Friday 22 May 2020



శ్రీ మదగ్ని మహాపురాణము - 5 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
సంపుటము - 1, అధ్యాయము - 2
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మత్స్యవతార వర్ణనము - 1 🌻

అథ మత్స్యావతార వర్ణనమ్‌

వసిష్ఠ ఉవాచ :

మత్స్యాదిరూపిణం విష్ణుం బ్రూహి సర్గాదికారణమ్‌ | పురాణం బ్రహ్మ చాగ్నేయం తథా విష్ణోః పురా శ్రుతమ్‌. 1

మత్స్యవతార వర్ణనము

విశిష్ఠుడు పలికెను: మత్స్యాదిరూపములను ధరించినవాడును, సృష్ట్యాదులకు కారణమైనవాడును అగు విష్ణువును గూర్చి చెప్పుము. పూర్వము విష్ణువునుండి వినిన విధమున అగ్నేయపురాణమును గూర్చియు, బ్రహ్మను గూర్చియు (లేతా అగ్నేయ పురాణరూప మగు వేదమును) చెప్పుము.

అగ్నిరూవాచ ః

మత్స్యావతారం వక్ష్యేఅహం వసిష్ఠ శృణు వై హరేః | అవతార క్రియా దుష్టనష్ట్యై .సత్పాలనాయ హి 2

అగ్ని పలికెను ః వసిష్ఠా! విష్ణువు ధరించిన మత్స్యావతారమును గూర్చి చెప్పదను; వినుము, అవతారములు ధరించుట దుష్టనాశము కొరకును, శిష్టపాలనముకొరకును జరుగుచుండను కదా?

ఆసీదతీతకల్పానై బ్రహ్మోనైమిత్తికో లయః | సముద్రోపప్లుతా స్తత్ర లోకా భూరాదికా మునే. 3

ఓ మునీ! గడచిన కల్పము చివర బ్రహ్మ నిద్రించుట అను నిమిత్తముచే ప్రలయ మేర్పడెను. అపుడు భూలోకాదు లన్నియు సముద్రములో మునిగిపోయినవి.

మనుర్వైవస్వతస్తేపే తపో వై భుక్తిముక్తేయే | ఏకదా కృతమాలాయాం కుర్వతో జలతర్పణమ్‌.
తస్యాఞ్జల్యుదకే త్యల్పో మత్స్య ఏకోఅభ్యపద్యత|

వైవన్వత మనుపు భక్తిముక్తుల నపేక్షించి తపస్సుచేసెను. ఒకనా డాతడు కృపతమాలా నదిలో జలతర్పణము చేయుచుండగా అతని దోసిలిలోని జలములో ఒక చిన్న చేపపిల్ల కనబడెను.

క్షేప్తుకామం జలే ప్రాహ న మాం క్షిప నరోత్తమ.
గ్రాహాదిభ్యో భక్షయం మేఅత్ర తచ్ఛ్రుత్వా కలశేఅక్షిపత్‌ |

ఆ రాజు దానిని నీటిలో పడవేయ దలచుచుండగా అది అతనితో - ''మహారాజా! నా కీ జలములో మొసళ్ళు మొదలగువాటినుండి భయ మున్నది. అందుచే దీనిలో పడవేయకుము" అని పలికెను. అది విని అతడు దానిని కలశములో ఉంచెను.

స తు వృద్ధః పునర్మత్స్యః ప్రాహ తం దేహి మే బృహత్‌ . 6

స్థానమేతద్వచః శ్రుత్వా రాజాథోదఞ్చనేఅక్షిపత్‌ |

ఆ మత్యృము పెద్దదిగా అయి రాజుతో "నాకొక పెద్ద స్థానము నిమ్ము'' అని పలికెను. రా జా మాట విని దానిని చేదలో ఉంచెను.

