Friday 27 December 2019

చక్కని మెసేజ్.
అమ్మ అనే పిలుపులో ఆప్యాయత ఉంది.
నాన్న అనే పిలుపులో నమ్మకం ఉంది.
తాత అనే పిలుపులో తన్మయత్వం ఉంది.
అమ్మమ్మ అనే పిలుపులు అభిమానం ఉంది.
నానమ్మ అనే పిలుపులో నవ్వు ముఖం ఉంది.
అత్త అనే పిలుపులో ఆదరణ ఉంది.
మామ అనే పిలుపులో మమకారం ఉంది.
బాబాయ్ అనే పిలుపులో బంధుత్వం ఉంది.
చిన్నమ్మ అనే పిలుపులో చనువు ఉంది.
అన్నా అనే పిలుపులో అభయం ఉంది.
చెల్లి అనే పిలుపులో చేయూత ఉంది.
తమ్ముడు అనే పిలుపులో తీయదనం ఉంది.
అక్క అనే పిలుపులో అనురాగం ఉంది.
బావా అనే పిలుపులో బాంధవ్యం ఉంది.
వదినా అనే పిలుపులో ఓర్పు ఉంది.
మరదలు అనే పిలుపులో మర్యాద ఉంది.
మరిది అనే పిలుపులో మానవత్వం ఉంది.
గురువు అనే పిలుపులో గౌరవం ఉంది.

మిత్రులారా!
నేడు మనం కట్టే బట్ట, చదివే చదువు, తినే తిండి అన్ని పరాయి పోకడలను అనుసరిస్తున్నాయి.

  • కనీసం పిలుపులో నయినా  మన అచ్చ తెలుగులో పిలుచుకుందాం బంధాలను నిలబెట్టుకుందాం.....!


 🕉🕉🕉🕉🕉🕉


🌸 *పరమాత్మ ను చేరే సులభ మార్గాలు.* 🌸

పరమాత్మ సకల జీవరాసులలో అంతర్యామి గా కొలువైఉన్మాడు అన్నది శాశ్వత సత్యం. అది మనకి ఎరుక లేకపోతే అది మన అజ్ఞానం. ఆ పరమాత్మ ని చేరాలంటే నాలుగు విషయాలలో ఎరుక తో ఉండి మనము ఆచరించాలి.

*అవి*:

🌷 *1) సంతోషం:-*

మనతో ఉన్నత స్థితిలో ఉన్నవారి పట్ల మనం ఈర్ష అసూయలతో ఉంటాం, కానీ మనము సంతోషం తో ఉండాలి అటువంటి సందర్భంలో.

🌷 *2) కరుణ:*

మన చుట్టూ ఉన్నవారు కష్టాలతో ఉంటే మనకి చెప్పారాని ఆనందము. కానీ ఇలాంటి సందర్భములొ కావాల్సింది కరుణ.

🌷 *3) స్నేహము:*

మనతో సమానముగా ఉన్నవారి పట్ల మనకు పోటీ తత్వం ఉంటుంది. కానీ దీని బదులు స్నేహం ఉండాలి. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం.

🌷 *4) ఉపేక్ష:*

మన చూట్టూ ఉన్నవారు పాపాలు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నవారు అయితే మనము వారి వెంటపడి వారిని మార్చే ప్రయత్నం లో నిరంతర జ్ఞాన బోధ చేస్తాం. కానీ పాపం వారు వినిపించుకునే దశలో ఉండరు. కానీ ఇలాంటి వారి పట్ల మనకి కావాల్సినది ఉపేక్ష. ఎందుకంటే సమయమే వారిలో మార్పు తెస్తుంది. మన ఇతిహాసాలు ఈ సత్యం నే చెప్తాయి.

చూశారా
సంతోషము, స్నేహము, కరుణ, ఉపేక్ష అన్నవి నిజముగా పరమాత్మ దగ్గరకు మనని చేరుస్తాయి.

బుద్ధ జయంతి సందర్భంగా ఆ మహానుబావుడి భోదల నుంచి గ్రహించి వ్రాసినది.

🙏🏻🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻


🕉🕉🕉🕉🕉🕉

--(())--
నేనుమొన్న
 పెట్టిన పోస్ట్ కి చి"రాధ కృష్ణ శాస్త్రీ సేకరించిన 15రాగాలపేర్లు గమనించగలరు.చి"రాధాకృష్ణ శాస్త్రీకి ఆశీస్సులు అభినందనలు ఇంత చిన్నవయసులోనే సంగీతంమీదున్న ఆసక్తి ఎంతైన ప్రశంసనీయం

అంబాపారాకు     నాటరాగం
అవతరించువయ్య  శ్రీ రాగం
రావోరావో       ...   కాంభోజి
చెలువారు          అఠాణ
తగదిదితగదిది   వసంత
ఈశునిదాసుగా  రీతి గౌళ
కానిపనిమదనా  బేగడ
చిలుకటటడి      సరస్వతి
సామగ సామగ  హిందోళ
ఇంతర్ లూడు  హంసధ్వని
విరులనియపూజ  సావేరి
అం బాయని          సామ
మనమే                  సామ
బిడియపడి   మధ్యమావతి
మంగళం          సురటి
-
-(())--
*మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాసేస్తాడు కాదా,*
*మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది.*

అయితే బ్రహ్మ నుదుటిని రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాసాడంట.
నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను.
మీరు మీ ఉపాసనలతోటి, మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాసారంట.
అర్చనలు, ఉపాసనలు కర్మఖాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడతున్నాను అని తెలిపారు.

ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్ళు ఆయువు రాస్తే, ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆవ్యక్తి ఆయువు తగ్గుతుంది.

ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూర్చుకునే శక్తి కూడా మనకి కర్మఖాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు.
పురాణాలు శ్రద్దగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది.

పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు,
ఇతనికి 50 వ ఏట మరణ గండం ఉంది. ఆ మరణ గండాన్ని ఎవ్వరు తప్పించలేరని రాసాడు బ్రహ్మ.

అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి, గురువు చెప్పినట్టు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసినవాడు బ్రతికాడు.

జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి  జాతక రీత్యా వీడు చచ్చిపోవాలండి, కాని బ్రతికాడని అనుకుంటే…
అప్పుడు వశిష్ట మహర్షి ఇలా అన్నాడు…

 ఇతనికి జాతక రీత్యా చావు ఉన్నప్పటికి గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయట పడ్డాడని చెప్పాడు.

కాబట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చడు గాని, మనం ఇలా పురాణాలను శ్రద్దగా వినడం, మంత్రాలను చదవడం, ప్రదక్షణలు చేయడం వలన చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది.

ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండిటిని స్మరించాలి.
అమ్మ పాదాలను స్మరించడం వలన బ్రహ్మ వంటి దేవతలను మనకు సేవకులను చేస్తుంది.

128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు, ద్రౌపతిని జుట్టుపట్టి దుశ్యాసునితో ఈడ్పించడం వలన చేసిన పాపానికి 60 వ ఏట చనిపోయాడు.

కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ, బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు.
అదే పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతికినవాళ్ళు ఉన్నారు.

*అందుకని ఏ కష్టం వచ్చిన బ్రహ్మ నాకు ఇలా రాసాడు అని కృంగిపోకుండా… ఆ రాతను మార్చుకోవడానికి పూజలు, దానాలు, ధర్మాలు, పేదలకు సహాయం చెయ్యండి.*

ఈ విషయం అందరికి తెలియజేసి కొంత మీరు కూడా పుణ్యం మూట కట్టుకోండి.

No comments:

Post a Comment