Friday 22 May 2020



శ్రీ మదగ్ని మహాపురాణము - 10 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 4
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. వరాహావతార వర్ణనము - 2 🌻

వక్ష్యే పరశురామస్య చావతారం శృణు ద్విజ | ఉద్ధతాన్‌ క్షత్రియాన్‌ మత్వా భూభార హరణాయ సః. 12

అవతీర్ణో హరిః శాన్త్యై దేవవిప్రాదిపాలకః | జమదగ్నే రేణుకాయాం భార్గవః శస్త్రపారగః. 13

ఓ బ్రాహ్మణా! పరశురాముని అవతారమును గూర్చి చెప్పెదను వినుము. ఆ శ్రీమహావిష్ణువు, క్షత్రియులు ఉద్దతులుగా ఉన్నా రని తలచి, భూబారమును హరించుటకై, దేవతలను, విప్రాదులను పాలింపనున్నవాడై, శాంతిని నెలకొల్పుటకై, జమదగ్నినుండి రేణుకయందు సర్వశాస్త్రవిద్యాపారంగతు డైన భార్గవుడుగా (పరశురాముడుగా) ఆవతరించినాడు.

దత్తాత్రేయప్రసాదేన కార్తవీర్యో నృపస్త్వభూత్‌ | సహస్రబాహుః సర్వోర్యీపతిః స మృగయాం గతః. 14

కార్తవీర్యుడను రాజు దత్తత్రేయుని అనుగ్రహముచే వేయిబాహువులు కలవాడుగను, సకల భూమండలమునకును రాజుగను ఆయెను. అతడు వేటకు వెళ్లెను.

శ్రాన్తో నిన్త్రితో7రణ్య మునినా జమదగ్నినా | కామధేనుప్రభావేణ భోజితః సబలో నృపః. 15

అరణ్యములో అలసిన సేనానమేతు డైన ఆ రాజును జమదగ్ని మహర్షి నిమంత్రించి కామధేనవు ప్రభావముచేత భోజనము పెట్టెను.

అప్రార్థయత్కామధేను యదా స న దదౌ తదా | హృతవానథ రామేణ శిరశ్ఛిత్వా నిపాతితః. 16

యుద్ధే పరశునా రాజా సధేనుః స్వాశ్రమం య¸° |

కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువును తన కిమ్మని కోరెను. జమదగ్ని ఈయ నిరాకరించెను. ఆపుడాతడు దానిని అపహరించెను. పిదప పరశురాముడు యుద్దములో పరశువుచే అతని శిరస్సు ఛేదించి సంహరించి ధేనువుతో ఆశ్రమమునకు తిరిగి వెళ్లెను.

కార్తవీర్యస్య పుత్త్రెస్తు జమదగ్నిర్ని పాతితః.
రామే వనం గతే వైరాదథ రామః సమాగతః | 17

 పితరం నిహతం దృష్ట్వా పితృనాశాభిమర్షితః. 18

త్రిఃసప్తకృత్వః పృథివీం నిఃక్షత్రామకరోద్విభుః |
కురుక్షేత్రే పఞ్చకుణ్డాన్‌ కృత్వా సన్తర్ప్య వై పితౄన్‌.
కశ్యపాయ మహీం దత్వా మహేన్ద్రే పర్వతే స్థితః | 19

పరశురాముడు వనమునకు వెళ్ళి యుండగా కార్తవీర్యుని పుత్రులు పూర్వవైరమువలన జమదగ్నిని చంపిరి. అంత తిరిగి వచ్చిన ప్రభావశాలి యగు పరశురాముడు చంపబడిన తండ్రిని చూచి, తండ్రిని ఆ విధముగ చంపుటచే కోపించి, ఇరువదియొక్క పర్యాయములు పృథివిని క్షత్రియులు లేనిదానినిగాచేసి, కురుక్షేత్రమునందు ఐదు కుండములను చేసి, వాటితో పితృదేవతలను తృప్తిపరచి, భూమి నంతను కశ్యపునకు దానము చేసి, మహేంద్రపర్వతముపై నివసించెను.

కూర్మస్య చ వరాహస్య నృసింహస్య చ వామనమ్‌ |
అవతారం చ రామస్య శ్రుత్వా యాతి దివం నరః. 20

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే వరాహనృసింహాద్యవతారో నామ చతుర్థోధ్యాయః.

కూర్మ, వరాహ, నరసింహ, పరశురామావతారగథలు విన్న మానవుడు స్వర్గమునకు వెళ్లును.

అగ్ని మహా పురాణములో వరాహనృసింహాద్యవతార మనెడు చతుర్థాధ్యాయము సమాప్తము.