తత్రవృతద్దో7బ్రవీద్భూపం పృథుం దేహి పదం మనో. 7

సరోవరే పునఃక్షిప్తో వవృధే తత్ప్రమాణవాన్‌ |
ఊచే దేహి బృహత్‌ స్థానం ప్రాక్షిపచ్చామ్బుధౌ తతః 8

అచట పెద్దదై ఆ రాజుతో ఇట్లనెను. " ఓ! మనుచక్రవర్తీ! నాకు విశాలమైన స్థానము నిమ్ము." పిమ్మట దానిని సరస్సులో విడువగా అది ఆ సరస్సు ప్రమాణము వంటి ప్రమాణము గలదిగ పెరిగెను. "నా కింకను పెద్ద దైన స్థానము నిమ్ము" అని పలుకగా దాని నాతడు సముద్రములోనికి విడిచెను.

లక్షయోజనవిస్తీర్ణః | క్షణమాత్రేణ సో అభవత్‌ |
మత్స్యం తమద్భుతం దృష్ట్యా విస్మితః ప్రాభ్రవీన్మనుః. 9

అది క్షణమాత్రమున లక్షయోజనముల ప్రమాణము గలదిగా పెరిగెను. అద్భతమైన ఆ మత్స్యమును చూచి, మనువు ఆశ్చర్
యము చెంది ఇట్లు పలికెను.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹



శ్రీ మదగ్ని మహాపురాణము - 6 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 2
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మత్స్యవతార వర్ణనము - 2 🌻

కో భవాన్ననువై విష్ణుర్నారయణ నమోస్తుతే | మాయయా మోహయసి మాం కిమర్థం త్వ జనార్దన. 10

"నీ వెవరవు? నీవు నిజముగ విష్ణుమూర్తివే. నారాయణా! నీకు నమస్కారము. జనార్థనా! మాయచేత నీవు నన్నీవిధముగ ఏల మోహపెట్టుచున్నావు?"

మనునోక్తో అబ్రవీన్మత్స్యో మనుం వై పాలనే రతమ్‌ | అవతీర్ణో భవాయాస్య జగతో దుష్టనష్టియే. 11

మన వీ విధముగా పలుకగా ఆ మత్స్యము ప్రజలకు పాలించుట యందు ( లేదా తనను రక్షించుటయందు) ఆసక్తి గల ఆతనితో ఇట్లనెను- "ఈ జగత్తును నిలుపుటకును, దుష్టులను నశింపచేయటకును అవతరించినాను".

సప్తమే దివసే త్వబ్ధిః ప్లావయిష్యతి వై జగత్‌ | ఉపస్థితాయాం నావి త్వం బీజాదీని విధాయ చ. 12

సప్తర్షిభిః పరివృతో నిశాం బ్రాహ్మీం చరిష్యసి | ఉపస్థితస్య మే శృఙ్గే నిబధ్నీహి మహాహినా. 13

"(నేటినుండి) ఏడవ దివసమున సముద్రము ఈ జగత్తును ముంచివేయును. అపుడు నీదగ్గరకు వ్చచిన నావలో బీజములు మొదలగువాటిని ఉంచుకొని, సప్తర్షిసమేతుడవై బ్రహ్మనిద్రించు రాత్రి అంతయు సంచరింపగలవు. నేను నీ దగ్గరకు వచ్చినపుడు ఆ నావను పెద్ద సర్పముతో నా కొమ్మునకు కట్టి వేయుము".

ఇత్యుక్త్వాన్తర్దధే మత్స్యోమనుః కాలప్రతీక్షకః | స్థితః సముద్ర ఉద్వేలే నావమారురుహే తదా. 14

ఇట్లు పలికి మత్స్యము అంతర్ధానము చెందెను. మనువు ఆ కాలమునకై నిరీక్షించుచు ఉండెను. సముద్రము గట్టు దాటి పొంగగా అపుడు నావను ఎక్కెను.

ఏకశృఙ్గధరో మత్స్యో హైమో నియుతమోజనః | నావం బబన్ధ తచ్ఛఙ్గే మత్స్యాఖ్యం చ పురాణకమ్‌ . 15

శుశ్రావ మత్స్యాత్పపఘ్నం సంస్తువన్‌ స్తుతిభిశ్చ తమ్‌ |

ఒక కొమ్ముగల, పదివేల కోట్ల యోజనములు గల బంగారు మత్స్యము (వచ్చెను). దాని కొమ్మునకు నావను కట్టెను. ఆ మత్స్యమును స్తోత్రములచే స్తుతించుచు, పాపములను తొలగించు మాత్స్యపురాణమును ఆ మత్స్యము చెప్పగా వినెను.

