Friday 31 July 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (45 వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
      శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:





 45వ సర్గ (వాల్మికి రామాయణములోని 17శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుడు ఏడుగురు  మంత్రి  పుత్రులను వధించుట    )


రావణుడు మంత్రి కుమారులేడుగురిని పిలిచి  ప్రేరేపించెను 
 అగ్నితో సమానమైన కాంతి గల బలీయులైన మంత్రి కుమారులును 
అశ్వములు కట్టిన రధములపై  సైనికులు మారుతి  వద్దకు వచ్చెను
వారు జయమును సంపాదించుటకు ఒకరి కొకరు పోటీతో యుద్దము నకు వచ్చెను 


వారు స్వర్ణజాలములగల రధములలో పెద్ద పతాకముల తోను ఆయుధముల తోను  
ఉత్తమములైన అశ్వములతోను పెద్ద సైన్యముతోను యుద్దమునకు వచ్చెను
మేఘములవంటి వారు బంగారముతో చేసిన చాపములు ధరించి వచ్చెను
మంత్రికుమరులందరూ ఉస్చాహముతొ హనుమంతుని జయించాలని వచ్చెను  

కింకరులు మారుతి చేతిలో మరణించినట్లు తెలుసుకొనెను 
మంత్రి కుమారుల తల్లి తండ్రులు భాదలో మునిగి ఉండెను
భందువులకు మిత్రులకు వీరేమగుదురోనని భయము కల్గెను
 దు:ఖముతో వ్యాకులత్వముతొ సైనికులు తల్లితండ్రు లుండెను 


స్వర్ణాభరణములను ధరించి ఏడుగురు మంత్రి పుత్రులును
సైనికులతో ఆరాక్షసులు మారుతిపై వర్షాకాల మేఘాలవాలే కదిలెను
మేఘాల జల్లుమెదలడి కుంభవృష్టి లాగ భానాలు మారుతిపై  వేసెను 
హనుమంతుని కదలనీయకుండా అందరు కలసి భానములతో  భాదించెను 

ఇంద్రధనస్సుతో కూడి మేఘములను వాయుదేవుడు ఆడు కున్నట్లును
నిర్మలమైన ఆకాశము అంతా ఒక్కసారి అద్బుతమైన గాలి వీచెను
సైనికుల ప్రయత్నాలు విఫలము చేసి మారుతి ఎగురుచూ పరుగేట్టేను
 హనుమంతుడు మంత్రి పుత్రులపై భాణాలు వేసి వారితో క్రీడించెను


హనుమంతుడు భయంకరనాదము చూసి మంత్రి పుత్రులు భయపడెను 
ఆకాశ మండలమున అద్భుతమైన వెలుగుతో మారుతి ప్రకాశించెను 
మారుతి భీకర రూపమును దాల్చి చిక్కిన వారిని చిక్కినట్లు చంపెను
రాక్షసులకు పారిపోయే దారిలేక మారుతితో యుద్దముచేయలేక ఉండెను  
      
                                       
హనుమంతుడు కొందరిని అరచేతులతోను 
మరికొందరిని బలమైన పాదఘాతాలతోను 
ఇంకొందరును చేతిని మడిచి పిడిగ్రుద్దులతోను
మరికొందరిని వాడి అయిన గోళ్ళతో చీల్చి చంపెను 



కొందరి రాక్షసులను వక్క్షస్తలముపై పిడిగుద్దులతోను 
మరికొందరిని తొడల క్రింద ఇరికించి మదించి చంపెను
హనుమంతుని వేగమునకు ధ్వనికి కొందరు చనిపోయెను 
హనుమంతుని చేతిలో మంత్రి పుత్రులందరు చనిపోయెను


అప్పుడు ఏనుగులు  వికృతస్వరముచేయుచూ పరుకేట్టు చుండెను
గుర్రములు పెద్దగా సకిలిస్తూ క్రింద పడి చని పోయెను
విరిగిపోయిన రధములు, చత్రములు, ద్వజములు పడి ఉండెను
భీకరముగ రక్త మార్గముల మద్య  రాక్షసులు చచ్చి పడి ఉండెను   



అప్పుడు అనేక విధములైన స్వరములతో లంక అంతా మార్మోగెను 
పిక్కబలముగల కొందరు రాక్షసులు రావణునికి చనిపోయినట్లు చెప్పెను 
హనుమంతుడు అధికబలముతో పెద్దగా గర్జనచేసి అందరిని భయ పెట్టెను 
హనుమంతుడు ఇంకా యుద్దము చేయ దలచి తోరణము వద్ద కూర్చొనెను   

సుందర కాండ నందు 45వ సర్గ సమాప్తము

  

No comments:

Post a Comment