరికి ఈ వానరాలు వెళ్ళి నమస్కరించి " మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బయట నుంచి చూస్తే చిన్న బిలంలా ఉంది, లోపలికి వస్తే ఇంత అద్భుతంగా ఉంది. అసలు ఈ గుహ ఎవరిది, ఈ మేడలు ఎవరివి. మాకు చాలా చిత్రంగా ఉంది " అన్నారు.

అప్పుడా స్త్రీ " పూర్వం దానవ రాజు దెగ్గర మయుడనే శిల్పి ఉండేవాడు. ఆ మయుడికి అనేక మాయా శక్తులు ఉన్నాయి. ఆయన బంగారంతో ఈ ప్రాంతాన్ని నిర్మించాడు. ఆ మయుడు బ్రహ్మని గూర్చి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మయుడి తపస్సుకి ప్రీతి చెందిన బ్రహ్మదేవుడు ఆయనకి విశేషమైన వరాలని ఇచ్చాడు. తదనంతరం శుక్రాచార్యుల యొక్క ధనమంతా తీసుకొచ్చి మయుడికి ఇచ్చారు. కాని ఆ మయుడు హేమ అనే అప్సరస స్త్రీ యందు మనస్సు పెట్టుకున్నాడని తెలిసి, ఇంద్రుడు ఆయనని తన వజ్రాయుధంతో సంహరించాడు. మయుడు హేమ అనే అప్సరస స్త్రీ యందు మనస్సు పెట్టుకున్నాడు కనుక, ఈ గుహలో ఉన్న సమస్త ఐశ్వర్యము కూడా హేమకి చెందుతుందని బ్రహ్మగారు తీర్పు ఇచ్చారు. అప్పుడా హేమ ఈ ఐశ్వర్యానికి కాపలాగ ఉండడానికి నన్ను నియమించింది. నేను మేరుసావర్ణి యొక్క కుమార్తెని, నా పేరు స్వయంప్రభ. నాకు స్నేహితురాలైన హేమ నృత్యమునందు, సంగీతమునందు ప్రావీణ్యము కలిగిన స్త్రి. ఆమె నన్ను పిలిచి ఈ ఐశ్వర్యాన్ని, గుహని కాపాడమని అడిగింది. స్నేహము మీద ఉన్న అనురక్తి చేత నేను ఈ గుహని కాపాడుతూ ఉంటాను. మిమ్మల్ని చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నారు కనుక మీకు కావలసిన కందమూలాలని, ఫలాలని ఆరగించండి. నీళ్ళు, తేనె కావలసినంత తాగి విశ్రాంతి తీసుకోండి. విశ్రమించిన తరువాత మీరు ఎవరో, ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు చెప్పండి " అనింది.

అప్పుడా వానరాలు కడుపునిండా కావలసిన పదార్ధాలని తిని విశ్రమించారు. అప్పుడు హనుమంతుడు స్వయంప్రభతో " దశరథ మహారాజు కుమారుడైన రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తన భార్య అయిన సీతమ్మతో, తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. కాని సీతమ్మని రావణాసురుడనే రాక్షసుడు అపహరించాడు. అపహరింపబడ్డ సీతమ్మని వెతుకుతూ వాళ్ళు కిష్కిందకి చేరుకున్నారు. అక్కడ వారు సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకున్నారు. సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నాలుగు దిక్కులకి వానరాలని పంపించాడు, సీతమ్మని వెతకడం కోసం. దక్షిణ దిక్కుకి యువరాజైన అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానర సమూహములో నేను ఒకడిని, నన్ను హనుమ అంటారు. సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం వెతుకుతున్న మాకు ఎక్కడా ఆహారం, నీరు దొరకలేదు. అటువంటి సమయంలో తడి రెక్కలతో పక్షులు ఈ గుహ నుండి బయటకి రావడం చూశాము. ఇక్కడ నీళ్ళు దొరుకుతాయనే ఆశతో మేము ఈ గుహలోకి ప్రవేశించాము. సీతమ్మ జాడ మాకు చెప్పగలవా " అని అడిగాడు.

అప్పుడా స్వయంప్రభ " ఈ గుహలోకి మృగములు తప్ప మిగిలినవి ఎవన్నా ప్రవేశిస్తే, ప్రాణాలతో బయటకి వెళ్ళడం కుదరదు. కాని మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది, అందుకని మీ అందరినీ నా తపఃశక్తి చేత బయటకి పంపిస్తాను. మీరు కళ్ళు మూసుకొని, కళ్ళ మీద చేతులు పెట్టుకోండి " అనింది.

అప్పుడా వానరాలు మృదువైన కనురెప్పల్ని మూసి, తమ మృదువైన చేతులతో ఆ కన్నులని మూసుకున్నారు. మళ్ళి ఉత్తర క్షణంలో కనులు తెరిచేసరికి వాళ్ళందరూ వింధ్య పర్వతం మీద ఉన్నారు. ఆ ప్రాంతంలోని చెట్లు పువ్వులతో, పండ్లతో శోభిల్లుతుంది. అప్పుడా స్వయంప్రభ " మీరు ఈ గుహలో 4 నెలలపాటు ఉండిపోయారు " అని చెప్పి గుహలోకి వెళ్ళిపోయింది. ( ఆ గుహలో వానరాలు గడిపింది కొంత సమయమే అయినా, ఆ గుహలో ఉన్నంత సేపు వాళ్ళకి కాలం తెలీలేదు.)

అప్పుడు అంగదుడు " మనం ఆశ్వయుజ మాసంలో బయలుదేరాము. కాని ఇప్పుడు వసంత కాలం వచ్చింది. మనని ఒక నెలలోపు తిరిగి వచ్చెయ్యమని సుగ్రీవుడు చెప్పాడు. కాని మనం కొన్ని నెలలు దాటిపోయాము. ఆలస్యం అయితే అయ్యింది కాని ఇందులో సీతమ్మ జాడ తెలిసినవాడు ఎవడన్నా ఉన్నాడా?, ఎవడూ లేడు. సుగ్రీవుడు చాలా క్రోధ స్వరూపుడు, సుగ్రీవుడు ఎలాంటివాడో నాకు తెలుసు. ఆయన నన్ను ఇష్టంగా యువరాజుని చెయ్యలేదు, రాముడు చెయ్యమన్నాడని నన్ను యువరాజుని చేశాడు. నేనంటే ఆయనకి చాలా కడుపుమంట. ఇప్పుడు నేను వెనక్కి వెళితే శత్రుత్వం తీర్చోకోవడానికి మంచి అవకాశం దొరికిందని మనందరి కుత్తుకలు కత్తిరిస్తాడు. అందుకని మనం అక్కడికి వెళ్ళద్దు, ఇక్కడే ప్రాయోపవేశం (దర్భలని{గడ్డిని} దక్షిణ దిక్కుకి ఉండేలా పరుచుకొని, తూర్పు దిక్కుకి తిరిగి ఆచమనం చేసి దానిమీద పడుకుంటారు. అప్పుడు అటుగా వెళుతున్న ఏ ప్రాణి అయినా వాళ్ళని తినచ్చు) చేసి చనిపోదాము. నేను వెనక్కి రాను " అన్నాడు.

అప్పుడు మిగిలిన వానరాలన్నీ అంగదుడి బాధ చూడలేక కళ్ళు తుడుచుకొని, మనమూ ఇక్కడ ప్రాయోపవేశం చేసేద్దాము అన్నాయి.

అప్పుడు వాళ్ళల్లో ఒకడైన తారుడు అన్నాడు " అంగదుడు చెప్పిన మాట నిజమే, మనం ఇక్కడ ప్రాయోపవేశం చేసేసి చనిపోదాము. లేదా నాకు ఒక ఆలోచన వస్తుంది, మనం ఆ స్వయంప్రభ గుహలోకి వెళ్ళిపోదాము. అందులో బోలెడన్ని చెట్లు, ఫలాలు, తేనె ఉన్నాయి. అవి తింటూ మనం అందులోనే ఉండిపోవచ్చు " అన్నాడు.

స చతుర్ణాం ఉపాయానాం తృతీయం ఉపవర్ణయన్ |
భేదయామాస తాన్ సర్వాన్ వానరాన్ వాక్య సంపదా ||

సామ, దాన, బేధ, దండోపాయములలో ఈ వానరముల మీద సామము కాని, దానము కాని, దండోపాయము కాని పనికిరాదు. అందుకని వీళ్ళ మీద బేధము అనే ఉపాయమును మాత్రమే ప్రయోగించాలి అని హనుమంతుడు అనుకొని, అంగదుడితో " నాయనా అంగదా! నువ్వు చాలా గొప్పవాడివి. ఈ రాజ్యభారాన్ని అంతా వహించగలిగిన శక్తి కలిగినవాడివి. కాని ఇవ్వాళ నీ బుద్ధియందు చిన్న వైక్లవ్యం కనిపిస్తుంది. నువ్వు ప్రాయోపవేశం చేస్తాను, లేకపోతె ఈ గుహలోకి వెళ్ళిపోతాను అంటున్నావు, నీతో పాటు ఈ మిగిలిన వానరాలు కూడా అలాగే చేస్తాము అంటున్నాయి. కాని జెరగబోయే పరిణామం ఎలా ఉంటుందో నేను చెబుతాను, నువ్వు కొంచెం ఆలోచించుకో, ఆ తరువాత నిర్ణయం తీసుకో.

