*శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-5*
*సీతను బలాత్కారముగా అనుభవింపుమని మహాపార్శ్వుడు రావణునికి తెలుపుట*
మహాబలుడగు మహాపార్శ్వుడు రావణునితో ఇట్లు విన్నవించెను.
తేనె త్రాగవలెనన్న ఉత్సాహముతో మృగములతో, క్రూర జంతువులతో నిండి యున్న అరణ్యమునకు వెళ్లి అవకాశము లభించినను తేనె త్రాగకుండా ఆలోచించువాడు మూర్ఖుడు. ఆలాగుననే దుష్కరమైన సీతాపహరణము తరువాత కూడా ఆలోచించుతూ ఆమెను భోగించకుండా యుండుట మూర్ఖత్వము.
*ఈశ్వర స్యేశ్వర: కో౭స్తి తవ శత్రు నిబర్హణ*
*రమస్వ సహ వైదేహ్యా శత్రూ నా౭౭క్రమ్య మూర్ధసు* 6.13.3
*బలాత్ కుక్కుట వృత్తేన వర్తస్వ సుమహాబల*
*ఆక్రమ్యా౭౭క్రమ్య సీతాం వై తథా భుంక్ష్వ రమస్వ చ* 6.13.4
శత్రుసూదనా! సర్వనియంతవు. మిమ్ములను నియమించు వాడు లేడు. తమరు స్వయముగా ఈశ్వరులు. మీకు ఈశ్వరులు ఎవరు? శత్రువులను నష్టపరచి మీరు సీతను పొందండి. కుక్కుటము వలె సీతతో ప్రవర్తించండి. బలముచే పదే పదే ఆక్రమించి అనుభవింపుము. కోరిక తీరిన తరువాత ఏ ప్రమాదము వచ్చినను వాటినన్నింటిని మీరు సమర్థముగా ఎదుర్కొనగలరు. అంతియే గాక మహాబలశాలురైన కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు యొక్క అండదండలు గలవు. మహాపార్శ్వుడు ఇట్లు నుడివిన తరువాత లంకేశ్వరుడు సంతోషించి ఈ విధముగా వచించెను. "బ్రహ్మదేవుని అనుగ్రహమును నేను ఆకాశమార్గమున పోవుచుండగా పుంజికస్థలయను అప్సరస అగ్నిజ్వాలవలె మెరయుచు ఆకాశమార్గమున పోవుట చూచితిని. అప్పుడామె నాకు భయపడి మబ్బులచాటున దాగికొని వెళ్ళుచుండెను. అంతట నేను ఆమెను వివస్త్రను గావించి, బలవంతముగా అనుభవించితిని. పిమ్మట ఆమె బ్రహ్మ భవనమునకు వెళ్లగా, బ్రహ్మ కుపితుడై ఇక నుంచి నేను ఎవరినైనా బలవంతముగా అనుభవించినచో నా శిరస్సు నూరు ముక్కలు అగునని శాపము ఇచ్చినాడు. ఆ శాపమునకు భయపడి నేను ఆమెను బలవంతముగా అనుభవించుటకు పూనుకొనుట లేదు. వెనుక రంభను బలాత్కరించినప్పుడు రావణునకు నలకూబరుడు కూడా ఇట్టి శాపమునే ఇచ్చెను. కానీ అతడు తక్కువ వాడని అనాదరించి రావణుడు మరల పుంజికస్థలను బలాత్కరించెను. ఇప్పుడు బ్రహ్మ శాపము ఇచ్చినాడు కావున ఇది అనుల్లంఘనీయము. సముద్రము వంటి వేగము, వాయువు వంటి గమనము గలవాడను. ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు కూడా నన్ను ఎదిరింపజాలరు. రాముడు నా సామర్ధ్యమును ఎరుగడు అని ప్రగల్బములను పలికినాడు.