బ్రహ్మవేద ప్రహర్తారం హయగ్రీవం చ దానవమ్‌. 16

అవధీద్వేదమన్త్రాద్యాన్పాలయామాస కేశవః | ప్రాప్తే కల్పేఅథ వారాహే కూర్మరూపోఅ భవద్దరిః. 17

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే మత్స్యావతారో నామ ద్వితీయోధ్యాయః.

కేశవుడు బ్రహ్మనుండి వేదములను అపహరించిన హయగ్రీవు డను దానవుని సంహరించి వేదమంత్రాదులను రక్షించెను. పిమ్మట వారాహకల్పము రాగా హరి కూర్మావతారం ధరించెను.

అగ్ని మహాపురాణములో మత్స్యావతారమను ద్వితీ
యాధ్యాయము సమాప్తము.

సశేషం......
🌹 🌹 🌹 🌹 🌹



శ్రీ మదగ్ని మహాపురాణము - 7 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 3
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. కూర్మావతార వర్ణనము - 1 🌻

అథ కూర్మావతారవర్ణనమ్‌.

అగ్ని రువాచ :-

వక్ష్యే కూర్మావతారం చ సంశ్రుతం పాపనాశనమ్‌ | పురా దేవాసురే యుద్దే దైత్యైర్దేవాః పరాజితాః. 1

దుర్వాససశ్చ శాపేన నిశ్రీకాశ్చాభవంస్తదా | స్తుత్వా క్షిరాబ్దిగం విష్ణుమూచుః పాలయ చాసురాత్‌. 2

అగ్ని పలికెను: పాపములను తొలిగించు కూర్మావతారమునుగూర్చి మొదట నేను ప్రతిజ్ఞచేసినవిధమున చెప్పెదను. పూర్వము దేవాసురయుద్దములో దేవతలు దూర్వాసుని శాపముచే దైత్యుల చేతిలో ఓడిపోయిరి. అపుడు వారు (ఐశ్వర్య) లక్ష్మీరహితులై పోయిరి. క్షీరాబ్ధిపై ఉన్న విష్ణువును స్తుతించి ''మమ్ములను అసురులనుండి రక్షింపుము'' అని వేడికొనిరి.

బ్రహ్మాదికాన్‌ హరిః ప్రాహ సన్దిం కుర్వన్తు చాసురైః | క్షీరాబ్దిమథనార్థం హి అమృతార్థం శ్రియే సురాః. 3

అరయోపిహి సంధేయాః సతి కార్యార్థగౌదవే | యుష్మానమృతభాజో హి కరిష్యామి న దానవాన్‌. 4

మన్థానం మన్దరం కృత్వా నేత్రం కృత్వా తు వాసుకిమ్‌ | క్షీరాబ్దిం మత్సాహాయేన నిర్మథధ్వమతన్ద్రతాః. 5

శ్రీ మహావిష్ణువు బహ్మాది దేవతలతో ఇట్లనెను: ''సురలారా! క్షీరాబ్దిని మథించి అమృతమును లక్ష్మిని సంపాదించుటకై అసురులతో సంధి చేసికొనుడు. పని విడినపుడు శత్రువులతో కూడ సంధి చేసి కొనవలెను గదా !

అమృతము మీకే తక్కునట్లును, దానవులకు తక్కకుండు నట్లును చేసెదను. మందర పర్వతమును కవ్వముగ చేసి, వాసుకుని కవ్వపు త్రాడుగా చేసి, నా సాహాయ్యముతో క్షిరాబ్ధిని మధింపుడు. మాంద్యము వలదు.

విష్ణూక్తాః సంవిదం కృత్వా దైత్యైః క్షీరాబ్దిమాగతాః | తతో మథితుమారబ్ధా యతః పుచ్ఛం తతః సురాః. 6

విష్ణువు ఇట్లు పలుకగా దేవతలు దైత్యలతో ఒప్పందము చేసికొని క్షీరాబ్ధికి వచ్చి మథింప ప్రారంభించిరి. వాసుకి తోక వైపు దేవత లుండిరి.

ఫణినిశ్శ్వాసన న్తప్తా హరిణాప్యాయితాః సురాః | మథ్యమానే ర్ణవే సోద్రిదనాధారో హ్యపోవిశత్‌. 7

సర్పము విడచు నిట్టూర్పుల వేడికి బాధపడుచున్న దేవతలను హరి సేదదీర్చెను. సముద్రమును మథించు చుండగా ఆ పర్వతముక్రింద ఆధార మేదియు లేకపోవుటచే నీటిలో మునిగిపోయేను.

కూర్మరూపం సమాస్థాయ దధ్రే విష్ణుశ్చ మన్దరమ్‌ | క్షీరాబ్ధేర్మథ్యమానాచ్చ విషం హాలాహలం హ్యభూత్‌. 8

విష్ణువు కూర్మరూపమును ధరించి మందరపర్వతమును నిలబెట్టెను. మథింపబడుచున్న క్షీరాబ్ధినుండి హాలాహల విషము పుట్టెను.

హరేణ ధారితం కణ్ఠ నీలకణ్ఠస్తతోభవత్‌ | తతోభూద్వారుణీ దేవీ పారిజాతస్తు కౌస్తుభః. 9

గావశ్చాప్సరసో దివ్యా లక్ష్మీర్దేవీ హరిం గతా | పశ్యన్తః సర్వదేవాస్తాం స్తువన్తః సశ్రియో7భవన్‌. 10

శివుడు ఆ విషమును కంఠమునందు ధరించెను. అందుచే అతడు నీలకంఠు డయ్యెను. పిమ్మట వారుణీదేవియు (సురయు), పారిజాతము కౌస్తుభము, గోవుల , దివ్యలగు అప్సరసలు పుట్టిరి. లక్ష్మీదేవి ఆవిర్భవించి విష్ణువును చేరినది. దేవత లందరును ఆమెను చూచుచు స్తోత్రము చేయుటచే శ్రీమంతులైరి.

తతో ధన్వన్తరిర్విష్ణురాయుర్వేద ప్రవర్తకః |బిభ్రత్కమణ్డలుం పూర్ణమమృతేన సముత్థితః. 11

పిమ్మట ఆయుర్వేదమును ప్రచారములోనికి తీసికొని వచ్చిన ధన్వంతరి రూపుడైన విష్ణువు అమృతపూర్ణ మగు కమండలువును చేత ధరించి ఆవిర్బవించెను.

అమృతం తత్కరాద్దైత్యాః సురేభ్యో7ర్ధం ప్రదాయ చ | గృహీత్వా జగ్ముర్జమ్భాద్యా విష్ణుః స్త్రీరూపధృక్తతః. 12

జంభుడు మొదలగు దైత్యులు ఆతని చేతినుండి అమృతమును గ్రహించి, సగము దేవతల కిచ్చి, వెళ్లిపోయిరి. పిమ్మట విష్ణువు స్త్రీరూపమును ధరించెను.

తాం దృష్ట్వా రూపసంపన్నాం దైత్యాః ప్రోచుర్విమోహితాః |

భవ భార్యామృతం గృహ్య పాయయాస్మాన్వరాననే. 13

మంచి సౌందర్యము గల ఆమెను చూచిన దైత్యులు మోహము చెంది, ''ఓ వరాననా ! మాకు భార్యవు కమ్ము; ఈ ఆమృతమును తీసికొని మాకు (త్రాగించుము) పంచిపెట్టుము'' అని పలికిరి.

తథేత్యుక్త్వా హరిస్తేభ్యో గృహీత్వా పాయయత్సురాన్‌ | చన్ద్రరూపధరో రాహుః పిబంశ్చార్కేన్దునార్పితః. 14

అట్లే అని పలికి హరి వారి చేతినుండి అమృతమును గ్రహంచి దేవతలచే త్రాగించెను. రాహువు చంద్రరూపమును ధరించి అమృతము త్రాగుచుండగా సూర్యచంద్రులాతనిని పట్టి చూపిరి.

