Tuesday 28 July 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (43 వ సర్గ)


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
      శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:



 43వ సర్గ (వాల్మికి రామాయణములోని 25 శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుడు చైత్యప్రాసాదమును ద్వంసము చేసి దాని రక్షకులను వధించుట )


హనుమంతుడు కింకర వదానంతరము తనలో తాను  ఇంట్లను కొనెను 
నేను వనమునుభగ్నము మొనర్చితిని ఇక నాశనము చేయవలె చేత్యపాసాదమును
ఆచేత్య ప్రాసాదమునను ధ్వంసము చేయవలెననితలచిఅన బలమునను
ప్రదర్సిమ్చుచు మెరుశిఖరమువలె ఉన్న ఆ ప్రాసాదముపై ఎగిరి కూర్చుండెను 


హనుమంతుడు చేత్యప్రాసాదముపై అధిరోహించి మరియొక సూర్యుని వలే ఉండెను
ఆక్రమింప సక్యముకాని ఉత్తమమైన ఆప్రాదమును ఆక్రమిమ్చియును 
శోభతో తెజరిల్లుచూ పారియాత్ర పర్వతమువలె కన్పడు చుండెను
హనుమంతుడు సుకుమారమైన కాయమును పెద్దగా పెంచి వేసెను


తనగర్జన ధ్వనితో ప్రతిద్వనివలె ఆ ప్రాసాదమును బ్రద్దలు కొట్టెను
అస్పోటన శబ్దము విన్నవారి చేవులయందు ఘోష వినబడుచుండెను 
ఆశబ్దమునకు పక్షులునేలపై పడిపొయెను, చెత్యప్రాదులు మూర్చ పొయెను
అప్పుడు హనుమంతుడు పెద్దగా అక్కడ ఉన్న సైనికులతో ఇట్లు తెలియపరిచెను 

జయ త్వతిబలో రామో లక్షణ శ్చ మహాబల:!
రాజా జయతి సుగ్రీవో  రాఘవేణా భిపాలిత: !!

దాసోహం కోసలేంద్రస్య రామ స్యా క్లిష్ట కర్మణ:!
హనుమాజ్ఞ్చాత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజ:!! 

న రావణ సహస్రమ్  మే యుద్ధె  ప్రతిబలమ్ భవేత్ !
సిలాభి స్తు ప్రహరత: పాదపై శ్చ సహస్రశ:!! 

అర్ధయిత్వా పురీమ్ లంకా మభివాద్య చ మైధిలీమ్ !
సమృద్దార్దో  గమిష్యామి మిషతాం సర్వ రక్షసామ్ !!

భావం
అక్కడ వచ్చిన కింకరులతో హనుమంతుడు ఈ విధముగా ఉద్ఘోషించెను
అత్యంత బల సంపన్నుడగు రామునికి, మహాబలుడగు లక్ష్మణునికి, రాఘవునిచే రక్షింప బడిన సుగ్రీవునికి, జయమగుగాక
 నేను అనాయాసముగా తన కర్మలను నిర్వహించు శ్రీరామ చంద్రునికి దాసుడను,  పవనుని పుత్రుడనగు హనుమంతుడను, శత్రుసైన్యమును హతమార్చెదను యుద్దములో శిలలతోను వేలకొలది వృక్షములతోను ప్రహారము చేయు  నాకు వేయి మంది రావణులైనను ధీటుగారు.  నేను లంకను నాశసనము చేసి, మైధిలికి అభివాదము చేసి, రాక్షుసు లందరూ చూచు చుండగా, క్రుతక్రుత్సుడనై,  తిరిగి పోయెదను.  అంటూ పెద్ద గా గర్జన చేసెను.  అతని యొక్క గర్జన శబ్దమును విని రాక్షసు లందరూ భయబ్రాన్తులై సంద్యాకాలం మేఘమును బోలిన  హనుమంతుని చూసిరి.

హనుమంతుని ధీటుగా ఎదుర్కోనవలేనని కొందరు చేత్యప్రాసాదులు  వచ్చెను 
వారు పెక్కుఆయుధాలను, గండ్ర గోడ్డల్లను తీసుకొని వచ్చి చుట్టు  నిలబడెను 
మహాకాయములుగల ఆ రాక్షసులు ఆయాశస్త్రములను హనుమనిపై ప్రయోగించెను 
బంగారు తోడుగులుగల పరిఘలతో హనుమంతునితో యుద్దము చేసెను 


హనుమంతునిచుట్టు ఉన్న ఆ రాక్షసుల సముదాయ మంతయును
గంగానదిలో జలములో ఏర్పడిన పెద్ద దైన  సుదిగుండమువలె  ప్రకాశిమ్చెను 
పిమ్మట హనుమంతుడు కోపించి భయంకరమైన రూపమును దాల్చెను 
ఆప్రాసాదమునందున్న బంగారముచే అలంకృతమైన పెద్ద స్తంభమును పెకలించెను 


హనుమంతుడు నూరు అంచులు గల ఆస్తంభమును గిరగిరా త్రిప్ప
సాగెను
అప్పుడు దానియందు అగ్నిపుట్టెను ఆ అగ్నితో  దరిచేరిన రాక్షసులను సంహరించెను 
ఇంద్రుడు వజ్రాయుధముతొ రాక్షసులను సంహరించినట్లు హనుమంతుడుసంహరించెను 
శోభాయుక్తుడైన మారుతి ఆకాశము నందు నిల్చొని పెద్దగా ఇట్లు పలికెను 


మావంటి వారు వేల కొలది మహాకాయులు నాల్గువైపులా పంప బడుచుండెను
సుగ్రీవునికనుచరులైన వేలకొలది కపిపుంగవులు భూమి అంతయు తిరుగుచుండెను 
వారిలోకొందరు 10 ఏనుగులు బలముగలవారును, మరికొందరు 100 ఎనుగులు బలముగల వారును
మావంటి ఇతరవానరులు సహస్త్ర ఎనుగుల బలము గలవారుకూడా ఉండెను 


కొన్దరు జల ప్రవాహముతొ సమాన బలము గలవారును
మరికొందరువాయ్వుతో సమాన బలముగాలవారును 
కొందరు వానరు వారిబలము ఇంతయని లెక్కకట్టలేని వారును
అట్టి బలముగలవారు నఖద్యాయుధములు ధరించినవారు ఇక్కడకు రాగలుగును 


లక్షలు కోట్లు అర్బుదముల సంఖ్యతొ గల హరివీరులను 
వెంట తీసుకొని మిమ్ము చంపగల సామర్ద్యముగల సుగ్రీవుడును 
భల్లూకముతో ఇక్కడకు వచ్చినా ఈ నగరము నాశనమగును
మీరు మరణించ గలుగును రావణుడు కూడా మరణించును 


మహాత్ముడైన ఇక్ష్వాకవంశ వీరుడైన రామునితోను
అకారణమున వైరము బెట్టుకొనిన రావణుడును  
 ఈ పుడమి నందు ఉండ జాలుడు అని పల్కెను 
హెచ్చరిస్తూ ఇంకాయుద్దము చేయాలని కోరికతో అక్కడే ఉండెను

శ్రీ సుందర కాండము నందు 43వ సర్గ సమాప్తము 

No comments:

Post a Comment