Thursday 30 July 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (44 వ సర్గ)


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
      శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:




 44వ సర్గ (వాల్మికి రామాయణములోని 20శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుడు ప్రహస్త పుత్రుడైన జంబుమాలిని వధించుట   )


బలవంతుడును, విశాలమైన దంష్ట్రముగల వాడును సమర్దుడును 
ప్రహస్తుని పుత్రుడును నగు జంబుమాలి యనే రాక్షసుడును
రాక్షసరాజగు రావణునిచే నాజ్ఞాపింపబడి, కొందరి సైనికులతోను 
ధనుర్ధారియై ఎర్రని వస్త్రమలను ధరించి యుయుద్దమునకు బయలు దేరెను 

ఆమహరాక్షసుడు కోపముచే కన్నులు త్రిప్పుచు ఇంద్రదనస్సును 
పోలినదియును నగు మహాదనస్సును,పిడుగు,వజ్రాయుదమును
అందమైన భాణములతోను అందర్ని ఆకర్షిమ్చుచే  సమర్దుడును
మహావీరుదైన కాపిని జయించాలని పట్టుదలతో బయలు దేరెను
గాడిదలు కట్టిన రధము నెక్కి వచ్చిన జంబుమాలిని చూసి సంతోషించెను
హనుమంతుడు వేగవంతుడిగా మారి సంతోషముతో గొప్ప ధ్వని చేసెను
జబ్బు మాలి కుడా ధనుస్సు చరచుటవల్ల ద్వని అన్నిదిక్కుల వ్యాపించెను
ఇరువురి ధ్వని వళ్ళ సముద్రఘోషకన్న మించిన శబ్దము వేలుబడెను 


మహాబాహువైన హనుమంతున్నీ జంబుమాలి తీవ్ర చూపులతొ చూసెను 
విజయము సాధించాలని ఆత్రుతతో తీక్షనములైన భాణములను మారుతిపై వేసెను
ఇంకా ముఖమునందు అర్ధచంద్రభాణములతోను శిరస్సుపై కర్ణయుక్త బాణములతోను   
బాహువులపై పది బాణములతోను తూట్లు పడేట్లుగా రక్తం కారే విదముగా కొట్టెను 


జంబుమాలి వేసిన భాణప్రబావమువలన హనుమంతుని మొఖము రక్తవర్ణముగా మారెను
సరత్కాలముపు సూర్యకిరణములచె విద్దమై వికసించిన పద్మమువలె ప్రకాసించెను
రక్తరంజితమైన ఆ ఎర్రని ముఖముపై ఆకాశమునుండి స్వర్ణ బిందువులు పడి నట్లును 
బిందువులచే సిక్తమైన విశాలమైన రక్త పద్మము వాలే ప్రకాశిమ్చు చుండెను 


బానాబిహతుడైన ఆ మహాకపి జమ్బుమాలిపై మిక్కిలి కోపము వచ్చెను
అప్పుడే హనుమంతుడు ప్రక్కన కనిపించిన పెద్ద బండను పెకలించెను
వేగవంతముగా త్రిప్పి ఆ బండను మారుతి జమ్బుమాలిపై విసిరెను
జంబుమాలి ఆ శిలను పది భానములతో తునా తునకలు చేసెను 


మహాబలశాలి ఐన హనుమంతుడు పెద్ద మర్రిచెట్టును పీకి జంబుమాలిపై విసిరెను 
జంబుమాలి వాడిఐన బాణములతో ఆ చెట్టును రెండుగా చీల్చి గాలిలోకి విసెరును 
వేగముగా ఐదు  బాణములను భుజముపైనాను, ఒక బాణము రొమ్ము పైనను 
జంబుమాలి పదిబాణాలతో హనుమంతుని ఉరము మధ్యను వేసి భాద కలిగించెను 


శరీరమంతా బాణములు గుచ్చుకొనగా హనుమంతునకు వేర్రికోపము వచ్చెను 
హనుమంతుడు అక్కడే ఉన్న అతి పెద్ద ఇనుప గదను తీసుకోని త్రిప్ప సాగెను 
 హనుమంతుడు గాలికన్న వేగాముగా త్రిప్పి జంబుమాలి విశాలమగు రొమ్ముపై విసేరెను
వెంటనే జంబుమాలి అవయవములు అలంకారములు చూర్ణమై పోగా చచ్చినేలపైపడెను 

రావణుని వద్దకు కొందరు రాక్షసులు పోయి జంబుమాలి  చూర్మమయ్యె నని చెప్పెను
రావణుడునిహిడైనాడు అన్న వార్త విన్న నంతనే కోపముగా కన్నులు ఎర్ర చేసెను
కన్నులను తీవ్రముగా త్రిప్పుచూ అమాత్య 7గురు పుత్రులను యుద్దము నకుపంపెను
ఆ అమాత్య పుత్రులు పోటి పడుచు నేనే విజయము సాధించాలని యుద్ద భూమికి వచ్చెను

శ్రీ సుందర కాండము నందు 44 వ సర్గ సమాప్తము

No comments:

Post a Comment