ఒకవేళ మీరందరూ గుహలోకి వెళ్ళిపోయినా మీతో నేను రాను, జాంబవంతుడు రాడు, నీలుడు రాడు, సుహోత్రుడు రాడు. వెయ్యి పిడుగుల శక్తితో సమానమైన బాణములు లక్ష్మణుడి దెగ్గర చాలా ఉన్నాయి, ఒకవేళ మీరు గుహలోకి వెళ్ళినా లక్ష్మణుడి బాణాలు ఈ గుహని ముక్కలు చేస్తాయి. అప్పుడు మీరు ఎలా బ్రతుకుతారు. ఒకవేళ మీరందరూ గుహలోకి వెళ్ళినా కొంతకాలానికి మిగిలిన వానరాలకి తమ భార్యాపిల్లలు గుర్తుకొస్తారు. అప్పుడు వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు బంధువు అన్నవాడు లేకుండా ఒక్కడివే అయిపోతావు, ఆనాడు ఒక చిన్న గడ్డిపరక కదిలినా నువ్వు భయపడతావు. నువ్వు అన్నట్టు సుగ్రీవుడు అసత్యవాది కాదు, ఆయన కూడా సమ్మతించాడు కనుకనే నీకు యువరాజ పట్టాభిషేకం చేశాడు. నువ్వు తిరిగొచ్చి పరిపాలనచెయ్యి. అన్నిటినీమించి సుగ్రీవుడికి సంతానం లేదు, నువ్వే ఈ రాజ్యానికి వారసుడివి. నామాట నమ్ము, సుగ్రీవుడు నీకు ఎన్నడూ అపాయం కల్పించడు. తిరిగి వెళ్ళి జెరిగిన విషయాలని సుగ్రీవుడికి చెబుదాము " అన్నాడు.

అప్పుడు అంగదుడు " ఆనాడు మా నాన్న దుందుభిని చంపడానికని ఒక బిలంలోకి ప్రవేశించాడు. కాని సుగ్రీవుడికి రాజ్యము మీద ఉన్న కాంక్ష చేత మా నాన్న తిరిగిరాకుండా ఉండడం కోసమని ఆ బిలద్వారానికి ఒక శిలని అడ్డుపెట్టాడు. మా నాన్న బతికున్నాడని తెలిసి కూడా మా అమ్మని తన భార్యగా అనుభవించాడు. నాయందు కుమారుడన్న ప్రేమ సుగ్రీవుడికి ఎన్నడూ లేదు. నేను తిరిగొస్తే సాకు దొరికిందని నన్ను చంపుతాడు. సుగ్రీవుడి చేతిలో మరణించడం కన్నా ప్రాయోపవేశం చేసి మరణించడం నాకు ఇష్టం. మీరు వెళ్ళి నేను నా పినతండ్రికి, నా తల్లికి, నా పినతల్లికి, పెద్దలకి నమస్కారం చేశానని చెప్పండి " అని చెప్పి, ప్రాయోపవేశం చెయ్యడం కోసమని దర్భల మీద పడుకున్నాడు.

అప్పుడా మిగతా వానరాలు కూడా అంగదుడిలాగానే దర్భల మీద పడుకున్నారు. అలా కింద పడుకున్నవాళ్ళు రామ కథని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు.

సాంపాతిః నామ నామ్నా తు చిర జీవీ విహంగమః |
భ్రాతా జటాయుషః శ్రీమాన్ ప్రఖ్యాత బల పౌరుషః ||
వీళ్ళందరూ రామ కథ చెప్పుకుంటూ ఉండగా అక్కడున్న కొండ శిఖరం మీదకి ఒక పెద్ద పక్షి వచ్చింది, కాని దానికి రెక్కలు లేవు. ఆ పక్షి ఇంతమంది వానరాలని చూసి ' ఆహా ఏమి నా అదృష్టము, ఒకడిని తింటే మిగిలిన వారు పారిపోతారు, కాని వీళ్ళు ప్రాయోపవేశం చేస్తున్నారు కనుక ఎవరూ కదలరు. మెల్లగా ఒక్కొక్కరిని తినచ్చు ' అని ఆ పక్షి అనుకుంది.

ఆ వానరాలు చెప్పుకుంటున్న రామ కథ వింటున్న ఆ పక్షి గట్టిగా ఒక మాట అనింది " నా మనస్సు కంపించిపోయేటట్టుగా, నా సోదరుడైన జటాయువు రావణాసురుడి చేత వధింపబడ్డాడన్న మాట చెప్పినవాడు ఎవడురా ఇక్కడ. అసలు నా తమ్ముడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు. దశరథ మహారాజు జటాయువుకి స్నేహితుడు, దశరథుడు ఏ కారణం చేత మరణించాడు. నా రెక్కలు కాలిపోయాయి, నా అంతట నేను మీ దెగ్గర కుర్చోలేను. ఎవరన్నా వచ్చి నన్ను దించండిరా " అనింది.

కాని కింద పడుకున్న వానరాలు ఒకరితో ఒకరు " అదంతా ఒట్టిదే, మనన్ని తినెయ్యడానికి అలా అంటుంది. మనం అక్కడికి వెళితే అది మనన్ని తినేస్తుంది " అన్నారు.

వాళ్ళల్లో ఒకడు అన్నాడు " అది మనన్ని నిజంగా చంపేసిందే అనుకో, మనం ప్రాయోపవేశం చేస్తున్నాము కదా మరి దానిని తేవడానికి భయం ఎందుకు, వెళ్ళి తీసుకురండి " అన్నాడు.

అప్పడు అంగదుడు వెళ్ళి ఆ పక్షిని తీసుకొచ్చాడు. అప్పుడా వానరాలన్నీ ఆ పక్షి చుట్టూ చేరాయి. అప్పుడాయన " అసలు మా జటాయువు ఏమయ్యాడు? " అని అడిగాడు.

అంగదుడు మళ్ళి రామ కథ చెప్పడం ప్రారంభించాడు. అంగదుడు రామ కథ మొత్తం చెప్పి ' నువ్వు ఎవరు? ' అని ఆ పక్షిని ప్రశ్నించాడు.