హరిణాప్యరిణా చ్ఛిన్నం తదా రాహోః శిరః పృథక్‌ | కృపయామరతాం నీతం వరదం హరిమబ్రవీత్‌ 15

రాహుర్మత్తస్తు చన్ద్రార్కౌ ప్రాప్స్యేతే గ్రహణం గ్రహః |


తస్మిన్‌ కాలే తు యద్దానం దాస్యన్తే స్యాత్తదక్షయమ్‌. 16

అప్పుడు విష్ణువు రాహుశిరస్సును చక్రముచే ఖండించి వేరు చేసి దయతో దానికి మరణము లేకుండునట్లు చేసెను. రాహువు వరము నిచ్చు హరితో ఇట్లు పలికెను : '' చంద్రసూర్యులు నాచే పట్టుబడుచుందురు. అది గ్రహణ మగును. ఆ కాలమునందు ఇచ్చు దానము ఆక్షయ మగుగాక''.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 8 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 3
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. కూర్మావతార వర్ణనము - 2 🌻

తథేత్యాహాథ తం విష్ణుస్తతః సర్త్వెః సహామర్తెః | స్త్రీరూపం సంపరిత్యజ్య హరేణోక్తః ప్రదర్శయ. 17

''అటులనే ఆగుగాక'' అని విష్ణువు ఆతనితో పలికెను. పిమ్మట స్త్రీరూపమును త్యజించి దేవతలతో కలిసి యుండగా శివుడు '' ఆ స్త్రీ రూపమును చూపుము'' అని హరితో అనెను.

దర్శయామాస రుద్రాయ స్త్రీరూపం భగవాన్‌ హరిః |

మాయయా మోహితః శమ్భుర్గౌరీం త్యక్త్వా స్త్రియం గతః. 18

భగవంతుడైన శ్రీమహావిష్ణువు రుద్రునకు స్త్రీరూపమును చూపెను. శివుడు విష్ణుమయచే మోహితుడై పార్వతిని విడచి ఆస్త్రీని వెంబడించెను.

నగ్న ఉన్మత్తరూపో భూత్‌ స్త్రీయః కేశానధారయత్‌ |

అగాద్విముచ్చ కేశాన్‌ స్త్రీ అన్వధావచ్చ తాం గతామ్‌. 19

శివుడు ఉన్మత్తుడై, దిగంబరుడై ఆమె కేశపాశమును పట్టుకొనెను. ఆమె జుట్టు విడిపించుకొని వెళ్లిపోయెను. ఇతడు ఆమె వెంట పరుగెత్తెను.

స్ఖలితం యత్ర వీర్యచం కౌ యత్ర యత్ర హరస్య హి | తత్ర తత్రాభవత్‌ క్షేత్రం లిఙ్గానాం కనకస్య చ. 20

ఈశ్వరుని వీర్యము స్ఖలితమై భూమిపై పడిన చోటులలో నెల్ల బంగారు లింగముల క్షేత్ర మయ్యెను.

మాయేయమితి తాం జ్ఞాత్వా స్వరూపస్థో భవద్దరః | శివమాహ హరీ రుద్రజితా మాయా త్వయా హి మే. 21

న జేతుమేనాం శక్తో మే త్వదృతే7న్యః పుమాన్‌ భువి |

ఇది యంతయు మాయ యని గ్రహించి శివుడు స్వస్థచిత్తుయెను. అపుడు విష్ణువు శివునితో ఇట్లనెను : '' రుద్రా! నీవు నా మాయను జయించితివి. ఈ లోకములో నీవు తప్ప మరెవ్వరును నా మాయను జయింపజాలరు. ''

ఆప్రాప్యాథామృతం దైత్యా దేవైర్యుద్ధే నిపాతితాః.

త్రిదివస్థాః సురాశ్చాసన్‌ దైత్యాః పాతాలవాసినః | యో నరః పఠతే దేవవిజయం త్రిదివం వ్రజేత్‌. 23

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే కూర్మావతారోనామ తృతీయోధ్యయః.

అమృతమును పొందజాలని ఆ దైత్యులను దేవతలు యుద్ధములో జయించిరి. దేవతలు స్వర్గములో నివసించిరి. దైత్యులు పాతళలోకనివాసు లయిరి. ఈ దేవి విజయకథను పఠించువాడు స్వర్గమును పొందను.

ఆగ్నేయ మహా పురాణములో కూర్మావతార మనెడు తృతీయాధ్యయము సమాప్తము.

సశేషం.....

🌹 🌹  


No comments:

Post a Comment