సశేషం
......
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 11 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 5
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. రామావతార వర్ణనము 🌻

అథ పంచమోధ్యాయః.
అథ శ్రీ రామావతారవర్ణనమ్‌.

అగ్ని రువాచ :-

రామాయణమహం వక్ష్యే నారదేవనోదితం పురా| వాల్మీకయమే యథా తద్వత్పఠితం భుక్తిముక్తిదమ్‌. 1

అగ్ని పలికెను : దేనిని పఠించినచో భుక్తియు ముక్తియు లభించునో అట్టి రామాయణమును, నాదరుడు వాల్మీకి చెప్పన విధమున చెప్పెదను.

నారద ఉవాచ :-

విష్ణునాభ్యబ్జజో బ్రహ్మా మరీచిర్ర్బహ్మణః సుతః | మరీచేః కశ్యపన్తస్మాత్సూర్యో వైవస్వతో మనుః. 2

తత స్తస్మాత్తథేక్ష్వాకుస్తస్య వంశే కకుత్థ్సకః | కకుత్థ్సస్య రఘస్తస్మాదజో దశరథస్తతః. 3

విష్ణువు నాభియందలి పద్మమునుండి బ్రహ్మ పుట్టెను. మరీచి బ్రహ్మ కుమారుడు. మరీచికి కశ్యపుడును, ఆతనికి సూర్యుడును, సూర్యునకు వై వస్వతమనువును అతనికి ఇక్ష్వాకువును పుట్టిరి. ఆతని వంశమునందు కకుత్థ్సడు పుట్టెను. కకుత్థ్సునకు రఘువు, రఘువునకు అజుడు, అజునకు దశరథుడును పుట్టెను.

రావణాదేర్వధార్థాయ చతుర్ధాభూత్స్వయం హరిః | రాజ్ఞో దశరథాద్రామః కౌసల్యాయాం బభూవ హ.
కై కేయ్యాం భరతః పుత్రః సుమిత్రాయాం చ లక్ష్మణః | 4

శత్రుఘ్నః ఋష్యశృఙ్గేణ తాసు నంద త్తపాయసాత్‌.
ప్రాశితాద్యజ్ఞసంసిద్ధాద్రామాద్యాశ్చ సమాః పితుః | 5

శ్రీమహావిష్ణువు రావణాదులను వధించుటకై తాను నాలుగు విధములుగా అయి దశరథమహారాజు వలన కౌసల్య యందు రాముడుగను, కై కేయియందు బరతుడుగను, సుమిత్రయందు లక్ష్మణశత్రుఘ్నలుగను జనించెను. బుష్యశృంగుని సాహాయ్యముచే యజ్ఞమునందు లభిలంచిన పాయసమును కౌసల్యాదుల కీయగా, వారు దానిని భూజింపగా, తండ్రితో సమానులైన రామాదులు జనించిరి.

యజ్ఞవిఘ్నవినాశాయ విశ్వామిత్రార్థితో నృపః.
రామం సంప్రేషయామాస లక్ష్మణం మునినా సహ | 6

విశ్వామిత్రుడు కోరగా దశరథుడు యజ్ఞవిఘ్నములను తొలగించుటకై లక్ష్మణసమేతుడైన రాముని విశ్వామిత్రునితో పంపెను.

రామో గతో7స్త్రశస్త్రాణి శిక్షితస్తాడకాన్తకృత్‌.
మారీచం మానవాస్త్రేణ మోహితం దూరతోనయత్‌ | 7

సుబాహుం యజ్ఞహన్తారం సబలం చావధీద్బలీ. 8

తాటకను సంహరించిన రాముడు (విశ్వామిత్రునినుండి) అస్త్ర శస్త్రములను పొందను. మానవాస్త్రముచే మారీచుని మూర్ఛితుని చేసి దూరముగా పడవేసెను. బలవంతుడైన ఆ రాముడు యజ్ఞమును పాడుచేయుచున్న సుబాహుని సేనా సహితముగా సంహరించెను.

సిద్ధాశ్రమనివాసీ చ విశ్వామిత్రాదిభిః సహ | గతః క్రతుం మైథిలస్య ద్రష్టుం చాపం సహానుజః. 9

సిద్ధాశ్రమమునందు నివసించినవాడై, విశ్వామిత్రాదులతో కలిసి, లక్ష్మణ సమేతుడై, జనకుని యజ్ఞమును, ధనస్సును చూచుటకై వెళ్ళెను.

శతానన్దనిమిత్తేన విశ్వామిత్రప్రభావతః | రామాయ కథితే రాజ్ఞా స మునిః పూజితః క్రతౌ. 10

శతానందుడు విశ్వామిత్రుని ప్రభావమును గూర్చి రామునకు చెప్పెను. ఆ యజ్ఞమునందు జనకుడు ముని సమేతుడైన రాముని పూజించెను.

ధనురాపూరయామాస లీలయా స బభజ్ఞ తత్‌ | వీర్యశుల్కాం చ జనకః సీతాం కన్యాం త్వయోనిజామ్‌. 11

దదౌ రామాయ రామో7పి పిత్రాదౌ హి సమాగతే | ఉపయేమే జానకీం తామూర్మిలాం లక్ష్మణ స్తథా. 12

శ్రుతకీర్తిం మాణ్డవీం చ కుశధ్వజసుతే తథా | జనకస్యానుజస్త్యెతే శత్రుఘ్నభరతావుభౌ.
కన్యే ద్వే ఉపయేమాతే - 13

రాముడు ధనస్సును ఎక్కు పెట్టి దానిని అనాయాసముగా విరచెను. జనకుడు వీర్యమే శుల్కముగా కలదియు, ఆమోనిజయు అగు తన కన్య యైన సీతను రామున కిచ్చెను. తండ్రి మొదలైన వారు వచ్చిన పిమ్మట రాముడు సీతను, లక్ష్మణనుడు ఊర్మిళను, జనకుని తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలైన మాండవీ శ్రుతకీర్తులను భరత శత్రఘ్నులును వివాహమాడిరి.

జనకేన సుపూజితః |
రామోగాత్స వసిష్ఠాద్యైర్జామదగ్న్యం విజిత్య చ |
అయోధ్యాం భరతోప్యాగాత్సశత్రుఘ్నో యుధాజితః.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే రామాయణ బాలకాణ్డ వర్ణనం నామ పఞ్చమోధ్యాయః.

ఆ రాముడు జనకునిచే బాగుగా సత్కరింపబడినవాడై, వసిష్ఠాది సమేతుడై పరశురాముని జయించి ఆమోధ్యకు వెళ్ళెను. భరతుడు శత్రుఘ్న సమేతుడై యుధాజిత్తు నగరమునకు వెళ్ళెను.

అగ్ని మహాపురాణము నందు రామాయణ బాలకాండ వర్ణన మను పంచమాధ్యయము సమాప్తము.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹





🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 13 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 6
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అయోధ్యకాండ వర్ణనము - 2 🌻

ప్రోత్సాహితా కుబ్జయా సా అనర్థే చార్థదర్శినరీ | ఉవాచ సదుపాయం మే కచ్చిత్తం కారయిష్యతి. 
క్రోధాగారం ప్రవిష్టథ పతితా భువి మూర్ఛితా | 16

ఈ విధముగ ఆ కుబ్జచే ప్రోత్సహింపబడిన కై కేయి, అనర్థమును లాభకర మని భావించినదై ''ఈ మంచి ఉపాయము దశరథునిచేత ఆ పని చేయించునా ?'' అని పలికి కోప గృహమును ప్రవేశించి, మూర్ఛితురాలు వలె భూమిపై పడి యుండెను.

ద్విజాతీనర్చయిత్వాథ రాజా దశరథస్తదా. 17

దదర్శ కై కయిం రుష్టామువాచ కథమీదృశీ | రోగార్తా కం భయోద్విగ్నా కిమిచ్ఛసి కరోమి తత్‌. 18

యేన రామేణ హి వినా న జీవామి ముహూర్తకమ్‌ | శపామి తేన కుర్యాం వై వాఞ్ఛీతం తవ సున్దరి. 19

రాజు బ్రాహ్మణులను పూజించి, కోపించి ఉన్న కై కేయిని చూచి ఇట్లు పలికెను. '' ఇట్లున్నావేమి? రోగముతో బాదపడుచున్నావా ? భయపడినావా ? నీ కేమి కావలెను. చెప్పుము. అది చేసెదను. ఏ రాముడు లేకున్నచో ముహూర్తకాల మైనను జీవింపజాలనో ఆ రామునిపై ఒట్టుపెట్టుచున్నాను. ఓ సుందరీ ! నీ కోరికను నెరవేర్చెదను.''

సత్య బ్రూహీతి సోవాచ నృప మహ్యం దదాసి చేత్‌ |
వరద్వయం పూర్వదత్తం సత్యాత్తవ్వం దేహి మే నృప. 20

చతుర్దశ సమా రామో వనే వసతు సంమతః | సంబారై రేభిరద్యైవ భరతో త్రాభిషేచ్యతామ్‌. 
విషం పీత్వా మరిష్యామి దాస్యసి త్వం న చేన్నృఫ | 21

ఆమె పలికెను. ''ఓ రాజా ! సత్యము పలుకుము. నీవు ఇచ్చుటకు అంగీకరించెద వేని పూర్వము నా కిచ్చిన రెండు కరములను, సత్యమును పాలించుచు నాకిమ్ము. రాముడు పదునాలుగు సంవత్సరములు నియమవంతుడై వనమునందు నివసించుగాక. ఇప్పుడే ఈ సంబారములతో భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెను. ఈ వరముల నీయకున్నచో విషమ త్రాగి మరణించెదను.

తచ్ర్ఛుత్వా మూర్ఛితో భూమౌ వజ్రాహత ఇవాపతత్‌. 
ముహూర్తాచ్చేతనాం ప్రాప్య కై కేయి మిదమబ్రవీత్‌. 22

ఆ మాట విని, మూర్ఛితుడై, వజ్రముచే కొట్టబడినవాడు వలె భూమిపై పడెను. ముహూర్త కాలమున స్మృతి చెంది కై కేయితో ఇట్లనెను.

దశరథ ఉవాచ :

కిం కృతం తవ రామణ మయా వా పావనిశ్చయే.

యన్మామేవం బ్రవీషి త్వం సర్వలోకాప్రియం కరి | కేవలం త్వత్ర్పయం కృత్వా భవిష్యామి సునిన్దితః. 24

యా త్వం భార్యా కాలరాత్రిర్భరతో నేదృశః సుతః | ప్రశాధి విధవా రాజ్యం మృతే మయి గతే సుతే. 25

ఓ పాపనిశ్చయవంతురాలా ! నీకు రాముడు ఏమి అపకారము చేసినాడు ? నేనేమి చేసినాను ? సకల ప్రపంచకమునకును అప్రియమును ఆచరించుచు నీవు ఇట్లేల పలుకుచున్నావు ? కాలరాత్రి వంటి భార్య వైన నీకు ప్రియమును చేసి నేను నిందితుడ నగుదును. భరతుడు ఇట్టివాడు కాడు. రాముడు అరణ్యచమునకు వెళ్ళిన పిదప నేను మరణించగా నీవు విధవవై రాజ్యము నేలికొనుము.

సత్యపాశనిబద్ధ స్తు రామమాహూయ చాబ్రవీత్‌ | కై కేయ్యా వఞ్చీతో రామ రాజ్యం కురు నిగృహ్య మామ్‌. 
త్వయా వనే తు వస్తవ్యం కై కేయి భరతో నృపః | 26

సత్యపాశముచే బద్ధుడైన ఆతడు రాముని పిలచి ఇట్లు పలికెను. ''రామా ! నేను కై కేయిచే వంచింపబడితిని. నన్ను బంధించి రాజ్య మేలుము. నీవు వనములో నివసింపవలెను. కై కేయీ కుమారు డైన భరతుడు రాజు అగును. ''

పితరం చైవ కై కేయిం నమస్కృత్య ప్రదక్షిణమ్‌ . 27

కృత్వా నత్వా చ కౌసల్యాం సమాశ్వాస్య సలక్ష్మణః |
సీతయా భార్యయా సార్థం సరథః ససుమన్త్రకః. 28

దత్త్వా దానాని విప్రేభ్యో దీనానాథేభ్య ఏవ సః |
మాతృబిశ్చైవ విప్రాద్యైః శోకార్తైర్నిర్గతః పురాత్‌. 29

రాముడు తండ్రికిని, కై కేయికిని ప్రదక్షిణ నమస్కారములు చేసి, కౌసల్యకు నమస్కరించి, ఓదార్చి, సీతాలక్ష్మణసమేతుడై, బ్రాహ్మణులకును, దీనులకును, అనాధులకును దానములు చేసి, సుమంత్రినతో కూడినవాడై, రథము నెక్కి శోకార్తులైన తల్లులతోను, బ్రాహ్మణాదులతోను కూడి పట్టణమునుండి బయలువెడలెను.