అప్పుడా పక్షి " సంపాతి అనబడే నేను, జటాయువు సోదరులము. సూర్యుడు ఉదయించినప్పటినుంచి అస్తమించేలోపు ఆయనతో సమానంగా ప్రయాణం చెయ్యాలని మేము ఒకనాడు పందెం కాసుకున్నాము. అనుకున్న ప్రకారం నేను, జటాయువు సూర్యుడి వెనకాల వెళ్ళిపోతున్నాము. అలా వెళుతుండగా మిట్ట మధ్యాహ్నం వేళ మేము సూర్యుడికి దెగ్గరగా వచ్చాము. అప్పుడా సూర్యుడి వేడిని భరించలేక జటాయువు స్పృహతప్పి కిందపడిపోతున్నాడు. పెద్దవాడిని కనుక తమ్ముడిని రక్షించాలని నేను నా రెక్కలని జటాయువుకి అడ్డంగా పెట్టాను. అప్పుడా సూర్యుడి వేడికి నా రెక్కలు కాలిపోయి వింధ్య పర్వతం మీద పడిపోయాను. కాని నా తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలీలేదు. మళ్ళి ఇంతకాలానికి మీవల్ల నా తమ్ముడి గురించి విన్నాను. నా తమ్ముడు చనిపోయాడన్న వార్త వినడం వల్ల నాకు చాలా బాధ కలుగుతోంది. చనిపోయిన నా తమ్ముడికి జలతర్పణ ఇవ్వాలి అనుకుంటున్నాను, కాని నేను ఎగరలేను. మీరు నన్ను తీసుకెళ్ళి ఆ సముద్ర జలాల దెగ్గర దింపండి, నేను నా తమ్ముడికి తర్పణలు ఇస్తాను " అన్నాడు.

సంపాతి కోరిక మేరకు వాళ్ళు ఆయనని సముద్ర తీరానికి తీసుకువెళ్ళారు, ఆయన అక్కడ జటాయువుకి తర్పణలు సమర్పించాడు.

మళ్ళి వెనక్కి తిరిగొచ్చాక ఆ వానరాలు సంపాతితో " జటాయువు రామకార్యంలో సహాయం చేశాడు, నువ్వు కూడా రామకార్యంలో ఏమన్నా సహాయం చెయ్యగలవా. నీకు సీతమ్మ జాడ ఏమన్నా తెలుసా " అని అడిగారు.

నిర్దగ్ధ పక్షో గృధ్రో అహం గత వీర్యః ప్లవం గమాః |
వాఙ్ మాత్రేణ తు రామస్య కరిష్యే సాహ్యం ఉత్తమం ||
అప్పుడా సంపాతి " రెక్కలు కాలిపోయాయి నాకు, ఇవ్వాళ ఇలా పడి ఉన్నాను, ఇంతకన్నా ఏమి చెయ్యగలను. కాని రామకార్యానికి నేను మాటమాత్రం సహాయం చేస్తాను. సీతమ్మని రావణుడు ఆకాశ మార్గంలో తీసుకెళుతున్నప్పుడు ఆమె ఆభారణాలని కొంగుకి చుట్టి విడిచిపెట్టడం నేను చూశాను. ఆ రావణాసురుడు విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడు, సాక్షాత్తు కుబేరుడి తమ్ముడు. ఆయన లంకా నగరానికి అధినేత. ఈ సముద్రానికి దక్షిణ దిక్కున 100 యోజనముల అవతల లంక ఉంటుంది. ఆ లంకలో ఎక్కడ చూసినా బంగారు స్తంభములతో నిర్మింపబడ్డ భవనాలు ఉంటాయి. అటువంటి లంకా నగరంలో దీనురాలై, పచ్చని పట్టు పుట్టం కట్టుకుని, ఏడుస్తూ, చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా సీతమ్మ ఉంది. నాకు ఇవన్నీ ఎలా తెలుసని అడుగుతారేమో, నేను ఇక్కడే కూర్చుని సీతమ్మని చూడగలను. నేను దివ్య దృష్టితో చూడగలను, మాకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే, భూమి నుండి ఆకాశానికి కొన్ని అంతరములు ఉన్నాయి. మొదటి అంతరములో తమ కాళ్ళ దెగ్గర ఉన్న ధాన్యాన్ని ఏరుకొని తినే కులింగములు అనే పక్షులు ఎగురుతాయి. రెండవ అంతరంలో చెట్ల మీద ఉండే ఫలాలని తినే పక్షులు ఎగురుతాయి. మూడవ అంతరంలో భాసములు, క్రౌంచములు ఎగురుతాయి. నాలుగవ అంతరంలో డేగలు ఎగురుతాయి. అయిదవ అంతరంలో గ్రద్దలు ఎగురుతాయి. ఆరవ అంతరంలో హంసలు ఎగురుతాయి. ఏడవ అంతరంలో వినతా పుత్రులమైన వైనతేయులము కాబట్టి మేము ఎగురుతాము. అందుకని మేము తినే తిండి చేత, సహజంగా మేము జన్మించిన జాతి చేత 100 యోజనముల అవతల ఉన్న విషయాన్ని కూడా ఇక్కడే ఉండి చూడగల దృష్టిశక్తి మా కంటికి ఉంటుంది.

అదుగో దూరంగా లంకా పట్టణంలో, అశోక వనంలో సీతమ్మ కూర్చుని ఉండడం నాకు కనిపిస్తుంది. మీలో ఎవరైనా సాహసం చేసి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలిగిన వాడు ఉంటె, సీతమ్మ యొక్క దర్శనం చెయ్యవచ్చు.
తీక్ష్ణ కామాః తు గంధర్వాః తీక్ష్ణ కోపా భుజంగమాః | 
మృగాణాం తు భయం తీక్ష్ణం తతః తీక్ష్ణ క్షుధా వయం ||
గంధర్వులకి కామం ఎక్కువ, పాములకి కోపం ఎక్కువ, మృగాలకి భయం ఎక్కువ, పక్షులకి ఆకలి ఎక్కువ. అందుకని నాకు ఆకలి ఎక్కువగా ఉండేది, కాని వెళ్ళి తిందామంటే నాకు రెక్కలు లేవు. నా కొడుకైన సుపార్షుడు రోజూ వెళ్ళి ఆహారం తీసుకోచ్చేవాడు. కాని ఒకనాడు ఆహారం తీసుకురావడానికి వెళ్ళిన నా కొడుకు ఎంతసేపటికీ వెనక్కి రాలేదు. కడుపు నకనకలాడుతూ నేను ఎదురుచూస్తున్నాను. ఇంతలో ఒట్టి చేతులతో నా కొడుకు వచ్చాడు, అది చుసిన నాకు కోపం వచ్చి నా కొడుకుని నిందించాను. అప్పుడు సుపార్షుడు అన్నాడు ' నాన్నగారు! నా దోషంలేదు, నేను పొద్దున్నే వెళ్ళి సముద్రంలో ఉన్న మహేంద్రగిరి పర్వతం మీద కూర్చొని సముద్ర జలాలలోకి చూస్తున్నాను, ఏదన్నా పెద్ద ప్రాణి కనపడగానే తీసుకొచ్చి మీకు పెడదాము అనుకున్నాను. కాని ఇంతలో ఆకాశంలో, నల్లటి స్వరూపంతో ఉన్న రాక్షసుడు, మెడలో తెల్లటి ముత్యాల హారం వేసుకొని, తెల్లటి బట్ట కట్టుకొని వెళుతున్నాడు. మేఘం మీద మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో, అలా ఒక స్త్రీ అతని చేతులలో తన్నుకుంటుంది. హ రామ, హ లక్ష్మణా అని అరుస్తుంది. నేను వాడిని చూసి మంచి ఆహారం దొరికింది అనుకున్నాను. కాని వాడు నా దెగ్గరికి వచ్చి నమస్కరించి ' మహానుభావ! నాకు దారి విడిచిపెట్టవయ్య ' అన్నాడు. ఎంతటివాడైన అలా బతిమాలుతు సామంతో మాట్లాడితే, ఇంగిత జ్ఞానం ఉన్నవాడెవడు అటువంటివాడిని దిక్కరించకూడదు కదా, అందుకని నేను వాడిని వదిలిపెట్టేశాను. కాని వాడు వెళ్ళిపోగానే ఆకాశంలో దేవగణాలు, ఋషిగణాలు నా దెగ్గరికి వచ్చి ' అదృష్టవంతుడివిరా బతికిపోయావు, వాడు దుర్మార్గుడు, వాడి పేరు రావణాసురుడు. వాడు చాలా బలవంతుడు, వాడికి విశేషమైన వరాలు ఉన్నాయి ' అని చెప్పి వెళ్ళారు.

ఈ విషయాన్ని నా కొడుకు చెప్పడం వల్ల నాకు సీతమ్మ గురించి తెలిసింది. సీతమ్మని రావణాసురుడే అపహరించి లంకకి తీసుకువెళ్ళాడు.

నేను వింధ్య పర్వత శిఖరం మీద రెక్కలు కాలిపోయి పడినప్పుడు 6 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాను. 6 రోజుల తరువాత తెలివొచ్చింది. నా తమ్ముడు ఎటో ఎగిరిపోయాడు, నాకేమో రెక్కలు కాలిపోయాయి, అందుకని ఆ పర్వతం మీద నుండి కిందకి దూకి మరణిద్దాము అనుకున్నాను, కాని ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. మా ఇద్దరికీ రెక్కలు ఉన్న రోజుల్లో నేను నా తమ్ముడు కామరూపులము కాబట్టి మనుష్య రూపాన్ని పొందేవాళ్ళము. అక్కడ ఉండేటటువంటి నిశాకర మహర్షి పాదములకు నమస్కారం చేస్తుండేవాళ్ళము. అందుకని ఒక్కసారి ఆ మహర్షి పాదాలకి నమస్కరించి ప్రాణాలు విడిచిపెడదాము అనుకొని మెల్లగా డేకుతూ ఆ మహర్షి ఉండే ఆశ్రమానికి వచ్చాను. అప్పుడా మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఎలా ఉందంటే, అభిషేకం చెయ్యబడ్డ బ్రహ్మగారు వెళుతున్నట్టు ఉన్నారు. బ్రహ్మగారి చుట్టూ ప్రాణులన్నీ ఎలా చేరుతాయో, అలా నిశాకర మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఆయన చుట్టూ ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, పాములు చేరి ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళగానే ఆ మృగాలన్నీ వెళ్ళిపోయాయి. తరువాత ఆయన బయటకి వచ్చి నన్ను చూసి ' నిన్ను చాలాకాలం నుండి చూస్తున్నాను, నువ్వు, నీ తమ్ముడు వచ్చి నాకు నమస్కారం చేసేవారు కదా. నువ్వు రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావేంటి ' అని అడిగారు. అప్పుడు నేను జెరిగిన కథంతా చెప్పాను. అప్పుడాయన అన్నారు ' సంపాతి! బెంగ పెట్టుకోకు, భవిష్యత్తులో నీ వల్ల ఒక మహత్కార్యం జెరగవలసి ఉంది. నువ్వు కొంతకాలానికి సీతాపహరణాన్ని చూస్తావు. ఈ సీతమ్మని అన్వేషిస్తూ వానరులు వస్తారు. వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి. నేను నీకు అభయం ఇస్తున్నాను, అలా చేస్తే నీ కాలిపోయిన రెక్కలు మళ్ళి వస్తాయి. నాకు కూడా రామలక్ష్మణులను చూడాలని ఉంది, కాని అంతకాలం ఈ శరీరంలో ఉండాలని నాకు లేదు, ఈ శరీరాన్ని విడిచిపెట్టేద్దాము అనుకుంటున్నాను. నువ్వు మాత్రం ఈ కొండమీదే వేచి ఉండు.

నీకు ఇంకొక విషయం చెబుతాను, సీతమ్మని అపహరించిన తరువాత ఆమెని వశం చేసుకుందామని రావణాసురుడు తన అంతఃపురం చూపిస్తాడు, దివ్యమైన భోజనము పెడతాడు. కాని ఆ తల్లి కన్నెత్తి కూడా చూడదు, ఒక మెతుకు ముట్టదు. ఆ తల్లికోసం దేవేంద్రుడు ప్రతి రోజూ దేవతలు కూడా చూడనటువంటి దివ్యమైన పాయసాన్ని పంపిస్తాడు. కాని సీతమ్మ ఆ పాయసాన్ని తినదు. ఆమె, పైన ఉన్న పాయసాన్ని తీసి ఈ భూమండలంలో ఎక్కడైనా సరే రామలక్ష్మణులు బతికుంటే, ఈ పాయసం వారికి చెందుగాక, ఒకవేళ రామలక్ష్మణులు శరీరాలని విడిచిపెట్టి ఉంటె, ఉర్ధలోకములలో ఉన్నవాళ్ళకి ఈ పాయసం చెందుగాక, అని భూమి మీద పైన ఉన్న పాయసాన్ని పెడుతుంది. ఆ సీతమ్మ తిన్న అన్నం రావణుడు పెట్టినది కాదు. ఈ విషయాన్ని ఆ వానరులు వచ్చాక వాళ్ళకి చెప్పు ' అని ఆనాడు నిశాకర మహర్షి నాకు చెప్పారు. అందుకని కొన్ని వేల సంవత్సరముల నుండి ఇలా బతికి ఉన్నాను.

తస్య తు ఏవం బ్రువాణస్య సంహతైః వానరైః సహ ||
ఉత్పేతతుః తదా పక్షౌ సమక్షం వన చారిణాం ||
సంపాతి ఈ మాటలని వానరాలకి చెప్పగానే కాలిపోయిన ఆయన రెక్కలు మళ్ళి పుట్టాయి. అప్పుడాయన తన ఎర్రటి రెక్కలని అటూ ఇటూ ఊపి చూసుకున్నాడు. ఆనందంతో ఆ సంపాతి ఆకాశంలోకి ఎగిరిపోయాడు.

ఇంక అక్కడున్న వానరాలకి ఇది చూడగానే చాలా సంతోషంవేసింది. సముద్రాన్ని దాటుదామని వాళ్ళందరూ కలిసి సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు " ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళగలిగినవాడు ఎవడు. మిగిలిన వానర జాతికి ఎవడు ప్రాణప్రదానం చెయ్యగలిగినవాడు. ఈ సముద్రం దెగ్గర నిలబడిపోయిన వానరాలు సంతోషంగా తిరిగి వెళ్ళి తమ భార్యాపిల్లలని చూసేటట్టు చెయ్యగలిగినవాడు ఎవడు. ఎవరివల్ల ఈ కార్యం జెరుగుతుంది, ఎవరు అంతటి సమర్ధుడు " అని అడిగారు.

అప్పుడు శరభుడు లేచి, నేను 30 యోజనములు వెళతాను అన్నాడు, అలాగే ఋషభుడు 40 యోజనములు వెళతాను అన్నాడు, గంధమాదనుడు 50, మైందుడు 60, ద్వివిదుడు 70, సుషేణుడు 80. అప్పుడు జాంబవంతుడు లేచి అన్నాడు " నేను యవ్వనంలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉండేవాడిని. పరమేశ్వరుడు త్రివిక్రమావతారంతో(వామన) పెరిగిపోతుంటే నేను ఆయనకి 21 సార్లు ప్రదక్షిణ చేశాను. కాని ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను, నేను ఇప్పుడు 90 యోజనాలు ఎగరగలను " అన్నాడు.

అప్పుడు అంగదుడు అన్నాడు " నేను 100 యోజనాలు వెళ్ళగలను, కాని తిరిగి మళ్ళి ఈ 100 యోజనాలు రాలేను " అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు " అయ్యో, అది మహా పాపం. ప్రభువు వెళ్ళి పని చేస్తుంటే, ఆయనని సేవించేవారు హాయిగా కూర్చుంటే అది చాలా అసహ్యంగా ఉంటుంది. నువ్వు వెళ్ళకూడదు, నువ్వు మాకు పనిని పురమాయించాలి. ఎవరిని పంపాలో నాకు తెలుసు, వాడిని నేను పంపిస్తాను, మీరందరూ చూడండి " అని ఒక్కడిగా కూర్చున్న హనుమంతుడి దెగ్గరికి వెళ్ళి " ఏమయ్యా హనుమా! ఏమి తెలియని వాడిలా ఇలా కూర్చున్నావు. ఒకానొకప్పుడు అప్సరసలలో శ్రేష్టురాలైన పుంజికస్థల అనబడే ఒక అప్సరస శాపవశం చేత కుంజరుడు అనే వానరానికి కుమార్తెగా జన్మించింది. ఆమెకి అంజనా అని పేరు పెట్టారు. ఆమె నీ తండ్రి అయిన కేసరి యొక్క భార్య. నీ తల్లి కామరూపి అవడంచేత ఒకనాడు మనుష్య రూపం దాల్చి ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. వాయువు ఆమెని చూసి మోహించి, తన దీర్ఘమైన బాహువుల చేత గట్టిగా కౌగలించుకున్నాడు. అప్పుడా తల్లి ' ఎవడురా దుర్మార్గుడు నా పాతివ్రత్యాన్ని చెరప చూస్తున్నవాడు ' అనింది. అప్పుడా వాయువు అన్నాడు ' అమ్మా! బ్రహ్మగారు మా తేజస్సులని వానర స్త్రీలయందు ప్రవేశపెట్టి వానరాలని సృష్టించామన్నారు. అందుకని నీ పాతివ్రత్యానికి భంగం కలగకుండా గొప్ప పరాక్రమము ఉన్నవాడు, బుద్ధిమంతుడు, నాతో సమానంగా దూకగలిగినవాడు, ఎగరగలిగినవాడైన పుత్రుడు కేవలం నిన్ను నేను మానసికముగా చూసినంత మాత్రాన నీ కడుపుయందు జన్మించనున్నాడు ' అన్నాడు. ఆ కారణం చేత నువ్వు జన్మించావు.

నువ్వు పుట్టగానే ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి తినే ఫలం అనుకొని ఆయనని పట్టుకోబోయావు. సూర్య పధానికి అడ్డు వస్తున్నావని కోపమొచ్చి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే, నీ ఎడమ దవడ చొట్టపడి కింద పడ్డావు. సొట్టపడ్డ హనుములు కలిగినవాడివి కనుక నిన్ను హనుమ అని పిలిచారు. నువ్వు అలా పడిపోవడం చేత నీ తండ్రి అయిన వాయుదేవుడికి కోపం వచ్చి భూమిమీద వీచడం మానేశాడు. అప్పుడు బ్రహ్మగారు పరుగు పరుగున వచ్చి, గాలి వీచకపోతే సృష్టి ఆగిపోతుందని " హనుమా! ఏ అస్త్రము చేత, ఏ శస్త్రము చేత నిన్ను ఎవరూ బంధించలేరు " అని వరం ఇచ్చారు. అలాగే ఇంద్రుడు నీకు స్వచ్ఛంద మరణ వరం ఇచ్చాడు. నీ అంత నువ్వు సంకల్పం చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి కాని, నిన్ను పడగొట్టగలిగే పురుషుడు ఈ బ్రహ్మాండంలో ఎక్కడా ఉండడు.

నేను ఎన్నో సందర్భాలలో సముద్రంలో ఉన్న పాముల్ని గరుగ్మంతుడు తన్నుకుపోతుండగా చూశాను. నీ తండ్రి అయిన వాయుదేవుడు ప్రభంజనుడై వీస్తే పెద్ద పెద్ద చెట్ల యొక్క కొమ్మలని విరిచేస్తాడు. అటువంటి శక్తిమంతుడైన వాయుదేవుడి కుమారుడవైన నీకు ఆ గమన శక్తి ఉంది, గరుగ్మంతుడికి ఆ గమన శక్తి ఉంది. ఇవ్వాళ కొన్ని కోట్ల వానరముల భవిత, సౌభాగ్యము, ప్రాణములు నీ చేతులలో ఉన్నాయి. నీ వీర్యమును, తేజస్సును, పరాక్రమమును ఒక్కసారి పుంజుకో. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటి సీతమ్మ జాడ కనిపెట్టి ఇక్కడికి రా. హనుమా! నీ శక్తిని చూపించు " అని జాంబవంతుడు అన్నాడు.

జాంబవంతుడి మాటలు విన్న హనుమంతుడు మేరు పర్వతం పెరిగినట్టు తన శరీరాన్ని పెంచేశాడు. గుహలో నుండి సింహం ఆవలిస్తూ బయటకి వస్తుంటే దానిని చూసిన ప్రాణులు భయంతో ఎలా నిలబడిపోతాయో, అలా అప్పటివరకూ తమతో తిరిగిన హనుమంతుడు అటువంటి స్వరూపాన్ని పొంది, ఒక్కసారి ఆవలించి, బాహువులని పైకి ఎత్తి ఒక్కసారి విదిల్చి భూమి మీద కొట్టేసరికి వానరములన్నీ భయపడిపోతూ, శ్రీమహా విష్ణువు దర్శనం అయితే ఎలా నిలబడతారో అలా హనుమంతుడిని చూసి అంజలి ఘటించి నిలబడిపోయారు.

అప్పుడు హనుమంతుడు అక్కడ ఉన్న వృద్ధులైన వానరాలకి నమస్కరించి " నా తండ్రి వాయుదేవుడు, ఆయన అగ్నిదేవుడి యొక్క సఖుడు. వాయుదేవుడు ఎటువంటి గమనంతో వెళతాడో నేను అటువంటి గమనంతో వెళతాను. నేను వెళుతున్నప్పుడు నాకు అడ్డొచ్చిన ఏ ప్రాణినైనా నా వక్షస్థలంతో గుద్ది చంపేస్తాను. పర్వతాలని చూర్ణం చేస్తాను, సముద్రాల్ని కలయ తిప్పుతాను. నా బాహువుల శక్తి చేత ఈ సముద్రాన్ని తిరగ తోడుతాను. 100 యోజనములే కాదు 10,000 యోజనములైనా సరే కొన్ని వేల మార్లు అటువైపు నుండి ఇటువైపుకి వెళతాను. సూర్యుడు ఉదయిస్తుండగా భూమి నుండి ఆకాశంలోకి వెళతాను, సూర్యుడి సమీపంలో నిలబడి నమస్కారం చేస్తాను. సూర్యుడు అస్తమించడానికి పశ్చిమ దిక్కుకి వెళుతుంటే ఆయన దెగ్గరికి వెళ్ళి మళ్ళి నమస్కరించి వస్తాను. గరుగ్మంతుడు సముద్రం మీద తిరుగుతుండగా ఆయనకి కొన్ని వేలసార్లు ప్రదక్షిణం చేస్తాను. ఇక్కడ నుండి లేచి దక్షిణ దిక్కున ఉన్న సముద్రాన్ని ముట్టుకుంటాను. రావణాసురుడిని కొట్టి చంపేస్తాను, లేదా లంకని ఫెల్లఘించి చేతితో పట్టి సముద్రానికి ఈవలి ఒడ్డుకి తీసుకువచ్చి రాముడి పాదాల దెగ్గర పడేస్తాను. ఇక నా పరాక్రమము ముందు నిలబడగలిగినవాడు లేడు. బ్రహ్మగారు, దేవేంద్రుడు చెరొక ఆసనం మీద కుర్చూని మధ్య ఆసనంలో అమృతాన్ని పెడితే, ఇద్దరి మధ్యలోకి వెళ్ళి, చెరొక చేతితో ఇద్దరినీ అడ్డగించి అమృతాన్ని తీసుకురాగలను. ఈ భూమి నన్ను తట్టుకోలేకపోతుంది, అందుకని మహేంద్రగిరి పర్వతం మీద నుంచి బయలుదేరతాను " అన్నాడు.

అలా హనుమంతుడు ఆ మహేంద్రగిరి పర్వతాన్ని ఎక్కుతుంటే, అక్కడున్న గంధర్వులు, విద్యాధరులు ఎగిరి పారిపోయారు. అనిల కుమారుడి పద ఘట్టనకి ఆ పర్వతం కంపించిపోయింది, చెట్లు నేలరాలిపోయాయి, మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయాయి. హనుమంతుడిని చూసిన వానరాలు " 
మహానుభావ! ఋషుల యొక్క ఆశీర్వచనము చేత, గురువుల యొక్క ఆశీర్వచనము చేత, దేవతల యొక్క ప్రభావము చేత ఏ విధమైన ప్రతిబంధకము లేకుండా 100 యోజనముల సముద్రాన్ని దాటి సీతమ్మ జాడ కనిపెట్టి తిరిగి నువ్వు ఎప్పుడు వస్తావ అని ఒంటి పాదం మీద నిలబడి ఉంటాము. ఇన్ని కోట్ల వానరాలకి ప్రాణము పెట్టిన వాడిగా కీర్తి గడించెదవుగాక. నీకోసం పుణ్య కర్మలను చేస్తూ ఇక్కడ నిలబడి ఉంటాము " అన్నారు.

హనుమంతుడు మానసిక ఉత్సాహమును పొంది లంకా పట్టణాన్ని మనస్సుతో చేరిపోయి ఉన్నాడు