రావణుడు అహంకారంతో కూడిన, వివేకము లేని సాధకుడు. పరస్త్రీ అనగా సాధకుడు తన వృత్తిని లేదా ధర్మమును విడచి పరవృత్తిని స్వీకరించుట. రావణునికి మండోదరి వృత్తి స్వధర్మము. సీతావృత్తి పరధర్మము. సీతావృత్తిని బలాత్కారముగా గ్రహించినచో, రావణ ధర్మము విఘటనము చెంది నూరు ముక్కలగునని ఆంతర్యము. *పిండే పిండే మథిర్భిన్న:* ప్రతి వ్యక్తి యొక్క పద్ధతి, బుద్ధి, ధారణ మరియు ధర్మము ప్రత్యేకముగా యుండును. తన ధర్మము ననుసరించియే సాధన చేయవలయును. పరధర్మ సేవన చేసినచో సాధకుడు నూరు భాగములై అధఃపతనము చెందును. *"వివేక భ్రష్టానాం భవతి విని పాతః శతముఖా"*
మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు మొదలగువారి ప్రగల్బ వచనములు, రావణుని శాప వచనములు విన్న తర్వాత ఇట్లు అర్థవంతమైన హిత వచనములు విభీషణుడు పలికెను. పర్వత శిఖరముల వలె మహోన్నతులు, కోరలు నఖములు ఆయుధములుగా గలవారు ఐన వానర ప్రముఖులు. శ్రీరాముని యొక్క బాణములు వజ్రాయుధము వలె తిరుగులేనివి. కావున వారు లంకా నగరంపై విరుచుకొని పడకముందే సీతాదేవిని శ్రీరామునికి అప్పగించుట ఎంతయేని సముచితము. ఇంకను బీరములు పలికిన వీరందరూ శ్రీరాముని ఎదుర్కొనలేరు. అంతియేగాక రావణుడు వ్యసనములకు బానిస అయ్యి యున్నాడు. మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు మొదలగువారి ప్రగల్బ వచనములు, రావణుని శాప వచనములు విన్న తర్వాత ఇట్లు అర్థవంతమైన హిత వచనములు విభీషణుడు పలికెను. పర్వత శిఖరముల వలె మహోన్నతులు, కోరలు నఖములు ఆయుధములుగా గలవారు ఐన వానర ప్రముఖులు. శ్రీరాముని యొక్క బాణములు వజ్రాయుధము వలె తిరుగులేనివి. కావున వారు లంకా నగరంపై విరుచుకొని పడకముందే సీతాదేవిని శ్రీరామునికి అప్పగించుట ఎంతయేని సముచితము. ఇంకను బీరములు పలికిన వీరందరూ శ్రీరాముని ఎదుర్కొనలేరు. అంతియేగాక రావణుడు వ్యసనములకు బానిస అయ్యి యున్నాడు. అందుకు ఇంద్రజిత్తు, విభీషణుని తీవ్ర పదజాలములతో దూషించెను. ఇంద్రజిత్తు మాటలను విని విభీషణుడు ఇంద్రజిత్తునితో నీవు బాలుడవు, నీకు బుద్ధి బలము చాలదు. నీవు ఇట్లు అర్థరహితముగా పలుకుట వలన ఆత్మవినాశనము తప్పదు. శ్రీరాముని బాణములు బ్రహ్మదండము (బ్రహ్మదండమనగా ప్రళయకాలము నందు అగ్నిజ్వాలలతో ప్రభవించెడి తోక చుక్క, విశ్వామిత్రుని అస్త్ర, శస్త్రములను నిలువరించిన వసిష్ఠుని చేతిలోని బ్రహ్మాండము) వలె నిప్పులు గ్రక్కునవి, తేజోవంతమైనవి, మృత్యుదేవతకు ప్రతిరూపములైనవి. యమపాశములవలె ప్రాణాంతకమైనవి. అట్టి రాముని శరములకు రణరంగమున ఎవ్వరు తట్టుకొనలేరు. అప్పుడు రావణుడు మిక్కిలి కోపముతో సకల లోకముల యందలి దాయాదుల స్వభావములను నేను ఎరుగుదును అని దురుసుగా పలికెను. శత్రువులతో కలసి హాయిగా జీవించవచ్చు. పగబట్టిన పాముతో కలసి హాయిగా ఉండవచ్చు. శత్రుపక్షపాతి అయిన సోదరుడని పేరుతో శత్రుత్వమును సాగించెడి సహజ శత్రువుతో జీవించుట దుశ్శకము. జ్ఞాతులు సహజ శత్రువులు. శత్రువు కంటే, సర్పము కంటే ప్రమాదకరమైనవారు. కనుక సహజ శత్రువులను దూరముగా యుంచవలెను. నీవు గూడ జ్ఞాతివి అగుటచే ఇప్పుడు నాకు ఆపద కలుగుటచే నన్ను దెబ్బ తీయుటకు ప్రయత్నించు చున్నావు. ఏనుగుకు ఏనుగే శత్రువైనట్లు జ్ఞాతుల వలననే ప్రమాదము. తామరాకుపై నీటిబొట్లు ఎంతసేపు యున్నను దానిని అంటుకొననట్లే నీవు నాతో ఎంతసేపు స్నేహము నటించినను, నీకు నాపై మనసులో స్నేహము కలుగదు. అప్పుడు విభీషణుడు, రాజా! మనసునకు నచ్చినట్లు మాటలాడెడి వారు అనేకులుగా యుందురు కానీ మేలు కలిగించెడి వారు ఎక్కడోగాని లభింపడు. నీవు ఇప్పుడు కాలిపోవుచున్న ఇంటిలో యున్నట్లు మృత్యుముఖంలో యున్నావు. రామబాణ ప్రవాహముతో కొట్టుకొని పోవక తప్పదు. అని చెప్పి విభీషణుడు వెళ్లెను.
*శ్రీరామ జయరామ జయజయ రామ*
--(())--
No comments:
Post a Comment