Friday 22 May 2020





శ్రీ మదగ్ని మహాపురాణము - 15 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 6
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అయోధ్యకాండ వర్ణనము - 4 🌻


సుప్తం మత్వాథ కౌసల్యా సుప్తా శోకార్తమేవ సా | సుప్రభాతే శయానం తం సూతమాగధబన్దినః. 41

ప్రబోధకా బోధయన్తి న చ బుధ్యత్యసౌ మృతం | కౌసల్య తం మృతం జ్ఞాత్వా హా హాతాస్మీతి చాబ్రవీత్‌.

అతడు శోకపీడితుడై నిద్రించినా డని తలచి కౌసల్య నిద్రించెను. ప్రాతఃకాలమున సూతమాగధబందులు మేల్కొలుపుటకై వచ్చి శయనించి ఉన్న ఆతనిని మేల్కొలిపిరి. మరణించిన ఆతడు లేవలేదు. ఆతడు మరణించినా డని గ్రహించి కౌసల్య ''అయ్యో! చచ్చితిని '' చచ్చితిని అనుచు ఏడ్చెను.

నరా నార్యో7థ రురుదురానీతో భరత స్తదా | వసిష్ఠాద్యైః సశత్రుఘ్నః శీఘ్రం రాజగృహాత్‌ పురీమ్‌. 43

పురుషులును స్త్రీలును ఏడ్వ మొదలిడిరి. వసిష్ఠాదులు మేనమామ ఇంటిలోనున్న శత్రుఘ్న సమేతుడైన భరతుని శీఘ్రముగా ఆయోధ్యకు రప్పించిరి.

దృష్ట్వా సశోకాం కైకేయీం నిన్దయామాస దుఃఖితః | అకీర్తిః పతితా మూర్థ్ని కౌసల్యాం స ప్రశస్య చ. 44

పితరం తైలద్రోణిస్థం సంస్కృత్య సరయూతటే | వసిష్ఠాద్యైర్జన్తెక్తో రాజ్యం కుర్వితి సో7 బ్రవీత్‌. 45

శోకముతో నిండిన ఆ నగరిని చూచి, దుఃఖితుడై, బరతుడు ''అపకీర్తి వచ్చి నెత్తిమీద పడినది కదా!'' అని కై కేయిని నిందించెను. కౌసల్యను ప్రశంసించి, నూనె తొట్టెలో పెట్టిన తండ్రికి సరయూనదీ తీరమున సంస్కారము చేసెను. ''రాజ్యము చేయుము' అని వసిష్ఠాదులు పలుకగా ఇట్లనెను.

వ్రజామి రామమానేతుం రామో రాజా మతో బలీ | శృఙ్గిబేరం ప్రయాగం చ బరద్వాజేన భోజితః. 46

నమస్కృత్వ భరధ్వాజం రామం లక్ష్మణమాగతః | పితా స్వర్గం గతో రామ అయోధ్యాయాం నృపో భవ.

అహం వనం ప్రయాస్యామి త్వదాదేశ ప్రతీక్షక ః | రామః శ్రుత్వా జలం దత్వా గృహీత్వా పాదకే వ్రజ. 48

రాజ్యయాహం న యాస్యామి సత్యాచ్చీరజటాధరః | రామోక్తో భరతశ్చాయాన్నన్దిగ్రామే స్థితో బలీ. 49

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే రామాయణ యోధ్యాకాణ్డ వర్ణనం నామ షష్ఠోధ్యాయః.

రాముని తీసికొని వచ్చుటకు వెళ్లెదను. బలశాలియైన రాముడే ఆందరిచేత రాజుగా అంగీకరింపబడినవాడు. శృంగి చేరము వెళ్ళి, అచ్చటినుండి ప్రయాగవెళ్ళి భరద్వాజుని విందు స్వీకరించి భరద్వాజునికి నమస్కరించి రామలక్ష్మణుల వద్దకు చేరెను. ''రామా! మన తండ్రిగారు స్వర్గస్థులైనారు. నీవు అయోధ్యలో రాజువగుము. 

నేను నీ ఆదేశమును ఎదురు చూచుచు వనమునకు వెళ్లెదను '' అని పలికెను. రాముడా మాటలు విని తండ్రికి తర్పణములు చేసి, భరతునితో ఇట్లనెను. ''నీవు పాదుకలు తీసికొని వెళ్ళుము. 

సత్యపాలనమునకై జటలను నార చీరలును ధరించిన నేను రాజ్యము చేయుటకై రాను.'' రాముడు ఈ విధముగా పలుకగా భరతుడు తిరిగి వెళ్ళి, అయోధ్యను విడచి, నందిగ్రామములో నివసించుచు, ఆ పాదుకలను పూజించుచు రాజ్యమును పాలించెను.

ఆగ్ని మహాపురాణములో రామాయనకథలోని అయోధ్యాకాండ వర్ణన మను షష్ఠాధ్యాయము సమాప్తము.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment