Sunday 23 February 2020

యుద్ధ కాండము-37

[05:49, 23/02/2020] +91 96180 14862: శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-37
అగస్త్య ముని ప్రభావము
అగస్త్య ఇతి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణా. తన తపః ప్రభావముచే వింధ్య పర్వతమును స్థంబింప చేసినాడు కావున ఈయనకు అగస్త్య మహర్షి అని పేరు వచ్చినది. ("అగమ్ (పర్వతం) స్థంభయతీతి అగస్త్య"). సూర్యుని మార్గమునకు (గమనమునకు) అడ్డు వచ్చుచున్న ఈ మహా పర్వతము అగస్త్యుని ఆదేశానుసారం పెరుగుట మానివేసింది. అట్టి ప్రభావశాలి అగస్త్య మహర్షి. స్పందన లేని శూన్య అవస్థకు "అగస్త్యుడు" అని పేరు. నిర్వికల్ప సమాధి అవస్థకు చేరిన తర్వాత ఈ శూన్య అవస్థ ప్రాప్తమగును. వృత్తి రహిత శూన్య అవస్థ యందు ఎల్లప్పుడును ఉండెడి ఉచ్చసాధకుని రామాయణకారుడు "అగస్త్యుడు" అని పేరిడెను. సంసారమును సాగరముతో పోల్చినారు. అలాంటి సాగరమును ఒకే ఆచమనముతో త్రాగినాడు. అటువంటి పరాక్రముడు, పురుషార్థి అగస్త్య మహర్షి. అరణ్యవాసంలో అట్టి  మహర్షి ఆశ్రమమున మూడు పగళ్లు, మూడు రాత్రులు శ్రీరాముడు ఉండెననగా రామసాధకుడు  శూన్య నిర్వికల్ప అవస్థ యందు మూడు రోజులు ఉండెను. వాల్మీకి రామాయణములో అగస్త్య ముని రెండు సార్లు గోచరమగును. మొదటి సారి అరణ్య కాండములో ...
త ద్ధను స్తౌ చ తూణీరౌ శరం ఖడ్గం చ మానద
జయాయ ప్రతిగృహ్ణీష్వ వజ్రం వజ్రధరో యథా   3.12.35
మహర్షి రాముడికి విష్ణు ధనుస్సుని (పూర్వము ఈ వైష్ణవ ధనుస్సు పరశురాముని నుండి శ్రీరామునికి చేరెను. అతడు దీనిని వరుణునికి ఇచ్చెను. ఆ వరుణుడు దీనిని అగస్త్యునికి ఇచ్చెను. ఇప్పుడు మరల అగస్త్యుడు రామునకు ఇచ్చెను), బ్రహ్మగారు ఇచ్చిన సూర్య తేజస్సు కలిగిన బాణాన్ని, ఇంద్రుడు ఇచ్చిన రెండు అక్షయబాణ తూణీరములు, ఒక బ్రహ్మాండమైన పిడి కలిగిన ఖడ్గాన్ని ఇచ్చి, వీటి ద్వారా జయాన్ని పొందు అని ఆశీర్వదించారు. రెండవ సారి యుద్ధ క్షేత్రములో ప్రత్యక్షమై ఆదిత్య హృదయమును బోధిస్తారు.
శ్రీరాముడు, వసిష్ఠ మహర్షి ద్వారా సమస్త జ్ఞానాన్ని తెలుసుకొన్న వాడైనప్పటికి, సర్వ శక్తిమంతుడు అయినప్పటికి, మాయా ప్రభావము వలన సీతాపహరణము తర్వాత దుఃఖితుడై మార్గోపాయము కానరాక అగమ్య గోచరంగా అరణ్యములో సంచరిస్తుండగా అగస్త మహర్షి ఏతెంచి శ్రీరాముని జ్ఞానమును గుర్తు చేసి కర్తవ్య బోధన చేసి పరమేశ్వరుని ప్రార్ధన చేయమని తద్వారా దుఃఖోపశమనము కలుగునని విరజా దీక్ష ఇస్తాడు. ఈ విధముగా శ్రీరాముని చాతుర్మాస్య దీక్ష వలన పరమేశ్వరుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రమును ప్రసాదించి జ్ఞానబోధ చేస్తాడు. ఇదియే శివ-రామ సంవాదరూపమైన పద్మపురాణాతర్గతమైన "శివగీత". (ఇది వాల్మీకి రామాయణములో లేదు).
కాళిదాసు రఘువంశములోను -- ఇంకా బృహత్ సంహిత లో వరాహమిహిరాచార్యుడు "Canopus" అనే అగస్త్య నక్షత్రము ఉదయించడము వర్ణించాడు. అగస్త్యుడు ఉదయించిన వెంటనే నదులన్నీ కూడా మడ్డి తేరుకొని  నిర్మలమైన నీళ్లతో ప్రవహిస్తాయి. టెలిస్కోపులో చూసిన  Scientists ఈ అగస్త్య నక్షత్రము సూర్యుని కంటే 50 లక్షల రెట్ల పెద్దదని, అది ఒక డిగ్రీలో పదోభాగము భూమికి దగ్గరగా వచ్చినా సముద్రాలు ఆవిరై ఇగిరి పోతాయని చెప్పారు. దీనిని బట్టి అగస్త్యుడు సముద్రాల్ని త్రాగాడని భావము. పూర్వము హిమాలయాలకు సూటిగా అగస్త్యుడు ఉత్తర దిశగా ఉదయించే వాడని (మహాభారతము, అరణ్య పర్వము - 101) ఆ తర్వాత భూమి యొక్క ధ్రువము తలక్రిందులుగా తిరుగుట మూలాన దక్షిణంగా ఒంగి, వింధ్యను దాటి ఉదయించాడని తెలియుచున్నది. ఇదియే అగస్త్యుని కథలో -- అగస్త్యమహర్షి వింధ్య పర్వతాల్ని దాటి రావడము. శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతిని పెండ్లి చేసుకున్నప్పుడు పెండ్లి "సదస్యుల" లో యున్న మహర్షులలో అగస్త్య మహర్షి గూడ యున్నారు. వేరొక కథనం ప్రకారం, శివ పార్వతుల కళ్యాణానికి దేవతలు,  ఋషులు అందరు హిమాలయాలకు వచ్చారు. అప్పుడు వారి శక్తికి ఉత్తరాన భూమి క్రుంగి పోవుచుండడం చూసి శివుడు అందరి శక్తికి ఇంచుమించు సమానమైన అగస్త్య భగవానులను దక్షిణ దిక్కున ఉండమని ఆదేశమిచ్చారు. అప్పుడు అగస్త్యులవారు కళ్యాణం చూడలేక పోతున్నందుకు చింతించుచుండగా వారికి అక్కడనుండి కూడా ప్రత్యక్షంగా చూసే వరాన్ని ప్రసాదించారు. అప్పటి నుండి అగస్త్యుడు దక్షిణాన ఉన్నారు. ఆ ప్రదేశము ప్రస్తుతము తమిళనాడులోని కుంభకోణము దగ్గర నల్లూర్ వద్ద ఉన్నదని స్థల పురాణము. అందువలన భూమి సరియైన తన కక్షలో ఉండునని చెప్పాడు. అంటే అగస్త్యుని బరువు మిగిలిన అన్నింటికీ సమానము అని తెలియును. (source: https://temple.dinamalar.com/en/new_en.php?id=367). This temple is known as "Sri Kalyansundareswar Temple" Nallur, near Kumbhakonam, Tamilnadu.  అగస్త్యుడు చెప్పినవి 26 ఋక్సంహిత వేదమంత్రాలు (ఋగ్వేదంలో 1.165వ శ్లోకం నుంచీ 1.191వ శ్లోకం వరకూ). వ్యాసులవారు చేసిన యజ్ఞంలో (అగస్త్యో వామదేవశ్చ జాబాలి రథాకాశ్యపః) అగస్త్యుడు మొదలగు ఋషులు యజ్ఞం చూడడానికి వచ్చారని వ్యాస మహర్షి భారతంలో వ్రాసారు. అంటే వీళ్ళు చిరంజీవులు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆవిరిగా యుండే వాళ్ళ ఆత్మ, వాళ్ళ శరీరాన్ని అట్టి ఆవిరి గడ్డకట్టించి (in the form of ice) స్థూల శరీరాన్ని ధరించగలరు. వారిని "నిర్మాణకాయులు" అంటారు. అంటే శరీరాన్ని ఎప్పుడు పడితే అప్పుడు నిర్మాణం చేసుకోగల సిద్ధపురుషులు. వీరికి మరణంతో పనిలేదు.  పురాతన జపనీస్ గ్రంథం అగస్త్యపర్వ అనేది అగస్త్యుని గురించి రాసిన పుస్తకం. ఈ పుస్తకంలో అగస్త్యుని గొప్ప మహర్షిగా, గురువుగా వర్ణిస్తూ రాశారు. ఈ పుస్తకం యొక్క 11వ శతాబ్దపు ముద్రణ ఇప్పటికీ లభ్యమవుతోంది అని శ్రీ వేదవ్యాస్, ఐఏఎస్ గారు చెప్పారు.
ప్రణవ పంచాక్షరోపనిషత్ప్రపంచంబు
               గడదాక నెఱిగిన కఱకలాని
వాతాపిదైత్యు నిల్వలునితో గూడంగ
                జఠరాగ్ని వ్రేల్చిన సవనరక్త
గోపించి నహుషుని గుంభీవసంబుగా
           హుంకార మిచ్చిన యుగ్రతేజు
వానకాలమునాడు వండునట్టిన నీటి
      కాలుష్య ముడిపెడు కతకఫలము
బాండుభాసిత త్రిపుండ్రాంక ఫాలభాగు
భద్రరుద్రాక్షమాలికా భరితవక్ష
వింధ్యగర్వాపహారి నాపీతజలధి
నయ్యగస్త్య మహర్షి న నభినుతింతు
           - (శ్రీ కాశీ ఖండము; 2. 180)   
ఈ అగస్త్య ముని ప్రభావము కొంత భాగము "అరణ్య కాండ - 5" లో వివరించడమైనది.
శ్రీరామ జయరామ జయజయ రామ
Only admins can send messages

No comments:

Post a Comment