ఉషిత్వా తమసాతీరే దాత్రౌ పౌరాన్‌ విహాయ చ | ప్రభాతే తమపశ్యన్తోయోధ్యాం తే పునరాగతాః. 30

రాత్రి తమసా తీరమున నివసించి, పౌరులను విడచి వెళ్ళిపోయెను. ఆ పౌరులు ప్రాతఃకాలమున రాముని గానక తిరిగి అయోధ్యకు వెళ్ళిరి.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 14 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 6
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అయోధ్యకాండ వర్ణనము - 3 🌻

రుదన్రాజాపి కౌసల్యాగృహమాగాత్సుదుఃఖితః | పౌరా జనాః స్త్రియః సర్వా రురుదూ రాజయోషితః. 31

మిక్కిలి దుంఖితు డైన దశరథమహారాజు ఏడ్చుచు కౌసల్యాగృహమునకు వెళ్ళెను. పౌరులును. స్త్రీలును, రాజస్త్రీలును ఏడ్చిరి.

రామో రథస్థశ్చీరాఢ్యః శృఙ్గబేరపురం య¸° | గుహేన పూజిత స్తత్ర ఇఙ్గదీమూలమాశ్రితః. 32

నారచీరలను ధరించిన రాముడు రథమునెక్కి శృంగబేరమునకు వెళ్ళగా అచ్చట గుహుడు ఆతనిని పూజించెను. ఆచట రాముడు ఇంగుదీవృక్షమూలమున నివసించెను.

లక్ష్మణః సగుహో రాత్రౌ చక్రతుర్జాగరం హితౌ | సుమన్త్రం సరథం త్యక్త్వా ప్రాతర్నావాథ జాహ్నవీమ్‌.

రామలక్ష్మణసీతాశ్చ తీర్ణా ఆపుః ప్రయాగకమ్‌ | భరద్వాజం నమస్కృత్య చిత్రకూటం గిరిం యయుః. 34

లక్ష్మణుడును, గుహుడును ఆ రాత్రి యంతయు మేల్కొనియే యుండిరి. పిదప, సీతారామలక్ష్మణులు ప్రాతఃకాలమున నావచే జాహ్నవిని దాటి ప్రయాగ చేరిరి. భరద్వాజుని నమస్కనరించి చిత్రకూటపర్వతము చేరిరి.

వాస్తుపూజాం తతః కృత్వా స్థితా మన్దాకినీ తటే | సీతాయై దర్శయామాస చిత్రకూటం చ రాఘవః. 35

పిమ్మట వాస్తుపూజ చేసి, మన్దాకినీ నదీతీరమున నివసించిరి.ప రాముడు సీతకు చిత్రకూటపర్వతమును చూపెను.

నఖై ర్విదారయన్తం తాం కాకం తచ్చక్షురాక్షిపత్‌ | ఐషీకాస్త్రేణ శరణం ప్రాప్తో దేవాన్విహాయసః. 36

గోళ్ళచే సీతను గీరిన కాకి నేత్రమును, రాముడు ఐషీకాస్త్రము ప్రయోగించి పోగొట్టెను. ఆ కాకి దేవతలను విడచి మరల రామునే శరణుజొచ్చినది.

రామే వనం గతే రాజా షష్ఠే7హ్ని నిశి చాబ్రవీత్‌ |
కౌసల్యాం స కథాం పౌర్వాం యదాజ్ఞానాద్దతః పురా. 37

కౌమారే సరయూతేరే యజ్ఞదత్తకుమారకః | శబ్దభేదాచ్చ కుమ్భేన శబ్దం కుర్వంశ్చ తత్పితా. 38

శశాప విలపన్మాత్రా శోకం కృత్వా రుదన్ముహుః | పుత్రం వినామరిష్యావస్త్వం చ శోకాన్మరిష్యసి. 39

పుత్రం వినా స్మరన్‌ శోకాత్‌ కౌసల్యే మరణం మమ | కథాముక్త్వాథ హా రామేత్యుక్త్వా రాజా దివం గతః.

రాముడు అరణ్యమునకు వెళ్ళిన ఆరవ దినమున దశరథుడు పూర్వము జరిగిన కథను చెప్పెను. నేను కౌమారవయస్సులో ఉన్నప్పుడు సరయూ తీరమునందు కుంభమును నీటిలో ముంచి శబ్దము చేయుచున్న యజ్ఞదత్తుడనే పిల్లవానిని శబ్ధవేధిని ఉపయోగించి చంపితిని. అతని తల్లిదండ్రులు చాల విలపించిరి. 

అతని తండ్రి ''మే మిరువురము పుత్ర శోకముతో మరణించుచన్నాము. నీవు కూడ పుత్రశోకముతో పుత్రుని స్మరించుచు మరణించెదవు '' అని నన్ను శపించెను. కౌసల్యా ! నా కీ విధముగ మణము రానున్నది. '' ఈ విధముగ కథను చెప్పి హా రామా! అని అనుచు రాజు స్వర్గము పొందెను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment